breaking news
State Bank of Bikaner
-
ఎస్బీఐలో వచ్చే రెండేళ్లలో 10% ఉద్యోగాలు కట్
న్యూఢిల్లీ: దేశంలో దిగ్గజ బ్యాంకుగా ఉన్న ఎస్బీఐలో వచ్చే రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య 10 శాతం తగ్గనుంది. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకు ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐలో విలీనం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో శాఖలు, ఉద్యోగుల స్థిరీకరణపై దృష్టి పెట్టనున్న బ్యాంకు రెండేళ్ల కాలంలో ఉద్యోగుల నియామకాలను తగ్గించుకోవడంతోపాటు డిజిటైజేషన్ను అమలు చేయనున్నట్టు బ్యాంకు ఎండీ రజనీష్ కుమార్ తెలిపారు. ఉద్యోగుల సంఖ్య రెండేళ్లలో 10 శాతం మేర తగ్గే అవకాశం ఉందన్నారు. ఎస్బీఐలో ప్రస్తుతం 2,07,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్; ట్రావెన్కోర్; పాటియాలా; మైసూర్, హైదరాబాద్; భారతీయ మహిళా బ్యాంకులు విలీనం అవుతుండడంతో ఎస్బీఐ ఉద్యోగుల సంఖ్యకు 70,000 పెరిగి 2,77,000 కానుంది. ఉద్యోగుల సంఖ్య 2019 మార్చి నాటికి 2,60,000కు తగ్గు తుందని, అంతకంటే తక్కువే ఉండవచ్చని, విలీనం అనంతరం అసలు ప్రభావం తెలుస్తుందని రజనీష్ చెప్పారు. దీంతోపాటు ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయని, ఉద్యోగుల తొలగింపు మాత్రం పరిశీలనలో లేదన్నారు. వీఆర్ఎస్ అవకాశం ఇచ్చామని, ఏటా తగ్గే ఉద్యోగుల సంఖ్యలో అంతే మొత్తం భర్తీ చేయడం లేదని, డిజిటల్ చర్యల కారణంగానూ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఉద్యోగుల నియామకం ఆగదని, కాకపోతే 50% మేర తగ్గించుకుంటామని చెప్పారు. -
అనుబంధ బ్యాంకుల విలీనం ఇప్పుడే కాదు: ఎస్బీఐ
న్యూఢిల్లీ: అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకునే ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలించడంలేదని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐకు ఐదు అనుబంధ బ్యాంకులున్నాయి. వీటిలో స్టేట్బ్యాంక్ ఆఫ్ బికనీర్, ట్రావెన్కోర్, పాటియాలా, మైసూర్లతోపాటు, స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాయి. విలీన ప్రతిపాదనను ప్రస్తుతం చేపట్టలేదని బీఎస్ఈకి ఎస్బీఐ వెల్లడించింది. అయితే తగిన సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని తాజాగా పరిశీలిస్తామని తెలిపింది. ఇందుకు కనీసం కొన్ని నెలల సమయం పడుతుందని వివరించింది. ఇకపై మొబైల్ పీవోఎస్: మొబైల్ పాయింట్ ఆఫ్సేల్(ఎంపీవోఎస్) ఏర్పాటు చేసేందుకు వీలుగా ఎస్బీఐ ఈజీటాప్ మొబైల్ సొల్యూషన్స్తో జతకట్టింది. తద్వారా స్మార్ట్ఫోన్ల ఆధారంగా ఎంపీవోఎస్కు తెరలేపే యోచనలో ఉంది. రానున్న ఐదేళ్లలో స్మార్ట్ఫోన్ల ద్వారా బిల్ చెల్లింపులకు అవకాశమిచ్చే 5 లక్షల ఎంపీవోఎస్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు బ్యాంక్ డిప్యూటీ ఎండీ ఎస్కే మిశ్రా చెప్పారు.