-
విద్యుత్ బకాయిలు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని షెడ్యూల్ తెగల(ఎస్టీలు)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వరాలజల్లు కురిపించారు. ఎస్టీల విద్యుత్ బిల్లుల బకాయిలతో పాటు వారిపై ఉన్న విద్యుత్ కేసులన్నీ రద్దు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. డొమెస్టిక్ కేటగిరీలో ఎస్టీల విద్యుత్ బిల్లుల బకాయిలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కూలంకషంగా చర్చించి, బకాయిలన్నీ రద్దు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఎస్టీల్లోని అన్ని తెగలు, జాతులు సమైక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఎస్టీ ప్రజాప్రతినిధులే పూర్తి సమన్వయంతో ఎస్టీ తెగలు, జాతుల మధ్య ఐక్యత సాధించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.125కే విద్యుత్ కనెక్షన్.. రూ.70 కోట్లకు పైగా ఉన్న విద్యుత్ బిల్లు బకాయిలను రద్దు చేయాలని, ఇందులో రూ.40 కోట్లను ప్రభుత్వం తరఫున విద్యుత్ సంస్థలకు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మిగతా రూ.30 కోట్లను తాము మాఫీ చేస్తామని ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు వెల్లడించారు. ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్ కేసులు కూడా ఎత్తేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఎస్టీ ఇంటికి రూ.125 మాత్రమే ఫీజు తీసుకుని విద్యుత్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఒక్కో కనెక్షన్కు రూ.125 మాత్రమే దరఖాస్తు ఫీజు తీసుకుని కనెక్షన్ ఇస్తామని, ప్రతి ఇంటికి సర్వీస్ వైరు, ఇంటిలోపల వైరింగ్, రెండు లైట్లు ఏర్పాటు చేస్తామని, 50 యూనిట్ల లోపు వినియోగించే వారి నుంచి ఎలాంటి చార్జీ తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. ఎస్టీ వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్ ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,737 ఎస్టీ ఆవాస ప్రాంతాలుండగా, 8,734 గ్రామాల్లో త్రీఫేజ్ కరెంటు లేదని, సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికి ఇదో ఉదాహరణ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వారితో పాటు ఎస్టీ వ్యవసాయదారులందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించి, ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్మాణానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని పీసీసీఎఫ్ ఝాను ఆదేశించారు. ఎస్టీ ఆవాస ప్రాంతాలకు రోడ్లు.. ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ రహదారి సౌకర్యం కల్పించాలని, దీనికోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రిని సీఎం కేసీఆర్ కోరారు. రెసిడెన్షియల్ పాఠశాలల వల్ల ఎస్టీల పిల్లలకు ఎంతో మేలు కలుగుతోందని, ఈ పాఠశాలల్లో ప్రవేశానికి విపరీతమైన డిమాండ్ ఉన్నందున, మరికొన్ని పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. ఆదివాసీలకు ఎక్కువ అవకాశాలు రావడానికి వీలుగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి స్థానికులకే అవకాశం దక్కే విధానం తీసుకొస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీల స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. గొర్రెల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలను ఎస్టీలకు కూడా వర్తింపచేస్తామని చెప్పారు. ఇందుకోసం పథకాలు రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, జెన్కో–ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు, డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్రావు, మహేశ్దత్ ఎక్కా, ఎస్టీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రజత్కుమార్, కమిషనర్ లక్ష్మణ్, ఎంపీలు సీతారాంనాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్టీ ప్రజాప్రతినిధులతో కమిటీలు - అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు కచ్చితంగా రహదారి సౌకర్యం కల్పించే విషయంలో అధికారులతో సమన్వయం చేసుకోవడానికి సీనియర్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. - విద్య, స్వయంఉపాధి విషయాల్లో సమన్వయానికి ఎంపీ సీతారాంనాయక్ నేతృత్వంలో కమిటీని నియమించారు. - విద్యుత్కు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. -
ఎస్సీ, ఎస్టీల ఉచిత సూక్ష్మసేద్యం ఎత్తివేత
• తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం • 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయం • బీసీలకు 90 శాతం సబ్సిడీ 80 శాతానికి తగ్గింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచిత సూక్ష్మ సేద్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. వారికి 90 శాతం సబ్సిడీతో అందజేయాలని నిర్ణరుుస్తూ ఉద్యానశాఖ సంచ లన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, ఉద్యాన నర్సరీ సంస్థల కార్యనిర్వా హక సమావేశం శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్ మోహన్, ఉద్యాన కమిషనర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. సూక్ష్మసేద్యం కోసం ఇస్తున్న రారుుతీని తగ్గిస్తూ సమావేశం సిఫార్సు చేసిం ది. బీసీలకు, ఇతర సన్నచిన్నకారు రైతులకు ప్రస్తుతం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, దాన్ని 80 శాతానికి తగ్గించాలని... పెద్ద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 80 శాతం సబ్సిడీని 60 శాతానికి తగ్గించాలని నిర్ణరుుంచినట్లు తెలి సింది. ఈ పథకం కోసం కేటారుుస్తున్న నిధు ల్లో 16.05 శాతం ఎస్సీ రైతులకు, 9.55 శాతం ఎస్టీ రైతులకు, 64.40 శాతం సన్న, చిన్నకారు రైతులకు కేటారుుస్తారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా నష్టపోయేది ఈ వర్గాల రైతులే ఎక్కువగా ఉంటారు. నిధులు విడుదల చేయకపోవడం వల్లే... సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలని, అందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా సంబంధిత పరికరాలు అందించాలని ప్రభుత్వం మొదట్లో నిర్ణయం తీసుకుంది. ఇతర రైతులకు కూడా కేంద్రం ఇస్తున్న సబ్సిడీ కంటే ఎక్కువగా ఇస్తూ ఇప్పటివరకు అమలు చేసింది. కానీ ఆచరణలో ఆ మేరకు నిధులను విడుదల చేయడంలో సర్కారు విఫలమైంది. 2014-15లో 1.34 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయా లనేది ఉద్యానశాఖ లక్ష్యం. అందుకు ప్రభుత్వం రూ.350.08 కోట్లు బడ్జెట్లో కేటారుుంచి, 70,480 ఎకరాలకు రూ.191 కోట్లు మాత్ర మే విడుదల చేసింది. 2015-16 బడ్జెట్లోనూ 1.03 లక్షల ఎకరాలకు రూ.308 కోట్లు కేటారుుంచింది. లక్ష్యానికి మించి రెండున్నర రెట్లు డిమాండ్ వచ్చింది. దీంతో 1.6 లక్షల ఎకరాల దరఖాస్తులను సర్కారు పెండింగ్లో పెట్టింది. వాటికి కూడా సూక్ష్మ సేద్యం అందించాలంటే బడ్జెట్ కేటారుుంపు లకు తోడు అదనంగా రూ.337.3 కోట్లు కేటారుుం చాలి. అప్పుడూ నిధుల సమస్య ఎదురైంది. 2016-17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం రూ.290 కోట్లు కేటారుుంచింది. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరి పోదు. దీంతో నాబార్డు నుంచి రూ. వెరుు్య కోట్లు రుణానికి వెళ్లాలని నిర్ణరుుంచింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా భారీ సబ్సిడీ ఇస్తే తాము ఒప్పుకోబోమని నాబార్డు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నాబార్డును ఒప్పించేందుకు ముంబై వెళ్లేందుకు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి సిద్ధమయ్యారు. చివరకు నాబార్డు సబ్సిడీ నిర్ణయాన్ని ఇప్పుడు అమలులోకి తీసు కొచ్చినట్లు చెబుతున్నారు. -
నీలినీడలు
► జలప్రభ పనులు నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు జారీ ► ఇప్పటికే నిలిచిన నిధుల విడుదల ► విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతో తీవ్ర నిర్లక్ష్యం ► జిల్లాలో 556 బోర్ల పరిస్థితి ప్రశ్నార్థకం ఈ చిత్రంలో కనిపిస్తున్న వీరు వనపర్తి మండలం మెంటపల్లికి చెందిన దళిత రైతులు.. తమ క్లస్టర్ పరిధిలోని నలుగురు రైతులు కలిసి 10 ఎకరాల్లో ఇందిరా జలప్రభ పథకం కింద రెండేళ్లక్రితం బోరువేయించుకున్నారు. కరెంట్ కనెక్షన్ కోసం డ్వామా అధికారులు విద్యుత్లైన్ వేసేందుకు డీడీలు చెల్లించారు. రైతులు ట్రాన్స్కో అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. రేపు మాపు ! అంటూ కాలం వెళ్లదీశారు. ఇప్పటికీ కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. స్తంభాలు వేసుకోలేక..బోరు కొనుగోలుచేసే స్తోమత లేక వర్షాధారంగా మెట్టపంటలు సాగుచేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. వనపర్తి: నిరుపేద ఎస్సీ, ఎస్టీ రైతుల వ్యవసాయాభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా జలప్రభ పథకం మసకబారుతోంది. ప్రభుత్వం కొన్ని నెలలుగా నిధులు నిలిపివేయడంతో నిట్టూర్చుతోంది. దీంతో కొత్త లబ్ధిదారులకు మేలు చేకూర్చే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతానికి ఎక్కడి పనులు అక్కడే ఆపివేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీఅయినట్లు తెలుస్తోంది. జిల్లాను క్లస్టర్లుగా విభజించి వాటి పరిధిలో వర్షాధారంగా సేద్యం చేసుకుని జీవనం సాగించే దళిత, గిరిజన రైతులను ఎంపికచేసి ప్రతి పదెకరాలను ఒక బ్లాక్గా గుర్తిస్తారు. అందులోని రైతులకు ఉమ్మడిగా ప్రభుత్వం బోరువేయించి, విద్యుత్ మోటార్ను బిగించి పంటలు పండించుకునేందుకు ప్రోత్సాహం కల్పిస్తారు. అందుకు అయిన ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించాల్సి ఉంటుంది. 2011లో ప్రారంభమైన ఈ పథకం జిల్లాలో ఐదేళ్లలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ప్రభుత్వం తాజాగా నిధులు నిలిపేయడంతో 3వేల మంది ఎస్సీ, ఎస్టీ పేదరైతులకు చెందిన 556బోర్లు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయాయి. అమలు తీరిది.. జిల్లాలోని 64 మండలాల్లో పథకం ప్రారంభం నుంచి 45,297మంది రైతులకు సంబంధించిన 1,07,731.8 ఎకరాల భూమిని భూగర్భజల పరిశోధక శాఖ అధికారులు సర్వే నిర్వహించి రూ.26.29కోట్ల వ్యయంతో 5754బోర్లు వేయాలని సర్వేచేశారు. డ్వామా అధికారులు జిల్లాలోని 12 క్లస్టర్లలో 2523 పనులు చేసేందుకు ప్రభుత్వానికి నివేదించారు. కాగా, ప్రభుత్వం నుంచి 2134పనులకు మంజూరు ఇచ్చింది. ఈ ఐదేళ్లలో జిల్లావ్యాప్తంగా 1576 బోర్లు తవ్వించారు. వాటిలో కొన్నింటికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మరికొన్ని అంచనాల వద్దే ఆగిపోయాయి. కొన్ని క్లస్టర్లలో బోర్లువేసి ఏళ్లు గడిచినా విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం, మోటార్లను బిగించకపోవడంతో చుక్కనీరు పారకుండానే ఎండిపోయాయి. దీంతో రూ.కోట్లు వెచ్చించినా ప్రయోజనం నామమాత్రమే అన్న విమర్శలూ ఉన్నాయి. విద్యుత్శాఖ నిర్లక్ష్యం ఇందిరా జలప్రభ పథకం మొదటి అడ్డంకి విద్యుత్శాఖ నిర్లక్ష్యమే అని చెప్పాలి. బోర్లు డ్రిల్లింగ్ అయిన వెంటనే డ్వామా అధికారులు బోర్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని డీడీలు చెల్లించినా విద్యుత్లైన్లు ఏర్పాటు చేయడంలో తీవ్ర అలక్ష్యం వహించారు. బోరు వేసినప్పుడు నీళ్లొచ్చినా.. ఏళ్లపాటు వినియోగించకపోవంతో కొన్ని ఎండిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతరులు మరోబోరు వేసిన సందర్భంలోనూ నీళ్లు తగ్గిపోయిన సంఘటనలు ఉన్నాయి. -
ఎస్సీ, ఎస్టీలకు వ్యవసాయ యంత్రాలు
100 శాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ పని ముట్ల పరిశోధన విభాగం శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ దినోత్సవం, రైతు సదస్సులో మంత్రి మాట్లాడారు. దేశంలో యాంత్రీకరణకు అత్యధికంగా సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి లాభాలు పొందాలంటే యాంత్రీకరణ అవసరమన్నారు. ఎక్కువమంది రైతులకు ప్రయోజనం కలిగించేందుకు యాంత్రీకరణ పథకాల నిబంధనలను సరళతరం చేశామన్నారు. వచ్చే ఖరీఫ్కు వివిధ పంటలకు అవసరమైన 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ముందస్తుగానే రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఎరువులను కూడా బఫర్ స్టాక్ ఏర్పాటు చేశామన్నారు. కరువుకు సంబంధించి పెట్టుబడి రాయితీ కేంద్రం నుంచి సకాలంలో వచ్చినా రాకపోయినా వచ్చే ఖరీఫ్కు ముందే మే నెలలో రైతులకు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక అసిస్టెంట్ డెరైక్టర్ను నియమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి, వ్యవసాయ వర్సిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ వి.ప్రవీణ్రావు, పరిశోధన సంచాలకులు డాక్టర్ దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎన్.వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశలపై నీళ్లు
ఇందిర జలప్రభకు గ్రహణం * నిధులున్నా ముందుకు సాగని పనులు * జిల్లాలో సాగు లక్ష్యం 85 వేల ఎకరాలు * మూడేళ్లయినా 2,500 ఎకరాలకే మోక్షం * విద్యుత్ కనెక్షన్లకు రాని అనుమతులు * రైతుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం సాక్షి, ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభ పథకం జిల్లాలో అడుగు ముందుకు కదలడం లేదు. పథకం ప్రారంభించి మూడేళ్లయినా ఇప్పటివరకు కేవలం 2500 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చినట్లు సంబంధిత అధికారులు కాగితాల్లో చూపుతున్నారు. జిల్లాలో 85 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తేవాలన్నది ఈ పథకం లక్ష్యం. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వేలాది ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం ‘ఇందిర జలప్రభ’ ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టు అమలుకు మొత్తం రూ.196.5 కోట్లుమంజూరు చేసింది. ఇందులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్) కింద రూ.124 కోట్లు, నాబార్డు ద్వారా రూ.72 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఎస్సీ, ఎస్టీలకు చెందిన 85 వేల ఎకరాలు గుర్తించారు. ఒక్కో బ్లాకులో 10 నుంచి 200 ఎకరాల వరకు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ యోచన. ఎకరానికి రూ.16 వేల చొప్పున పది ఎకరాలకు రూ.1.60 లక్షలు ఖర్చు చేస్తారు. ప్రధానంగా సాగును దృష్టిలో పెట్టుకొని పది ఎకరాలకు సరిపడా నీరందేలా బోరు వేయిస్తారు. విద్యుత్ సౌకర్యం, మోటార్ పంపు, పైపులు అన్నీ ఉచితంగానే రైతులకు అందజేయాలి. విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేని భూములకు డీజిల్ ఇంజన్లు సరఫరా చేయాలి. అవసరమైన భూముల్లో జలవనరులను అభివృద్ధి చేసేందుకు చెక్ డ్యామ్లు, రాక్ పిల్ డ్యామ్లు, చెక్ వాల్స్ నిర్మించాలి. ఈ ప్రాజెక్టు అమలుతో జిల్లాలో 30,500 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రయోజనం కలగాలి. ఎక్కువగా ఏజెన్సీ మండలాల్లోని రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. అంచనాలు తారుమారు.. ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 2,879 బ్లాకులను గుర్తించారు. ఇందులో 1,770 బ్లాకులు సర్వే చేయ గా బోర్లు వేయడానికి 778 బ్లాకులు అనుకూలమని గుర్తించారు. సర్వే చేసిన బ్లాకులకు సంబంధించి ఇప్పటివరకు జిల్లాకు 1,846 బోర్లు మంజూరయ్యా యి. ఎంపిక చేసిన బ్లాకుల్లో 1,078 బోర్లు డ్రిల్ చేస్తే 78 ఫెయిలయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, జియాలజిస్టులు సరిగా అంచనా వేయకపోవడంతో ఈ బోర్లు ఫెయిల్ అయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. వీటి కోసం సుమారు రూ. 50 లక్షలు వృథా అయ్యాయి. మిగిలిన బోర్లలోనూ నీరు అంతంత మాత్రమే. మరికొన్ని బోర్లలో నీరున్నా నేటికీ విద్యు త్ సౌకర్యం కల్పించలేదు. భూగర్భ, జలవనరుల శాఖ అధికారులు సర్వే చేయించి ఎక్కడ భూగర్భ జలం ఉందో అక్కడే బోర్లు వేయించాలి. కానీ అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేయించడంతో బోర్లు ఫెయిలయ్యాయి. దీంతో తమ భూముల్లో సిరులు పండిస్తామని భావించిన ఎస్సీ, ఎస్టీ రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సా...గుతున్న పనులు.. జిల్లాకు రూ.196.5 కోట్లు మంజూరైతే ఈ మూడేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.10.94 కోట్లే. 920 బోర్లకు విద్యుత్ సౌకర్యం అవసరం కాగా ఇప్పటి వరకు 743 బోర్లకు మాత్రమే అనుమతి వచ్చింది. ఇంకా 177 బోర్లకు విద్యుత్ అనుమతి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే అనుమతి వచ్చిన చోటా మోటర్లను బిగించడం, పైపులై ను, విద్యుత్ స్తంభాల పనులు నత్తనడకన సాగుతుండడంతో రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ సహకారంతో భూములు సాగు చేసుకుందామనుకున్న రైతుల కలలు కల్లలయ్యాయి. ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మోడల్ బ్లాక్లోనూ కనిపించని సాగు.. 2011 నవంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చండ్రుగొండ మండలం కొండాయిగూడెంలో జలప్రభ పథకానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని 91 ఎకరాలను బ్లాకుగా తీసుకున్నారు. ఇందులో తొలుత 50 ఎకరాలకు సంబంధించి 4 బోర్లు వేశారు. ఆశించినంత నీరు లేకున్నా అక్కడ జిల్లా యంత్రాంగం సీఎంతో హడావిడిగా శంకుస్థాపన చేయించింది. ఈ బ్లాకులో 20 ఎకరాల వరకు అప్పట్లో మామిడి, ఆరటి, మిర్చి, జామాయిల్ సాగు చేశారు. బోర్లలో నీరు, విద్యుత్ సరఫరా, బ్లాక్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో సాగుచేసిన పంటల న్నీ నెలరోజులకే ఎండిపోయాయి. ప్రస్తుతం నాలుగు బోర్లకు గాను మూడింటిలో నీరు లేదు. మిగిలిన ఒక్కదాంట్లోనూ బొటాబొటిగానే ఉన్నా యి. ఈ పరిస్థితితో మోడల్ బ్లాక్గా తీసుకున్న ఈ భూమి కూడా బీడుగానే మిగిలింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement