-
విద్యాకమిటీ ఎన్నికలకు కసరత్తు
టీడీపీ ప్రభుత్వ పాలనలో విద్యాకమిటీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. విద్యాకమిటీలను కూడా తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంది. రెండేళ్ల క్రితం కమిటీలను నియమించినా నిధులు మంజూరు చేయకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు విద్యాకమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించింది. ఈ నెల 23వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): జిల్లాలో 3,456 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి.వీటితో పాటు మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. వీటికి మేనేజమెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ సంచాలకుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ విడుదల కానుంది. పాఠశాల విద్యాకమిటీ పదవీకాలం రెండేళ్లు. చంద్రబాబు ప్రభుత్వం 2016లో కమిటీలకు ఎన్నికలు నిర్వహించింది. రెండేళ్లకు ఈ కమిటీల పదవీకాలం ముగిసినా ఎన్నికల నిర్వహణపై ఆసక్తి చూపలేదు. దీనికి కారణం రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం పాఠశాలలకు సక్రమంగా గ్రాంట్ విడుదల చేయకపోవడమే అని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నమైన రీతిలో ఆలోచన చేస్తోంది. రెండేళ్లలో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని కొత్త ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పాఠశాలలకు అవసరమైన గ్రాంట్ కూడా ముందే విడుదల చేసింది. విద్యాకమిటీ ఎన్నికలు ఇలా.. ఒక్కొక్క తరగతి నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకుంటారు. ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు సంబంధించి 15 మందిని ఎన్నుకుంటారు. వీరిలో ఒకరిని విద్యాకమిటీ చైర్మన్గా ఎన్నుకుంటారు. ప్రతి విద్యాకమిటీలో కూడా 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు తప్పునిÜరిగా ఉండాలి. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు ముగ్గురు చొప్పున 21 మందిని ఎన్నుకుంటారు. వీరిలో ఒకరు చైర్మన్గా, మరొకరు వైస్ చైర్మన్గా ఉంటారు. ఉన్నత పాఠశాలలో తొమ్మిది మందిని సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరి నుంచి ఇద్దరు చొప్పున చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉంటారు. వీరితో పాటు ప్రతి పాఠశాల నుంచి ఆరుగురు ఎక్స్ అఫి షియో సభ్యులు ఉంటారు. కమిటీ విధులు ► మౌలిక వసతులు కల్పించడం ► విద్యార్థులు, ఉపాధ్యాయిల హాజరు పరిశీలన ► డ్రాప్ అవుట్స్ లేకుండా తగిన చర్యలు తీసుకోవడం ► పాఠశాలకు విడుదలైన నిధులు సక్రమంగా వినియోగించేలా చూడటం నేడు షెడ్యూల్ విడుదల విద్యా కమిటీ ఎన్నికలకు సోమవారం ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఈ నెల 16వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమై 23వ తేదీ లోపల ముగుస్తుంది. ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. – కె.మోహన్రావు, ఎంఈఓ, ఉదయగిరి -
ఇక స్కూల్ కమిటీలకు ఎన్నికలు...
సాక్షి, విజయనగరం : ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో విద్యాకమిటీల(ఎస్ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా తరువాత కమిటీలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర డైరెక్టర్ చిన్న వీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన విధి విధానాలు రూపొం దించి రెండురోజుల వర్క్షాపు ఇటీవల నిర్వహించారు. ఎస్ఎంసీ ఎన్నికల అధి కారులుగా ఎంఈఓ, సీనియర్ ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు. ఇంతవరకు ఉన్న ఎస్ఎంసీ సభ్యుల కాలపరిమితి గతేడాది ఆగస్టుతో ముగిసింది. అప్పటి ప్రభుత్వం ఎన్నికలు జరిపేందుకు ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విద్యాశాఖపై సారిస్తున్న ప్రత్యేక దృష్టి నేపథ్యంలో వాటి అభివృద్ధికి కీలకపాత్ర వహించాల్సిన ఎస్ఎంసీలను సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని 2,717 ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాం గం కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ ఇలా... విద్యాకమిటీ సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకుంటారు. వారిలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు. ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఒక మహిళ ఉపాధ్యక్షురాలిగా ఉంటారు. ఒక్కో తరగతి నుంచి ముగ్గురు తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుంటారు. ప్రాధమిక పాఠశాలలో గరిష్టంగా 15 మంది సభ్యులుండాలి. ఈ ఎన్నికల విధానంలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. పాఠశాలల అభివృద్ధి లో ఎస్ఎంసీలు కీలకపాత్ర వహిస్తాయి. ప్రస్తు తం అమ్మ ఒడి పథకం అమలు జరుగుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులచే బ్యాంకు అకౌంట్లు ప్రారంభించేలా చూడాల్సి ఉంటుంది. కమిటీ సభ్యులకు శిక్షణ ఎన్నికైన కమిటీలకు మండల కేంద్రాలలో శిక్షణ నిర్వహించనున్నారు. తర్వాత ప్రతినెలా ఈ కమిటీ సమావేశమవ్వాలి. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులతోపాటు ఇతర సదుపాయాలు కల్పించడానికి వీలుగా తీర్మానాలు చేసి అమలు చేయాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పాఠశాల నిర్వహణ, ఇతర గ్రాంట్లను ఖర్చు చేయడానికి ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయునితో జాతీయ బ్యాంకులో ఉమ్మడి ఖాతాను ప్రారంభించాలి. బోధన, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, పిల్లల హాజరు, విద్యా ప్రమాణాలు పెంపుదల వంటి పలు అంశాలను ఈ కమిటీలు చూడాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉన్న కమిటీలు నామమాత్రంగా పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని పాఠశాలల్లో అయితే మొక్కుబడిగా హాజరై సంతకాలు లేదా వేలిముద్రలు వేసి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పింది విని వెళ్లేవారు. అంతకుమించి పాఠశాలల అభివృద్ధిలో ఎస్ఎంసీలు క్రయాశీలకంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఎస్ఎంసీలను మరింత బాధ్యతాయుతంగా రూపొందించాలని ప్రభుత్వ ఆలోచన. ఎన్నికైన వెంటనే వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికైన సభ్యులకు శిక్షణ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల ఎన్నిక నిర్వహణకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి.తాజాగా జి ల్లాలోని పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలను క్రోడీకరిస్తున్నాం. ఎన్ని కల నిర్వాహణకు అవసరమైన చర్యలపై సమీక్షిస్తున్నాం. ఎస్ఎంసీల ఎన్నికలను అక్టోబర్లో ముగించి ఎన్నికైన కమిటీ సభ్యులకు మండల కేంద్రాల్లో శిక్షణ నిర్వహిస్తాం. – ఎం.కృష్ణమూర్తి నాయుడు, ఎస్ఎస్ఏ పీఓ -
26న ఎస్ఎంసీ ఎన్నికలు
అనంతపురం ఎడ్యుకేషన్ : కోరం లేక వాయిదాపడిన 76 స్కూళ్లలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి దశరథరామయ్య ఓ ప్రకటనలో తెలి పారు. జిల్లాలో మొత్తం 3866 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా, గతం లో 3855 పాఠశాలలకు ఎన్నికలు జరిగాయి. విద్యార్థుల సంఖ్య ‘0’ ఉన్న కారణంగా తొమ్మిది స్కూళ్లలో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 76 స్కూళ్లలో కోరం లేక వాయిదా పడ్డాయి. ఈ నెల 24న ఓటర్ల తుది జాబితా వెల్లడించాలని, 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఎన్నిక నిర్వహణ, 1 గంట నుంచి 2.30 గంటల దాకా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, 2.30 నుంచి 3 గంటల మధ్య చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించాలని పీఓ స్పష్టం చేశారు. -
కలకోవలో ఎస్ఎంసీ ఎన్నిక వాయిదా
కలకోవ (మునగాల) : మండలంలోని కలకోవ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. శుక్రవారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఉద్రిక్త వాతావరణలో ఎస్ఎంసీ ఎన్నికలు జరగడంతో ముందస్తుగా మునగాల ఎస్ఐ గడ్డం నగేష్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ ఎన్నికలకు సీపీఎం వర్గీయులు గైర్హాజరు కాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమికి చెందిన ఓటర్లు మాత్రమే పాల్గొన్నారు. పాఠశాలలోని ఒకటవ తరగతిలో 24మందికి 16మంది హాజరు కాగా, రెండో తరగతిలో ఏడుగురికి ఆరుగురు, నాలుగో తరగతిలో 17మందికి 9మంది హాజరు కాగా హెచ్ఎం జూలకంటి వెంకటరెడ్డి ఎన్నికలు నిర్వహించారు. తొమ్మిది మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదిలా ఉండగా మూడో తరగతిలో 10మందికి గాను నలుగురు, ఐదో తరగతిలో 16మందికి ఏడుగురు మాత్రమే హాజరు కావడంతో కోరం లేక రెండు తరగతులకు సంబంధించిన ఎన్నిక జరుగలేదు. దీంతో ఎస్ఎంసీ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా వేశారు. ఇదిలా ఉండగా సాయింత్రం వరకు డైరెక్టర్ల ఎన్నికకు సమయం ఇవ్వాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి వర్గీయులు ఎన్నికల పరిశీలకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ఎప్పుడు నిర్వహించేది మండల విద్యాధికారి అనుమతితో తేదీని ప్రకటిస్తామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. శనివారం ఎన్నికైన తొమ్మిది మంది డైరెక్టర్లలో కల్పన, కవిత, ఎం.లక్ష్మి, సీహెచ్.కవిత, ఉపేంద్ర, సోమయ్య, రమణ, శోభారాణి, బెల్లంకొండ కోటయ్య ఉన్నారు. -
రసాభాసగా ఎస్సెమ్సీ ఎన్నిక
వాయిదా వేసిన ఎంఈఓ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చౌకచెర్ల (విడవలూరు) : మండలంలోని చౌకచెర్ల ప్రాథమికోన్నత పాఠశాల ఎస్ఎంసీ ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపించింది. పాఠశాలకు ఈ నెల 1వ తేదీన ఎస్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 1 నుంచి 5వ తరగతి వరకు సభ్యులను ఎన్నుకున్నారు. 6 నుంచి 8వ తరగతి వరకు సభ్యుల ఎన్నికలో స్థానిక అధికార పార్టీ నాయకులకు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ ఎన్నికను వాయిదా వేశారు. శనివారం 6 నుంచి 8వ తరగతి వరకు సభ్యుల ఎన్నిక ప్రక్రియను మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. 6వ తరగతి విద్యార్థులకు సంబంధించి 22 మంది తల్లిదండ్రులు హాజరుకావాల్సి ఉంది. కాని 18 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో కూడా ఎక్కువ మంది వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్న విషయాన్ని గమనించిన టీడీపీ నాయకులు వారిని ప్రలోభాలకు గురి చేయడంతో పాటు బెదిరించారు. దీంతో 9 మంది సభ్యులు వెళ్లిపోయారు. వాస్తవంగా ఎన్నిక జరగాలంటే 10 మంది సభ్యులు ఉండాలి. కాని ఉన్న 9 మంది సభ్యులతోనే ఎన్నికల అధికారులు ఎన్నికను నిర్వహించారు. అయితే ఎన్నికకు కేవలం 9 మంది సభ్యులు ఉంటే చాలని ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యే ఫోన్లో అధికారులను బెదిరించడంతో ఇష్టానుసారంగా వ్యవహరించి, ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు. తమ పిల్లలకు బదిలీ సర్టిఫికెట్లను ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు. ఈ సమయంలో గంట సేపు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చేసేది లేక ఎన్నికల అధికారి (ఎంఈఓ) వెంకటేశ్వర్లు 7, 8వ తరగతులకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఎన్నిక జరిపించిన హెచ్ఎం 7,8 తరగతులకు ఎన్నికలను ఎంఈఓ వాయిదా వేస్తే పాఠశాల హెచ్ఎం సోమలింగేశ్వరావు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి తిరిగి 7, 8వ తరగతులకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నిక నిర్వహించి సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ నేతలు, అధికారులు నిలదీశారు. వివాదం నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని గుంపులుగా ఉన్న ఇరువర్గాల వారిని చెదరగోట్టారు. అనంతరం ఇరువర్గాలకు చెందిన నాయకులతో, ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరిపి, ఎన్నికలను నిర్వహించారు. చైర్మన్గా ఈదూరు సురేష్, వైస్ చైర్మన్ జయంతిని ఎన్నుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement