breaking news
Stunned
-
వింబుల్డన్ మ్యాచ్లో సందడి చేసిన గేమ్ ఛేంజర్ భామ.. ఫోటోలు
-
రద్దీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న డ్రైవర్లెస్ కారు.. నెటిజన్లు ఫిదా..!
బెంగళూరు: బెంగళూరు రోడ్లపై డ్రైవర్ లేకుండా నడుస్తున్న ఓ వింత ఆకారంలో ఉన్న వాహనం స్థానికుల్నిఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేదో బాలీవుడ్ మూవీలో కారు ఆకారంలో ఉన్న వాహనంలా ఉందని ఓ యూజర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బెంగళూరు అనే క్యాప్షన్ను జతచేసి పోస్టు చేశాడు. ఈ కారును చూసిన నెటిజన్లు ఇదేంటీ ఇలా ఉందని? ప్రశ్నించారు. డ్రైవర్ లేకుండా ఎలా ఇంత ట్రాఫిక్లో నడుస్తోందని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కారుని జీప్యాడ్ అని అంటారని ఓ యూజర్ క్లారిటీ ఇచ్చాడు. సెల్ఫ్ డ్రైవింగ్ కారుని మైనస్ జీరో అనే అంకుర సంస్థ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని మైనస్ జీరో సంస్థ తన ఇన్స్టా పేజీలో వివరంగా పేర్కొంది. ఇప్పటికే రెండు సార్లు ఈ వాహనం రోడ్లపై కనిపించిందని బెంగుళూరు వాసులు తెలిపారు. టెస్టింగ్లో భాగంగానే ఇలా రోడ్లపై కారు ప్రత్యక్షమైనట్లు సమాచారం. ఇది భారతదేశంలోనే మొట్ట మొదటి అటానమస్ వాహనం. On the streets of Bengaluru. @peakbengaluru pic.twitter.com/VtahXpa6Mh — anirudh ravishankar (@anrdh89) July 22, 2023 అయితే.. సంప్రదాయ కార్లకు భిన్నంగా ఉండే ఈ జీప్యాడ్కు స్టీరింగ్ ఉండదు. హై రిజల్యూషన్ కెమెరాలతో ట్రాఫిక్లోనూ నడుస్తోంది. ఈ కారులో మొత్తం 6 కెమెరాలు అమర్చారు. వీటి సాయంతో చుట్టూరా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తుంది. ప్రమాదం అనిపిస్తే వెంటనే వాహనం నిలిచిపోతుంది. ట్రాఫిక్ సమస్యను, రోడ్డు ప్రమాదాలను తగ్గించటంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చినట్లు మైనస్ జీరో తెలిపింది. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
'అతడు ఉగ్రవాదంటే నమ్మలేక పోతున్నా'
ఢాకా: కొన్నాళ్ల క్రితం తప్పిపోయిన తన కుమారుడు ఉగ్రవాది అని పోలీసులు నిర్థారించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యానని బంగ్లాదేశ్ లోని అవామీలీగ్ శాసన సభ్యుడు ఇంతియాజ్ ఖాన్ బాబుల్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు రోహన్ ఉగ్రవాదిగా మారడం ఊహించలేకపోయానన్నారు. మా ఇంట్లో ఉగ్రవాదానికి సంబంధించి ఎటువంటి సాహిత్యం లేదని, తన కుమారుడు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండకపోవచ్చని ఖాన్ అన్నారు. శుక్రవారం ఢాకాలోని హోలీ అర్టిసాన్ బేకరీలోకి చోరబడిన సాయుధులు 60 మందిని బంధించి అందులో 20 మంది విదేశీయుల్ని అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. నరమేధానికి కారణమైన ఆరుగురు ఉగ్రవాదుల్ని ఆర్మీ మట్టు పెట్టింది. ఇందులో ఐదుగురు ఉన్నత కుటుంబాలకు చెందిన వారున్నారు. వీరంతా 18 ఏళ్ల లోపున్న వారేనని, దేశీయ ఉగ్రవాద సంస్థ అయిన జమేతుల్ ముజాహుదీన్ బంగ్లాదేశ్(జేఎమ్ బీ) కి చెందిన వారని ప్రభుత్వం ప్రకటించింది.