-
ఒకే పతాకం కిందకు వస్తారా?
హైదరాబాద్ మహాసభలకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ‘విలీనం అంశం’ ఈ సభల ఎజెండాలో లేదని ప్రకటించడం విచారకరం. ఇలాంటి మాటలు, ప్రకటనలు ఏవీ వ్యక్తిగతాలు కావు. కానీ ‘ప్రపంచ కార్మికులారా, ఏకంకండి!’ అన్న మార్క్స్ ప్రధాన నినాదాన్ని సీపీఎం ఎందుకు గుర్తించడం లేదు? ‘ప్రపంచ పీడితులారా, ఏకంకండి’ అన్న లెనిన్ నినాదాన్ని మరిచిపోయినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నది? వీటి గురించి హైదరాబాద్ సభలలో కనీస చర్చ జరిగిందా? అయితే ఆ దిశగా అసలు కదలికే లేదని కాదు. కానీ శత్రువు సునామీ వలె దూసుకువస్తున్న నేటి సమయంలో ఈ నత్తనడకలు ఏం సాధించగలవు? హైదరాబాద్లో జరిగిన సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు కార్యకర్తలలో, అభిమానులలో కొత్త ఆశలను చిగురింపచేశాయి. ఏ మహాసభ అయినా విజయవంతమైనదా, లేదా అని తేల్చుకోవడానికి పాల్గొన్న ప్రతినిధులు, చర్చల స్థాయి, చర్చించుకున్న అంశాల ప్రాముఖ్యం, తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం, తదుపరి మహాసభల వరకు ప్రధాన కార్యదర్శి సహా వివిధ స్థాయిలలో ఎన్నికైన కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, వాటి పొందిక వంటి అంశాలను గమనిస్తాం. చివరిరోజు బహిరంగ సభ, అది ఇచ్చిన ఉత్సాహం, ప్రదర్శన తీరుతెన్నులు సామాన్య ప్రజానీకంలో, అభిమానులలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. ఆ విధంగా చూస్తే హైదరాబాద్ సభలు నిర్ణయాత్మకమైనవే. ఇందుకు తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తీసుకున్న ‘సమైక్య’ నినాదం సీపీఎంను ప్రజలకు దూరం చేసింది. ఫలితం ఏదైనా, సిద్ధాంతపరంగా పార్టీ వ్యవహరించిందని నాయకత్వం జబ్బులు చరుచుకోవచ్చు. కానీ ఆపరేషన్ విజయవంతమైనా, రోగి దక్కలేదన్న చందంగా తెలంగాణలో పార్టీ పరిస్థితి తయారైంది. కానీ పార్టీ ఆ∙నినాదానికైనా కట్టుబడి ఆంధ్రలో, హైదరాబాద్ పరిసరాలలో జన సమీకరణ కూడా చేయలేదు. ఒక నినాదం ఇచ్చి ఆపై ఇంత నిష్క్రియాత్వంతో పార్టీ వ్యవహరించడం ఇదే మొదటిసారి. పైగా సుందరయ్యగారి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’నినాదాన్ని సమైక్య ఆంధ్ర వాదనకు పునాదిగా చూపడం మరీ చిత్రం. సుందరయ్యగారిది అప్పటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ (1946) వైఖరి. తెలుగు ప్రజలంతా కలసి నూతన ప్రజాస్వామిక (ప్రజా) రాజ్యం ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. సుందరయ్యగారి చివరిదశలో వెంట ఉండి కొన్ని అంశాలను నేరుగా వారి నుంచే గ్రహించే అవకాశం నాకు దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత, ఇచ్చిన వాగ్దానాల మేరకు తెలంగాణకు మేలు జరగలేదు. ప్రాజెక్టులు, ఉపాధి, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలలో ఆ ప్రాంతం వెనుకబడిపోవడం ఆయనను బాధించింది. మద్రాస్ అపోలో ఆస్పత్రిలో ఉండగా కలుసుకోవడానికి వచ్చిన తెలంగాణ నేతలతో ఆ ప్రాంత వెనుకబాటు తనం మీద పోరాడాలని సూచించారు. అంతటి దయనీయ స్థితి నుంచి అక్కడి సీపీఎం శాఖ కోలుకోవడమే కాదు, కమ్యూనిస్టు ఉద్యమం పునరుజ్జీవం పొందగలదన్న విశ్వాసం కూడా మహా సభల ద్వారా కల్పించారు. ఇందుకు పార్టీ విభాగం, కార్యదర్శి వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు చేసిన కృషి ప్రశంసనీయమైనది. మనం చెప్పేది నాయకత్వం వినిపించుకోదని భావిస్తూ పార్టీ పట్ల నిరాశా నిస్పృహలతో ఉన్న మేధావులను కలసి చర్చించారు. త్యాగనిరతిలో, ప్రజలకు రక్షణగా కార్యకర్తలు ఎలా ఉండాలో మీకు తెలుసు. లోపాలు ఉంటే చెప్పండి. పొరపాట్లు ఉంటే చెప్పండి. సాధ్యమైనంతవరకు సరిదిద్దుకుందాం అని చెప్పారు. ఆ పార్టీ నేత చేపట్టిన విస్తృత మహాజన పాదయాత్ర ఫలితంగా ప్రస్తుతం టీమాస్ (తెలంగాణ ప్రజాసంఘాల వేదిక), బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్) వంటి రాజకీయ నిర్మాణాల ద్వారా ప్రజలను సంఘటితం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది కమ్యూనిస్టుల జైత్రయాత్రకు బాటలు వేస్తుందనీ, పార్టీని మళ్లీ ప్రజల వద్దకి చేరుస్తుందనీ విశ్వసిద్దాం. లాల్–నీల్ నినాదం వేళ్లూనుకుంటుందని ఆశిద్దాం. మీడియాలో వచ్చిన మేరకు మహాసభల చర్చల ధోరణి ఇలా ఉంది. లాల్–నీల్ ఐక్యత ఆవశ్యకత గురించి ప్రతినిధుల మధ్య కొంత చర్చ జరిగింది. అంతకంటే ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో ఒప్పందం చేసుకోవచ్చునా, చేసుకోకూడదా? లేదా ఈ రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయంగా మరొక సంఘటనను ప్రజాస్వామిక, లౌకిక శక్తులతో కలసి ఏర్పాటు చేయాలా? లేదా? అనే అంశంపైనే చర్చ జరిగింది. ఈ అంశం మీదే ప్రస్తుత, మాజీ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ల మధ్య పోటీ వచ్చిందనీ, బలాబలాలు గత ఆరుమాసాలుగా మారుతున్నాయనీ మీడియా ప్రచారం చేసింది. ఓటింగ్ జరుగుతుందని, ప్రధాన కార్యదర్శి మార్పు కూడా ఉండవచ్చునని కూడా కథనాలు వెలువడినాయి. మీడియాకు ఇలాంటి అంశాల మీద ఉన్న దృష్టి వాస్తవికతపై ఉండకపోవచ్చు. నిజానికి ఇలాంటి ప్రశ్న నాలుగు దశాబ్దాల క్రితమే తలెత్తింది. అత్యవసర పరిస్థితిని విధించి, నియంతృత్వంతో పాలించిన ఇందిరా గాంధీనీ, ఆమె పార్టీనీ ఓడిం చేందుకు అనుసరించవలసిన విధానం గురించి సీపీఎం అఖిల భారత వ్యవస్థాపక కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య చొరవ, దూరదృష్టి కారణంగా జలం ధర్ మహాసభలో తీవ్ర చర్చ జరిగింది. మతతత్వ బీజేపీతో ఎన్నికల అవగాహనకు కూడా రావాలని మిగిలిన పొలిట్బ్యూరో భావించింది. చివరకు ఏకీకృత ప్రతిపాదన ద్వారా అవగాహనకు వచ్చి పదో మహాసభ పార్టీ ఐక్యతను కాపాడుకుంది. నాలుగు దశాబ్దాల తరువాత కూడా ఈ 22వ మహాసభలు చర్చ తీవ్ర స్థాయిలోనే జరిగి, తుదకు మతతత్వం, నేటి మోదీ–షా దుష్టపాలనను అంతం చేయడమే అత్యంత కీలకమన్న విషయంలో ప్రతి నిధుల విజ్ఞత పుణ్యమా అని ఏకీకృత అంగీకారానికి నాయకత్వం రాగలిగింది. అలాగే ఎన్నికలలో అనుసరించవలసిన విధానం గురించి కూడా. కాంగ్రెస్తో అవగాహన, వివిధ రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులను గమనించుకుంటూ కీలక కర్తవ్యాన్ని నిర్వహించి ఎన్నికల తదుపరి నిర్ణయం తీసుకునేందుకు అంగీకారం కుదిరింది. ఇది కూడా అభినందనీయమే. నేడు దేశంలో దాదాపు మూడు డజన్లుగా చీలి పోయిన కమ్యూనిస్టు ఉద్యమ సంస్థల గురించి మహాసభలు లోతుగా చర్చించి ఉండవలసింది. కమ్యూనిస్టుల ఐక్యత ఎందుకు సాధ్యం కావడం లేదో, కనీసం పార్లమెంటరీయేతర పోరాటాలను సమన్వయం చేసుకుని పురోగమించాలన్న అవగాహనతో విభేదాలు అంతగా లేని సీపీఐ, సీపీఎంలు విలీనం దిశగా ఎందుకు ముందడుగు వేయలేక పోతున్నాయో వామపక్ష మేధావులకు సైతం అంతుపట్టడం లేదు. దశాబ్దం క్రితమే నల్లగొండలో నాటి సీపీఐ రాష్ట్ర మహాసభలలో సౌహార్ద్ర సందేశం ఇచ్చిన నేటి సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు ‘సీపీఎం, సీపీఐలు విడివిడిగా జరుపుకునే మహాసభలు ఇవే. వచ్చే రాష్ట్ర మహాసభలు ఒకే మహాసభగా జరుగుతాయ’ని ప్రతినిధుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించినట్టు గుర్తు. కానీ హైదరాబాద్ మహాసభలకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ‘విలీనం అంశం’ ఈ సభల ఎజెండాలో లేదని ప్రకటించడం విచారకరం. ఇలాంటి మాటలు, ప్రకటనలు ఏవీ వ్యక్తిగతాలు కావు. కానీ ‘ప్రపంచ కార్మికులారా, ఏకంకండి!’ అన్న మార్క్స్ ప్రధాన నినాదాన్ని సీపీఎం ఎందుకు గుర్తించడం లేదు? ‘ప్రపంచ పీడితులారా, ఏకంకండి’అన్న లెనిన్ నినాదాన్ని మరిచిపోయినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నది? వీటి గురించి హైదరాబాద్ సభలలో కనీస చర్చ జరిగిందా? అయితే ఆ దిశగా అసలు కదలికే లేదని కాదు. కానీ శత్రువు సునామీ వలె దూసుకువస్తున్న నేటి సమయంలో ఈ నత్తనడకలు ఏం సాధించగలవు? మరొక ప్రధాన అంశం ప్రస్తావించడం కూడా అవసరం. సుందరయ్యగారు కార్యదర్శిగా ఉండగా నాటి కార్యదర్శి వర్గ సభ్యులు లావు బాలగంగాధరరావును సహాయ కార్యదర్శిగా నియమించాలని ఒక సూచన వచ్చింది. అది అనవసరమని, సుందరయ్య కార్యదర్శిగా ఉండగా కార్యదర్శివర్గంలోని వారంతా సహకరించగలరని ఉద్దరాజు రామం వాదించారు. కానీ సుందరయ్యగారే, సహాయ కార్యదర్శి అని పేరు పెట్టడంలో తదుపరి కార్యదర్శి ఆయనే అనీ కాదు. ఆయననే కార్యదర్శిగా చేయకూడదని కూడా కాదు అని చెప్పారు. ఎల్బీజీ తరువాత కార్యదర్శి అయ్యారు (అప్పటికి సుందరయ్య కన్నుమూశారు). ఆ తరువాత అఖిల భారత మహాసభ సందర్భంగా పొలిట్బ్యూరోలోకి ఎల్బీజీనే తీసుకున్నారు. ఎల్బీజీ కంటే మోటూరి హనుమంతరావు అన్ని విధాలా అర్హుడనీ, ఆయనను కాదని ఎల్బీజీని ఎందుకు తీసుకున్నారని నేను పొలిట్బ్యూరోకి లేఖ రాశాను. ‘ఎల్బీజీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి. పొలిట్బ్యూరో సాధికారితకోసం తీసుకున్నాం’అని నాకు సమాధానం వచ్చింది. 22వ మహాసభల అనంతరం కూడా సీపీఎంను అలాగే అడగవలసి ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో సభలు దిగ్విజయంగా జరిగాయి. అలాంటి విభాగానికి పొలిట్బ్యూరోలో సాధికారతకు సభ్యత్వం ఇచ్చి ఉంటే బాగుం డేది. బీవీ రాఘవులు ఆంధ్రప్రదేశ్ తరఫున పొలిట్బ్యూరోలో ఉన్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర సాధికార ప్రతినిధి కాలేడు కదా! పైగా వీరభద్రం కూడా అందుకు అర్హుడే! పార్టీ నిర్మాణం, కార్యక్రమాల సక్రమ నిర్వహణ సాఫీగా సాగేందుకు ఇలాంటి సున్నిత అంశాలను కూడా పార్టీ దృష్టిలో ఉంచుకోవడం అవసరం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
కన్నీరొలికిన కాలం సాక్షిగా
తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల సాకారమైంది. రణరంగాలైన విశ్వవిద్యాలయాలు ఆనంద తాండవమాడుతున్నాయి. నోళ్లు తెరిచిన జైళ్లు నవ్వులు చిందిస్తున్నాయి. లాఠీలకు, తూ టాలకు, రైళ్లకు ఎదురొడ్డి నిలిచి, చెట్లకు వేలాడి, భగ్గున మండిన బిడ్డల త్యాగాల పంటను చూసి తల్లుల కళ్లు చెమరుస్తున్నాయి. కన్నీరొలికించిన కాలం సాక్షిగా, నెత్తురు చిందించిన చరిత్ర సాక్షిగా తెలంగాణ కన్ను తెరిచింది. రగిలిన విద్యార్థి హృదయాల నుంచి, అవి ఒలికించిన నెత్తుటి మడుగుల నుంచి మొలిచిన 1953 ముల్కీ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు ఊపిరి పోసింది. 370కి పైగా విద్యార్థి. యువత గుండె నెత్తురులతో ప్రజ్వరిల్లిన ‘1969’ ఆ ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటింది. వెన్నుపోటు పొడిచిన రాజకీయ నాయకత్వం తెలంగాణ ఆకాంక్షను పదవులుగా సొమ్ము చేసుకుంది. దగాపడ్డ తెలంగాణ కోస్త్రాంధ్ర భూస్వామ్య శక్తుల అణచివేతకు గురైంది. దాదాపు రెండు దశాబ్దాల ఆ చీకటి కాలం మరో ఉద్యమ వెల్లువను కడుపున మోసింది. 1990లలో ఆవిర్భవించిన తెలంగాణ జనసభ, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక వంటి సంస్థలు నివురుగప్పిన నిప్పును ఊది ఊది మండించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మలి దశకు నాంది పలికాయి. ఈ దశలోనే చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణను రక్తసిక్తం చేసింది. తెలంగాణ కోసం గళమెత్తిన బెల్లి లలిత, ఐలన్న వంటి కళాకారులను పాశవికంగా బలిగొంది. 