breaking news
Sub-Divisional Police Officer
-
ఫ్రెండ్లీ పోలీసింగ్
నేరాల నియం్రత్రణ.. శాంతి భద్రతల పరిరక్షణ.. చోరీలను అరికట్టడం పోలీసు విధుల్లో కీలకమైనవి. నిత్యం కేసులతో బిజీగా ఉండే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (డీఎస్పీ) నర్రా వెంకటేశ్వరరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారారు. వివిధ రంగాలకు చెందిన వారితో మాట్లాడారు. కొవ్వూరు పట్టణ ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలపై ఆరా తీశారు. నర్సింగ్ కళాశాలకు వెళ్లి విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న పుష్కరాలలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీనియర్ సిటిజన్స్ నుంచి సలహాలు స్వీకరించారు. మేలైన పోలీస్ సేవలు అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై సూచనలు తీసుకున్నారు. చాగల్లు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పని తీరును పరిశీలించారు. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడారు. అక్కడికక్కడే వారికి పరిష్కార మార్గాలు చూపించారు. పేకాటలో పట్టుబడిన వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మరోసారి పట్టు బడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది. డీఎస్పీ : ఏమండీ. మీ నర్సింగ్ ఇనిస్టిట్యూట్లో ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారా. ప్రిన్సిపాల్ సత్యనారాయణ : కమిటీ లేదు సార్. గతంలో విద్యార్థులు బయటకు వెళితే ర్యాగింగ్ సమస్య ఉండేది. డీఎస్పీ : పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లారా. ప్రిన్సిపాల్ : పట్టణ పోలీసులకు రెండుమూడు సార్లు చెప్పాం. పోలీసులు గస్తీ పెంచడంతో ప్రస్తుతం ర్యాగింగ్ సమస్య త గ్గింది. డీఎస్పీ : ర్యాగింగ్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకుంటున్నారు. ప్రిన్సిపాల్ : సీనియర్ విద్యార్థులకు గెడైన్స్ ఇస్తున్నాం. బయట ర్యాగింగ్ సమస్యలుంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నాం. డీఎస్పీ : ఇక్కడంతా ఆడపిల్లలే ఉంటున్నారు. రాత్రిపూట భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రిన్సిపాల్ : ఇద్దరు వాచ్మెన్లు ఉన్నారు. కుక్కలు ఉన్నాయి. డీఎస్పీ : ఏమ్మా.. బయటికి వెళ్లినప్పుడు ర్యాగింగ్ సమస్య ఉందా? పాతాళ రాణి, విద్యార్థిని : గతంలో ఉండేది సార్. ప్రస్తుతం ఇబ్బందేమీ లేదు. డీఎస్పీ : పోలీసుల పరంగా ఏవైనా సమస్యలుఉన్నాయా. రాణి : మాది చాగల్లు మండలం మార్కోండపాడు. ఇంటిపక్కన వాళ్లు గొడవ పడి మా అమ్మను కొట్టారు. కేసు పెట్టినా ఏం చర్యలు తీసుకోలేదు సార్. డీఎస్పీ : కేసు పెట్టినప్పుడు కచ్చితంగా రశీదు తీసుకోవాలి. చాగల్లు పోలీసులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. డీఎస్పీ : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా. మద్దాల తబిత : మెరక వీధి వాటర్ ట్యాంక్ దగ్గర ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది సార్. రోడ్డు దాటడానికి జనం ఇబ్బంది పడుతున్నారు. డీఎస్పీ : జనం రోడ్డు దాటేందుకు అనువుగా ఆర్ అండ్బీ అధికారులతో మాట్లాడి జీబ్రా లైన్స్ వేయిస్తాం. ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు కానిస్టేబుల్ను ఏర్పాటు చేస్తాం. పులపా సత్యనారాయణ : బిచ్చగాళ్ల ముసుగులో గోష్పాద క్షేత్రంలో దొంగలు సంచరిస్తున్నారు. నేరస్తులకు ఈ క్షేత్రం అడ్డాగా మారింది. డీఎస్పీ : గతంలో ఒడిశా నుంచి వచ్చిన దొంగలను పట్టుకున్నాం. దొంగలపై నిఘా పెంచుతాం. డీఎస్పీ : రానున్న పుష్కరాలకు ఏవిధమైన చర్యలు తీసుకుంటే బావుటుందంటారు. సత్యనారాయణ : సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో అన్ని విభాగాల్లో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. సమాచార కేంద్రాల్లో మా సంఘం సేవలను ఉపయోగించుకోండి. డీఎస్పీ : ట్రాఫిక్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. డీజేజే పురుషోత్తం : మొయిన్ రోడ్డులో ఆక్రమణలు ఎక్కువయ్యాయి. విజయవిహార్ సెంటర్ నుంచి అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపివేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. డీఎస్పీ : ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. పుష్కరాలకు పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడ పెడితే బావుంటుంది. గత అనుభవాలు చెప్పండి. లక్ష్మీనారాయణ : బ్రిడ్జి దగ్గర పార్కింగ్ ఏర్పా టు చేస్తే బాగుంటుంది. ఈసారి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని పార్కింగ్ ప్రదేశాలను ముందుగానే గుర్తించాలి. యాళ్ల నరసింహరావు : పట్టణంలో చైన్ స్నాచింగ్స్ ఎక్కువయ్యాయి. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. డీఎస్పీ : రద్దీ సమయాల్లో బ్లూకోట్స్, రక్షక్ వాహనాలతో నిఘా పెడుతున్నాం. చోరీల నియంత్రణకు నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. నరసింహరావు : సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తే బాగుటుంది. డీఎస్పీ : పట్టణంలో అన్ని ప్రధాన కూడళ్లలో శాశ్వతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నాం. అపార్టుమెంట్స్లోనూ వాటి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. సున్నం సత్యనారాయణ : గోష్పాద క్షేత్రం సమీపంలో రాష్ట్ర రహదారికి ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. డీఎస్పీ : ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేయిస్తాం. ఎం.సత్యనారాయణ : మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చర్యలు తీసుకోండి. డీఎస్పీ : ఇప్పటికే ఎన్స్ఫోర్స్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులతో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నాం. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు పెడుతున్నాం. ప్రధాన కూడళ్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తాం. అక్కడి నుంచి చాగల్లు పోలీస్ స్టేషన్కు వెళ్లిన డీఎస్పీ అక్కడ ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ.. డీఎస్పీ :పోలీస్ స్టేషన్కు దేనికోసం వచ్చారు. పిన్నమని కృష్ణారావు : నా సైకిల్ చోరీకి గురైంది. ఫిర్యాదు చేయడానికి వచ్చాను సార్. డీఎస్పీ: కేసు నమోదు చేశారా. రశీదు ఇచ్చారా. కృష్ణారావు : రశీదు ఇస్తామన్నారు. డీఎస్పీ : మీరెవరు. ఏ సమస్యపై వచ్చారు. పేకాటరాయుళ్లు : పేకాట ఆడుతూ పట్టుబడ్డాం సార్. కోర్టులో ఫైన్ కట్టి వచ్చాం. డీఎస్పీ : మరోసారి పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటాం. చెడు వ్యసనాలకు బానిసలైతే కుటుంబాలు వీధిన పడతాయి. వాటి జోలికి పోకండి. పారేపల్లి కృష్ణవేణి : గత నెల 11న నాపై దాడిచేసి కొట్టి గాయపరిచిన నిందితులను అరెస్ట్ చేయడం లేదు. డీఎస్పీ : తక్షణమే అరెస్ట్ చేయిస్తాం. -
కేసులు వద్దు..మామూళ్లే ముద్దు
ఆయన అర్బన్ పరిధిలోని ఓ సబ్డివిజనల్ పోలీస్ అధికారి. ఉన్నతాధికారులను తన వినయవిధేయతలతో బురిడీ కొట్టించే సదరు అధికారి వసూళ్లలో రారాజు. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే కట్టడి చేయాల్సిన సదరు సారు టార్గెట్లు విధించి, వేధించి మరీ మామూళ్లు రాబడుతున్నారు. బార్, వైన్సషాపుల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని హుకుం జారీచేస్తున్నారు. మామూళ్లు వసూలు చేయలేమని చేతులెత్తేసిన వారిని శాఖాపరంగా ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మాట వినని వ్యాపారులను తన ఇంటికి పిలిపించుకుని మరీ దారికి తెస్తున్నారు. సివిల్ సెటిల్మెంట్లలో తలదూర్చడం నిత్యకృత్యంగా మారిన డీఎస్పీ అక్రమాలపై ‘న్యూస్లైన్’ ప్రత్యేక కథనం... దరు సబ్డివిజనల్ అధికారి మొదటగా బార్, వైన్స్ షాపులపై దృష్టి సారిం చారు. డివిజన్ పరిధిలో వీటి నుంచి ప్రతీ నెలా రూ. 1.20 లక్షలు మామూళ్ల రూపంలో ఆయా షాపుల నుంచి వసూలు చేస్తున్నారు. మద్యం ముడుపుల కేసులో కొందరు పోలీస్ అధికారులపై ఏసీబీ విచారణ కొనసాగుతున్నా సదరు అధికారి మాత్రం పాత పద్ధతిలోనే డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్యం షాపులు సరిగ్గా నడవక యజమానులు డబ్బులు ఇవ్వకపోవడంతో రెండు నెలలుగా ఓ స్టేషన్ నుంచి రావాల్సిన మామూళ్లు ఆగిపోయూరుు. దీంతో సదరు అధికారి అక్కడి ఎస్హెచ్ఓపై చిర్రుబుర్రులాడినట్లు తెలిసింది. అలాగే ఇసుక దందా ఎక్కువగా నడిచే ఒక్కో పోలీస్స్టేషన్ నుంచి నెలకు రూ.60 వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఐడీ పార్టీ కానిస్టేబుళ్లతో దందా.. తన వద్ద ఉన్న ఐడీ పార్టీ కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్తోనేదందా మొత్తం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక ట్రాక్టర్ల వ్యవహారం, బార్లు, గ్రానైట్లు అన్నింటి వద్ద ఈ కానిస్టేబుళ్లే వ్యవహారం చక్కబెడుతున్నారు. ఈ ఇద్దరే సదరు అధికారి పరిధిలోని స్టేషన్లలో సివిల్ తగాదాల్లో తలదూర్చుతూ సార్కు కనకవర్షం కురిపిస్తున్నారు. భూవివాదాల్లో ఒకవర్గం పక్షాన వకల్తా పుచ్చుకుని సెటిల్మెంట్కో రేట్ నిర్ణయించి వివాదాలను తమదైన శైలిలో పరిష్కరిస్తున్నట్లు తెలిసింది. అంతేగాక రోడ్డు ప్రమాద కేసులు, వాహనాలకు సంబంధించిన సెటిల్మెంట్లు, ఇతర కీలక కేసుల్లోనూ వీరు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా నటిస్తూ ఇరుపక్షాల నుంచి డబ్బులు గుంజుతున్నారు. గ్రానైట్లారీలు.. క్రషర్లు.. కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్ నగరం మీదు గా నిత్యం గ్రానైట్ లారీలు రాత్రి వేళల్లో వెళ్తుం టాయి. వీటిలో ఎక్కువగా సార్కు టచ్ లో ఉన్న గ్రానైట్ కంపెనీలకు సంబంధించినవే. ఈ డివి జన్ పరిధిలో ఎవరైనా కిందిస్థారుు ఉద్యోగి గ్రానైట్ లారీని పట్టుకున్నా.. వారిపైకేసు పె ట్టినా డీఎస్పీ ఆగ్రహానికి గురికావాల్సిందే. ఎం దుకంటే ప్రతీనెలా రూ.60 వేల వరకు సదరు కంపెనీ యజమానుల నుంచి సార్కు డబ్బులు ముడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే సబ్డివిజన్ చివ ర్లో ఉండే స్టేషన్ పరిధిలో మూడు క్రషర్లు ఉన్నాయి. వీటి నుంచి ప్రతీ నెల రూ.20 వేల చొప్పున ముడుతున్నట్లు సమాచారం. వీరిలో ఓ క్రషర్ యజమాని ఓ నెల మామూళ్లు ఇవ్వకపోవడంతో చేసేదిలేక స్థానిక పోలీస్ అధికారే తన జేబులో నుంచి బాస్కు ఇచ్చినట్లు సమాచారం. ఈ స్టేషన్ పరిధిలోని వైన్స నుంచి కూడా రూ.20 వేలు సబ్డివిజనల్ అధికారికి చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నారుు. సివిల్లో తగాదాలంటే ఇంట్రెస్ట్.. సదరు అధికారికి సివిల్ తగాదాలంటే మక్కువ ఎక్కువ. ఎందుకంటే పెద్దమొత్తంలో డబ్బులు ఒక్కసారిగా వస్తాయి కాబట్టి. నగర శివారు సమీపంలో ఓ భూవివాదంలో తలదూర్చిన సదరు డీఎస్పీ పిటిషనర్కు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని స్టేషన్లో బంధించాడు. ఇందుకు రూ.2 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే సివిల్ తగాదాలో తీసుకెళ్లిన సదరు వ్యక్తిని విడుదల చేయాలని ఒక రాజకీయ నాయకుడు ఉన్నతాధికారులను కూడా సంప్రదించారు. అయినా డీఎస్పీ ససేమిరా అన్నాడు. ఎంతకూ వదిలిపెట్టకపోవడంతో రాత్రి 9.30 గంటల ప్రాంతం లో డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన సదరు నాయకుడు డీఎస్పీ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా పోలీసులు తీసుకొచ్చిన వ్యక్తిని తన వెంట తీసుకువెళ్లారు. ఇదంతా జరుగుతున్నా సదరు డీఎస్పీ ప్రేక్షకపాత్ర వహించాడు తప్పా ఏమి అనలేకపోయాడు. ఎక్కువగా మాట్లాడితే తన బండారం బయటపడుతుందని భయపడి డీఎస్పీ హోదాలో ఉన్నా ఆయన వెనుకంజ వేయడం అప్పట్లో చర్చనీయూంశంగా మారింది. ఇదే సబ్డివిజన్ పరిధిలో హైవే మీద ఉన్న ఒక పాఠశాల యూజమాన్యంలో పార్ట్నర్స్ మధ్య ఇటీవల గొడవలు వచ్చాయి. ఇరువర్గాలు ఒకరికి తెలియకుండా మరొకరు సదరు అధికారిని సంప్రదించారు. ఇంకేముంది ఒక వర్గం నుంచి రూ.2 లక్షలు, మరో వ ర్గం నుంచి రూ.3 లక్షలు వసూలు చేశాడు. ప్రస్తుతం ఈ పంచాయితీ కొనసాగుతోంది. ప్రొబేషనరీలకు అభయహస్తం.. సదరు అధికారి పరిధిలోని పోలీస్స్టేషన్లలో అం దరూ ప్రొబేషనరీ ఎస్సైలే విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన వీరికి అమ్యామ్యాల వసూళ్లపై అవగాహన తక్కువే. అలాం టివారికి విధుల్లో చేరిన కొద్దిరోజులకే అందరినీ తన చాంబర్కు పిలిపించుకుని నెలవారీ టార్గె ట్లు విధించారు. అప్పాలో కఠోర శిక్షణ పూర్తి చే సుకున్న ప్రొబేషనరీలకు సదరు అధికారి అవి నీతి పాఠాలు చెబుతున్నారు. వారికి ఆదాయ వ నరుల గుట్టు విప్పి వివరిస్తున్నారు. ‘మీకు నే నున్నా.. ఏమై నా నేను చూసుకుంటా.’ అని భ రోసా ఇచ్చారు. ప్రొబేషనరీ పిరియడ్లో తమ కు ఏమైనా రిమార్క్ వస్తే సర్వీస్లో ఇబ్బంది ఉంటుందని కొందరు ఎస్సైలు ఆందోళనకు గు రవుతున్నప్పటికీ బాస్ చెప్పినట్లు వినకుంటే ఇ బ్బందులు వస్తాయని మిన్నకుండిపోతున్నట్లు తెలిసింది. రచ్చకెక్కుతున్న విబేధాలు.. డీఎస్పీ మామూళ్ల మత్తుతో అధికారులలో అభిప్రాయ బేధాలు తలెత్తుతున్నాయి. మామూళ్ల కోసం కిందిస్థాయి ఉద్యోగులను వేధించడం, వారిని పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ అనేకమార్లు అధికారుల మధ్య గొడవలు జరిగాయి. ఉన్నతాధికారి అని చూడకుండా కిందిస్థాయి ఉద్యోగులు పలుమార్లు ఆయనను నిలదీసిన సంఘటనలు అనేకం ఉన్నారుు. సారుకు కేసులంటే చిరాకు.. పోలీసులకు తమ బాధను చెప్పుకోవడానికి వ చ్చే బాధితులంటే సారుకు యమచిరాకు. బాధితులు వందలాదిగా వస్తున్నా కేసులు మాత్రం నమోదు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరకట్న వేధింపుల కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడమంటే సుతార మూ ఆయనకు ఇష్టముండదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన సారుకు కేసులు వద్దు.. బాధితులు వద్దు. కేవలం డబ్బులు ఇచ్చేవారు మాత్రమే కావాలి. ఇలాంటి అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించాలని పలువురు బాధితులు కోరుతున్నారు.