breaking news
Sri Bhagwan
-
గీత... సనాతన సత్యం
గీతాశాస్త్రంలో ఉపదేశించిన విషయాలు కొత్తగా కల్పించబడినవి కావు. అవి సనాతనమైనవి. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్ (4-1)వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే బ్రవీత్. ‘‘అర్జునా! ఇది సనాతన విద్య. ఈ యోగవిద్యను నేనింతకు ముందు వివస్వతునికి ఉపదేశించాను. వివస్వతుడు దానిని తన కుమారుడైన వైవస్వత మనువుకు ఉపదేశించాడు. వైవస్వతుడు ఇక్ష్వాకు మహారాజుకు ఉపదేశించాడు. ఇట్లా పరంపరగా ఉపదేశించిన ఈ విద్య రాజర్షులకు తెలుస్తుంది. కాని చాలా కాలమైనందువల్ల ఈ విద్య మరుగున పడింది. నీవు నా భక్తుడివైనందువల్ల నీకు ఈ రహస్యాన్ని ఉపదేశిస్తున్నాను. స ఏవాయం మయా తే ద్య యోగః ప్రోక్తః పురాతనః (4-3) భక్తో సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్. ‘‘నీవు నాకు ప్రియమిత్రుడవైనందువల్ల నీ యెడల నాకు ప్రీతి కలిగింది. అందువల్ల నీ క్షేమాన్ని కోరి రహస్యమైన ఈ పరవిద్యను నీకు బోధిస్తున్నాను. శ్రద్ధతో విను’’ ఈ గ్రంథంలోని సూచనలను అనుసరించి భవబంధ విముక్తులైనవారు అనేకమంది ఉన్నారు. ఈ శాస్త్రాన్ని అనుసరించి పూర్వం ఎందరో ముముక్షువులు కర్మలు చేసి సంసిద్ధి పొంది ఉన్నారు. వారిలా ఇతరులు కూడా ఈ శాస్త్రాన్ని అనుసరించిన యెడల కృతకృత్యులు కావచ్చు. శ్రీ భగవాన్ ఉవాచ రుషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్బ్రహ్మసూత్రపదైవేశ్చైవ హేతుమధ్విర్వినిశ్చితైః (1304) ‘‘అర్జునా! ఈ విషయాలు మహర్షులచే పేదాలచే బహువిధాలుగా వివరింపబడి సిద్ధాతీకరింపబడి ఉన్నాయి. అంతేకాదు, ఈ సత్యాలు హేతువాదములచేత నిస్సందేహంగా నిర్ణయింపబడి బ్రహ్మసూత్రాలచేత నిశ్చయింపబడి ఉన్నాయి. ఇవి సనాతన సత్యాలు’’ ఉత్తమమైనది, పవిత్రమైనది, విద్యలలో శ్రే ష్ఠమైనది, పరమ రహస్యమైనదీ అయిన ఈ విద్య సుబోధకమైనది, అభ్యసించడానికి సులభమైనది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. కిటుకు తెలిస్తే అంతా సులభమే కావచ్చు కానీ దానిని తెలుసుకోవడం అంత సులువు కాదు. దానికోసం ఎంతో ప్రయత్నం చేయాలి. కూర్పు: బాలు- శ్రీని (వచ్చేవారం: ప్రయత్నం వ్యర్థం కాదు) మామిడిపూడి ‘గీత’ -
సామూహిక అత్యాచారం: నిందితులకు జైలు శిక్ష
16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు రాన్ సింగ్ (65), శ్రీభగవాన్ (44)లకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యూఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జ్ ఎం.సి.గుప్తా తీర్పు వెలువరించారు. అంతేకాకుండా ఒకొక్కరికి రూ. 30 వేల జరిమాన విధించారు. ఉద్యోగం పేరుతో బాలికకు రప్పించి ఆమెపై అత్యాచారం చేయడం హేయమైన చర్యగా జడ్జి అభివర్ణించారు. నిందితులలో రాన్ సింగ్ ఓ కంపెనీలో గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని బంధువుల అమ్మాయికి భరసా ఇచ్చాడు. అందుకోసం న్యూఢిల్లీ వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఆ క్రమంలో ఆ యువతి న్యూఢిల్లీలోని రాన్ సింగ్ రూమ్కు వెళ్లింది. దాంతో ఉద్యోగంపై మరో వ్యక్తితో మాట్లాడాలని చెప్పి ఆ యువతిని కారులో ఫామ్ హౌస్కు తీసుకువెళ్లాడు. అక్కడ సింగ్తోపాటు, మరో వ్యక్తి శ్రీభగవాన్ యువతిపై అత్యాచారం జరిపారు. దాంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఘటనపై విచారణ జరిపిన కోర్టు శనివారం శిక్షను ఖరారు చేసింది. 2003, డిసెంబర్ 6న యువతిపై అత్యాచార ఘటన చోటు చేసుకుంది.