2001లో టీఆర్ఎస్ పుట్టడానికి ముందటి ఈ రక్తసిక్త చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అయినా కొందరు 2001లో లేదా జేఏసీ ఏర్పడ్డ 2009లో ఈ మలి దశ ప్రారంభమైందంటూ కొందరు కట్టుకథలను చరిత్రగా అమ్మే ప్రయత్నం చేస్తుండటం నీతి బాహ్యం. నాటి బలిదానాల కొనసాగింపుగా జరిగినవే 2009 నాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, మిలిటెంట్ విద్యార్థి పోరాటాలు, వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలు, వెయ్యి మంది ఆత్మ త్యాగాలు. నెత్తుటి పొద్దయి మొలిచిన తెలంగాణ రాష్ట్ర సాధన ఖ్యాతి ఏ ఒక్కరిదో కానే కాదు. ఇది ప్రజలందరి పోరాటాల విజయం. ముంచు ‘వరం’ ముప్పు: తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినందుకు సంబురాలు జరుపుకుందాం. కానీ మన మూలాలను ముంచెత్తే పోలవరం ప్రాజెక్టు మీదుగా తెలంగాణ వచ్చిందనే విషాదకర వాస్తవాన్ని విస్మరించలేం. ఏ నాగరిక సమాజపు చారిత్రక, సాంస్కృతిక మూలాలు ఆదివాసుల్లోనే నిలిచి ఉంటాయి. పోలవరం ముంచెత్తనున్న ఆదివాసి ప్రాంతాలతో పాటే మన తెలంగాణ కుదుళ్లు కూడా శాశ్వతంగా అదృశ్యం కానున్నాయి. విశాఖలో బహుళ జాతి కంపెనీల కోసం ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక కారిడార్ అవసరాలే పోలవరం నిర్మాణపు ప్రధాన లక్ష్యమని చంద్రబాబు బహిరంగంగానే చెబుతున్నాడు. వెంకయ్యనాయుడుతో కుట్ర చేసి ఆసాధారణమైన ఆర్డినెన్స్ను తెచ్చి ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అందుకే ఇక్కడ మనం విజయోత్సవాలు జరుపుకుంటుండగా అక్కడ ఆదివాసులు నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వపు ప్రజా ఎజెండాలో మొదటి అంశం పోలవరం ముంచేయనున్న ఆదివాసుల పరిరక్షణే కావాలి. సాగు నీరు: మూడు జీవ నదులున్నా నేల తల్లి దాహార్తిని తీర్చలేని రైతాంగానికి తెలంగాణ రావడమంటే సాగు నీరు రావడమేనని ఆశలు కల్పించాం. వాటిని తీర్చడమే తొలి ప్రభుత్వపు ఎజెండాలోని రెండో అంశం కావాలి. భూములు పడావులు పడగా, పొట్ట చేతబట్టుకుని రైతులు, కూలీలు పట్టణాలకు తరలుతున్న దైన్య గ్రామీణ తెలంగాణకు కావాల్సింది ప్రజలను నిరాశ్రయులను చేసే పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు కావు. చిన్న చిన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యాన్నిచ్చి తక్కువ వ్యయాలతో ఎక్కువ ప్రయోజనాలను సాధించాలి. కాకతీయులు గొలుసుకట్టు చెరు వులతో లక్షలాది ఎకరాలకు నీరందించారు. చంద్రబాబు ప్రపంచ బ్యాంకు విధానాల ఫలితంగా అవి పూడుకుపోవడమో, తెగిపోవడమో జరిగింది. కొత్త ప్రభుత్వం వాటితో పాటూ జూరాల, సాగర్, శ్రీరాంసాగర్ ఎడమ కాల్వలకు మరమ్మతులు చేయిం చాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింపజేయాలి. పారిశ్రామిక రంగ పునరుజ్జీవం: చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణలోని వేలాది పరిశ్రమలు మూతబడ్డాయి. ఆల్విన్, హెచ్ఎంటీ, డీబీఆర్, అజాంజాహీ మిల్లు అందులో మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ పరిశ్రమలను పునరుద్ధరించి, వ్యవసాయాధార పరిశ్రమలను, చేతివృత్తులను ప్రోత్సహించి పారిశ్రామికీకరణకు నూతనోత్తేజాన్ని కల్పించడమే నూతన ప్రభుత్వానికి ప్రజల మూడో ఎజెండా. తెలంగాణ రావడమంటే ఉపాధి అవకాశాలు కలగడమేనని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. మాదిగ, కమ్మరి, కుమ్మరి, చేనేత వృత్తుల వాళ్లంతా ధ్వంసమైన తమ వృత్తులకు మంచి రోజులు రావడమేనని నమ్ముతున్నారు. కొత్త ప్రభుత్వం తక్షణమే ఆ వృత్తులను నవీకరించి పోటీ ప్రపంచంలో నిలిచేలా నిలపాల్సి ఉంది. అందుకు స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే మార్గం. విద్యారంగ పునర్నిర్మాణం: తెలుగు భాష నిరాదరణకు గురైన నిజాం పాలనలో 4 శాతం అక్షరాస్యతతో తెలంగాణ దేశంలోనే వెనుకబడిపోయింది. ఆ తదుపరి కోస్తా కమ్మ దొరల, పెట్టుబడిదారుల పాలనలో వివక్షకు గురై విద్యారంగం పుంజుకోలేకపోయింది. తెలంగాణ భాష, సాహిత్యం నిరాదరణకు గురయ్యాయి. తెలంగాణ చరిత్రకు పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కకుండా పోయింది. బాబు ‘విజన్-2020’ విద్యారంగం 70% పైగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయింది. చదువు అంగడి సరుకుగా మారి పేదలు, బడుగు వర్గాలకు అందకుండా పోయింది. దళితుల్లో 10%, బీసీల్లో 12%, ముస్లింలలో 8% మాత్రమే ఉన్నత విద్యకు నోచుకుంటున్నారు. కార్పొరేట్ శక్తులకు కళ్లెం వేసి, ఉన్నత విద్యకు బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్యను అందించడం కొత్త ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ కృషికి సహకరించి విద్యాప్రమాణాలను, నాణ్యతను పెంచాల్సిన బాధ్యత గురువులు, నిపుణులు, పౌరప్రభుత్వానిది. తెలంగాణ ఉద్యమంలో ఎనలేని త్యాగాలు చేసిన విద్యార్థి, యువత తెలంగాణతోపాటే ఉద్యోగాలు లభిస్తాయని ఆశలు పెట్టుకుంది. వాటిని నెరవేర్చడమే ఐదో ఎజెండా. తెలంగాణలో గుర్తించిన ఖాళీలే లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి వాటిని భర్తీ చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైరె జ్ చేస్తామనే వాగ్దానాన్ని తు.చ. తప్పక నెరవేర్చాలి. ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగాలను రద్దు చేసి పూర్తి కాలం ఉద్యోగులను నియమించాలి. స్థానిక వనరులతో చిన్న పరిశ్రమల స్థాపన, స్వయం ఉపాధి పథకాలతో యువత శక్తులను తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా వినియోగించుకోవాలి. త్యాగాలను చాలు బోసిన అమరుల కుటుంబాల్లో ఒక్కొక్కరికీ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి. తెలంగాణ ఆకాంక్షను సజీవంగా నిలిపిన కవులు, కళాకారులకు తగు గుర్తింపును, సహాయాన్ని అందించాలి. ప్రజా కళల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. తీవ్ర అణచివేతకు గురైన పౌర, ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అంతిమంగా ప్రజాస్వామిక విలువలు పరిఢవిల్లే తెలంగాణ ను రూపొందించుకోవాలి. (వ్యాసకర్త ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్) డాక్టర్ సి. కాశీం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement