breaking news
sleeper class
-
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తుంటారా? అందులోనూ వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారా? అయితే మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన అప్డేట్ ఒకటి ఉంది. ఇండియన్ రైల్వే తాజాగా ఒక పెద్ద మార్పు చేసింది. స్లీపర్ క్లాస్ టికెట్లు ఇకపై ఖాళీగా ఉన్నప్పటికీ ఫస్ట్ ఏసీకి అప్గ్రేడ్ అవ్వవు. ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు ఒక వేళ సీట్లు అందుబాటులో ఇతర క్లాస్లలో సీట్లు కేటాయించేవారు. ఇకపై ఆ సౌకర్యం ఉండదు.ఆటో అప్గ్రేడ్ విధానం ఎలా పనిచేస్తుందో తాజగా జారీ చేసిన సర్క్యులర్లో రైల్వే బోర్డు స్పష్టం చేసింది. మీరు ఒక నిర్దిష్ట తరగతిలో టికెట్ బుక్ చేసుకుంటే అందులో సీట్లు అందుబాటులో లేకపోతే మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. ఒకవేళ ఇతర ఉన్నత తరగతులలో లభ్యత ఉంటే మీ సీటు ఆటోమేటిక్గా ఆ క్లాస్లోకి అప్గ్రేడ్ అవుతుంది. అయితే ఇది రెండు తరగతులకు మాత్రమే.సీట్ల అప్గ్రేడ్ ఇలా..స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, అప్గ్రేడ్ కొత్త క్రమం ఇలా ఉంటుంది.. 2S → 3E → 3A → 2A → 1Aఅయితే 2ఏ ప్రయాణీకులను మాత్రమే 1ఏ (ఫస్ట్ ఏసీ)గా అప్ గ్రేడ్ చేయవచ్చని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. మీరు స్లీపర్ లేదా 3ఈలో ఉంటే ఇకపై ఫస్ట్ ఏసీకి అప్గ్రేడ్ కాలేరు.సీటింగ్ క్లాస్ కోచ్లతో అప్గ్రేడ్ క్రమం ఇలా ఉంటుంది.. 2S → VS → CC → EC → EV → EAఇక్కడ కూడా సీసీ (చైర్ కార్) టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈసీ, ఈవీ లేదా ఈఏ వంటి ప్రీమియం తరగతులకు అప్ గ్రేడ్ అయ్యేందుకు అర్హులు. అలాగే సీటింగ్ క్లాస్, స్లీపర్ క్లాస్లకు మధ్య ఎలాంటి అప్గ్రేడ్కు అవకాశం ఉండదు.అప్గ్రేడ్ కోసం ఏమైనా చేయాలా?ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ‘ఓకే విత్ ఆటో అప్గ్రేడ్’ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ "యస్" క్లిక్ చేస్తే, మీ టిక్కెట్ అర్హత అప్గ్రేడ్కు పొందుతుంది. "నో" ఎంచుకుంటే, అప్గ్రేడ్ కాదు. ఒక వేళ మీరు ఏ ఆప్షన్నూ ఎంచుకోకపోతే సిస్టమ్ దానిని డిఫాల్ట్గా "యస్" గా తీసుకుంటుంది. -
వావ్..!అనిపించే వందేభారత్ స్లీపర్ కోచ్ (ఫొటోలు)
-
‘ఏసీ’ భారం.. జనరల్ ‘ఘోరం’
ఏ దేశంలో అయినా ఆయా ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఆదాయం దృష్టితో కాకుండా బాధ్యతతో వ్యవహరిస్తాయి. ప్రధానంగా మన దేశంలో పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చి నప్పుడు ఎక్కువగా ప్రయాణించేది రైళ్ల లోనే. అదీ స్లీపర్, జనరల్ కోచ్ల్లోనే. తక్కువ చార్జీతో గమ్యస్థానం చేరొచ్చనేదే పేదల ఆశ. అయితే కొంత కాలంగా రైల్వే శాఖ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. జనరల్, స్లీపర్ కోచ్ లను తగ్గించేస్తూ.. ఏసీ కోచ్లను పెంచేస్తూ ‘పక్కా వ్యాపారం’ చేస్తోంది. పర్యవసానంగా ఏ రైలులోని జనరల్ కోచ్ల్లో చూసినా పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు పడిపోయి.. ఒంటి కాలిపై నిల్చొని.. టాయ్లెట్స్ ముందు ఇరుక్కుని.. మెట్లపై వేలాడుతూ.. చెమటలు కార్చుకుంటూ.. చిన్నారుల ఏడుపుల మధ్య ప్రయాణం సాగించాల్సి వస్తోంది. 70–80 మంది ప్రయాణించాల్సిన కోచ్లో దాదాపు 500 మంది వెళుతున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుంది. హౌరా, పూరి, గౌహతి–బెంగళూరు ఎక్స్ప్రెస్, వివేక్ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్.. ఇలా ఒక్కటేమిటి రైళ్లన్నింటిలోనూ ఇదే దుస్థితి. ‘ఊరికి ఎలా వెళ్లాలి దేవుడా..’ అంటూ పేదలు వణికిపోతున్నారు.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు.. అనే నానుడికి ఇప్పుడు రైల్లో జనరల్ బోగీ ఎక్కిచూడు.. అనే వాక్యం కలుపుకోవాలి. రైలు ఎక్కాలంటే జేబులు గుల్ల చేసుకోవాల్సిందేనని సామాన్యులు హడలి పోతుండటం నేటి వాస్తవం. ఏసీ కోచ్లో వెళ్లాలంటే ఆరి్థక భారం.. స్లీపర్ కోచ్లు అందుబాటులో ఉండవు.. జనరల్ కోచ్లలో కాలు పెట్టేందుకే చోటుండదు.. ఇదీ సగటు రైల్వే ప్రయాణికుల దుస్థితి. రైల్వేల ఆధునికీకరణ, మెరుగైన సౌకర్యాల పేరుతో రైల్వే శాఖ పన్నిన మాయోపాయం పేద, దిగువ మధ్యతరగతి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ధనిక, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా రైళ్లను తీర్చిదిద్దడమే ఆధునికీకరణని రైల్వే శాఖ వక్రభాష్యం చెబుతోంది. సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండటం.. వారికి మెరుగైన వసతులు సమకూర్చడం అనే వాస్తవాన్ని విస్మరిస్తోంది. దాదాపు అయిదేళ్లుగా పక్కా పన్నాగంతో జనరల్, స్లీపర్ కోచ్ల సంఖ్యను తగ్గిస్తూ ఏసీ కోచ్ల సంఖ్యను పెంచుతోంది. కోచ్ల సంఖ్యే కాకుండా ఏకంగా దేశంలో జనరల్, స్లీపర్ కోచ్ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తూ... రాబోయే కాలమంతా ఏసీ రైలు ప్రయాణమేనని తేల్చి చెబుతోంది. కేవలం ఏసీ కోచ్లే అందుబాటులో ఉండేలా చేసి భారీగా టికెట్ల రాబడి పెంచుకోవాలన్న ఉద్దేశంతో సామాన్య ప్రయాణికులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ అంశంపై ‘సాక్షి’ దృష్టి సారించింది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లా కేంద్రాల మీదుగా ప్రయాణించే ప్రధాన రైళ్లలో పరిస్థితిని పరిశీలించింది. యశ్వంత్పూర్, వాస్కోడిగామా, కోరమండల్, హౌరా–చెన్నై మెయిల్, గౌతమి, శేషాద్రి, పద్మావతి, ఎల్టీటీ, అల్లెప్పి–ధన్బాద్, తిరుపతి–పూరి, నవ జీవన్, తిరుపతి –హౌరా, ప్రశాంతి.. ఇలా ఏ రైలు చూసినా ఏమున్నది గర్వ కారణం.. సమస్త రైళ్లలో తీవ్ర అవస్థల మయం.. అన్నట్లుంది జనరల్, స్లీపర్ కోచ్లలో ప్రయాణికుల పరిస్థితి. జనరల్, స్లీపర్ కోచ్ల కోత రైల్వే శాఖ ఓ ప్రణాళిక ప్రకారం నాలుగేళ్లుగా వందే భారత్ వంటి ఏసీ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్ల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. తద్వారా అధిక చార్జీలు ఉండే ఏసీ కోచ్ల వైపు ప్రయాణికులను మళ్లించడం ద్వారా అధిక ఆదాయ సముపార్జనకే పెద్దపీట వేస్తోంది. మరోవైపు దిగువ మధ్య తరగతి, పేద ప్రయాణికులు ప్రయాణించే స్లీపర్, జనరల్ కోచ్ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తోంది. 2019లో మొదలుపెట్టిన ఈ ప్రక్రియను మూడేళ్లుగా వేగవంతం చేసింది. సాధారణంగా ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రాయాణికుల కోసం సగటున 22 కోచ్లతో నిర్వహిస్తున్నారు. గతంలో రైళ్లలో జనరల్ కోచ్లు నాలుగు, స్లీపర్ కోచ్లు 12 వరకు ఉండగా.. థర్డ్ ఏసీ కోచ్లు మూడు, సెకండ్ ఏసీ కోచ్లు రెండు, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉండేవి. కానీ మూడేళ్లుగా రైలు కోచ్ల కూర్పును రైల్వే శాఖ అమాంతం మార్చేసింది. ప్రస్తుతం జనరల్ కోచ్లు రెండు, స్లీపర్ కోచ్లు 10కి తగ్గించింది. థర్డ్ ఏసీ కోచ్లు ఆరు, సెకండ్ ఏసీ కోచ్లు మూడు, ఫస్ట్ ఏసీ కోచ్ ఒకటిగా చేసింది. దాంతో ఒక్కో రైలులో స్లీపర్ కోచ్లలో దాదాపు 150 బెర్త్లు, జనరల్ కోచ్లలో 150 వరకు సీట్లు తగ్గిపోయాయి. పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఆధారపడే 300 సీట్లలో కోత పడింది. మరోవైపు ఏసీ కోచ్ల సంఖ్య పెరగడంతో వాటిలో 280 నుంచి 300 బెర్త్లు పెరిగాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే దసరా, దీపావళి, సంక్రాంతి, వేసవి సెలవుల స్పెషల్ రైళ్లలో అయితే స్లీపర్ కోచ్ల సంఖ్య కేవలం ఆరింటికే పరిమితం చేస్తూ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్ల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇటీవల ప్రధానమైన 40 రైళ్లలో ఏకంగా 100 ఏసీ కోచ్లను పెంచింది. వాటిలో థర్డ్ ఏసీ కోచ్లు 75, సెకండ్ ఏసీ కోచ్లు 20, ఫస్ట్ ఏసీ కోచ్లు 5 ఉన్నాయి. కొత్తగా ఎల్హెచ్బీ సాంకేతిక విధానంతో ఉత్పత్తి చేస్తున్న కోచ్లను ప్రవేశపెడుతున్నామనే సాకుతో స్లీపర్ కోచ్లను తగ్గిస్తూ ఏసీ కోచ్ల సంఖ్యను పెంచుతోంది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కోచ్ల ఉత్పత్తిలోనూ అదే వివక్ష కొత్త రైల్వే కోచ్ల ఉత్పత్తిలోనూ కేంద్ర ప్రభుత్వం పేద, సామాన్య ప్రయాణికుల పట్ల వివక్ష కనబరుస్తోంది. అయిదేళ్లుగా రైల్వే శాఖ ఉత్పత్తి చేస్తున్న కోచ్ల విధానమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని చెన్నై, కపుర్తలా, రాయ్బరేలీలోని కోచ్ ఫ్యాక్టరీలలో జనరల్, స్లీపర్ కోచ్ల ఉత్పత్తిని రైల్వే శాఖ క్రమంగా తగ్గిస్తూ... ఏసీ కోచ్ల ఉత్పత్తిని పెంచుతోంది. ఆ మూడు ఫ్యాక్టరీలలో 2019–20లో 997 ఏసీ కోచ్లను ఉత్పత్తి చేశారు. కాగా 2024–25లో ఏకంగా 2,571 ఏసీ కోచ్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మరోవైపు ఆ ఫ్యాక్టరీలలో 2019–20లో 1,925 జనరల్, స్లీపర్ కోచ్లను ఉత్పత్తి చేశారు. ఆ ఉత్పత్తిలో 85 శాతం కోత విధించి 2024–25లో కేవలం 278 కోచ్లే ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం. అంటే జనరల్, స్లీపర్ కోచ్ల స్థానంలో క్రమంగా ఏసీ కోచ్లను ప్రవేశపెట్టాలనే కార్యచరణ అమలు చేస్తోంది. 22 కోచ్లు ఉన్న రైళ్లలో కనీసం 18 ఏసీ కోచ్లే ఉండేట్టుగా చేయాలన్నది రైల్వే శాఖ అంతిమ లక్ష్యమని రైల్వే వర్గాలు చెప్పడం గమనార్హం. ‘స్లీపర్’లో దొరకదు.. ‘జనరల్’లో చోటు ఉండదు రైల్లో ప్రయాణం అంటేనే పేదలు, సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. స్లీపర్ కోచ్లో ప్రయాణం చేద్దామంటే రిజర్వేషన్లు దొరకడం లేదు. బెర్త్లు తగ్గిపోవడంతో రెండు నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. లేదంటే రిజర్వేషన్ దొరకదు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ విధానంలో రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ధర తడిసి మోపెడవుతోంది. జనరల్ కోచ్లో వెళ్లడం అంటే ప్రాణాలకు తెగించి సాహసం చేసినట్టే. ఒక జనరల్ కోచ్లో 72 నుంచి 80 వరకు సీట్లు ఉంటాయి. కానీ ఏ సమయంలో ఏ రైలులో జనరల్ కోచ్ చూసినా కనీసం 100 నుంచి 150 మంది వరకు ఉంటారు. ముగ్గురు కూర్చునే బెర్త్లో ఆరుగురు కూర్చోవడమే కాదు.. సీట్ల మధ్య ఖాళీల్లోనూ చివరికి లగేజీ పెట్టే రాక్ల మీద కూడా కూర్చొని కనిపిస్తారు. టాయిలెట్ల పక్కన ఒకరిని నెట్టుకుంటూ ఒకరు కూర్చోనో, నిలబడో పరస్పరం ఘర్షణ పడుతూ ప్రయాణిస్తుండటం అన్నది మన రైళ్లలో సర్వసాధారణమైంది. కనీసం నీళ్లు తాగుదామన్నా అవ్వదు.. టాయిలెట్కు వెళ్దామంటే కుదరదు.. కాలు కదుపుదామన్నా సాధ్యం కాదు.. మెట్లపైన సైతం వేలాడుతూ ప్రాణాలకు తెగించి ప్రయాణించే ప్రయాణికుల దృశ్యాలు మన రైళ్లలో నిత్యం ప్రతి రైల్వే స్టేషన్లోనూ కనిపిస్తాయి. అధిక రాబడే రైల్వే శాఖ లక్ష్యం అధిక రాబడే లక్ష్యంగా రైల్వే శాఖ ఏసీ కోచ్లకు పరిమితికి మించి ప్రాధాన్యమిస్తోంది. జనరల్, స్లీపర్ కోచ్లను తగ్గించి ఏసీ కోచ్లను పెంచితే అధిక రాబడి వస్తుందన్నది రైల్వే శాఖ ఉద్దేశం. ఉదాహరణకు గోదావరి ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి విశాఖపట్నంకు స్లీపర్ కోచ్లో టికెట్ రూ.255. అదే థర్డ్ ఏసీ అయితే 660, సెకండ్ ఏసీ అయితే 910, ఫస్ట్ ఏసీ అయితే రూ.1,551. ఈ లెక్కన స్లీపర్ కోచ్ కంటే థర్డ్ ఏసీ 100 శాతానికి పైగా, సెకండ్ ఏసీ 200 శాతంపైగా, ఫస్ట్ ఏసీ ఏకంగా 400–500 శాతం అధికం. రైల్వే శాఖ స్లీపర్ కోచ్లను తగ్గిస్తూ ఏసీ కోచ్లను పెంచడం వెనుక లోగట్టు అధిక రాబడే అని ఈ గణాంకాలు బట్టబయలు చేస్తున్నాయి. రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా 22 వేల రైళ్లను నిర్వహిస్తుండగా వాటిలో రోజుకు సగటున 13,500 రైళ్లు నిర్వహిస్తోంది. వాటిలో రోజూ 2.4 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఆ లెక్కన జనరల్, స్లీపర్ కోచ్లను తగ్గించి ఏసీ కోచ్లు మాత్రమే అందుబాటులో ఉండేట్టు చేస్తే టికెట్ల ద్వారా భారీ రాబడి సాధించవచ్చనద్ని రైల్వే శాఖ ఉద్దేశం. అంటే కేంద్ర ప్రభుత్వానికి లాభం.. సామాన్య ప్రయాణికులకు భారం. ఇదే రైల్వే శాఖ లెక్క.అమ్మో వందే భారత్ అత్యధిక చార్జీలతో పూర్తిగా ఏసీ కోచ్లతో నిర్వహించే వందే భారత్ రైళ్లకే కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తుండటం సామాన్యులకు భారంగా మారింది. దేశంలో కొత్తగా ప్రవేశపెట్టబోయే రైళ్లన్నీ వందేభారత్ రైళ్లేనని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే శాఖ ప్రస్తుతం దేశంలో 41 వందేభారత్ రైళ్లను నిర్వహిస్తోంది. వాటిలో ఏపీలో నాలుగు నిర్వహిస్తున్నారు. కాగా 2030 నాటికి 800 వందేభారత్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లలోని 40 వేల కోచ్లను కూడా వందేభారత్ కోచ్ల స్థాయికి ఆధునికీకరిస్తామని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఈ రైళ్లను నిర్ధిష్ట సమయంలో నడిపేందుకు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు.కాళ్లు కింద మోపలేం విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే గౌహతి–బెంగళూరు ఎక్స్ప్రెస్ మంగళవారం కిక్కిరిసి విశాఖపట్నం చేరుకుంది. ఈ రైలులో జనరల్, స్లీపర్క్లాస్లలో కనీసం కాలు మోపేందుకు కూడా ఖాళీ లేదు. ఈ రైలులో జనరల్4, స్లీపర్7, ఏసీ కోచ్లు 8 ఉన్నాయి. జనరల్ కోచ్లలో 200 మంది చొప్పున ఉన్నారు. స్లీపర్ కోచ్లో కేవలం 78 బెర్తుల చొప్పున మాత్రమే ఉన్నప్పటకీ రెట్టింపు ప్రయాణికులు కనిపించారు. డిబ్రూగడ్–కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ కూడా ఇదే విధంగా కిక్కిరిసి వెళ్లింది. ఈ రైలులో జనరల్ బోగీలు మూడు మాత్రమే ఉన్నాయి. ఉత్తరాంద్ర వాసుల ప్రధాన రైలు గోదావరి ఎక్స్ప్రెస్కు ఉన్న రెండు జనరల్ కోచ్లలో పరిస్థితి కనీసం కాలు మోపలేని విధంగా ఉంది. రెండు బోగీల్లో వెయ్యి మంది! ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడే తిరుపతి నగరం మీదుగా రోజూ పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తుంటాయి. ఈ రైళ్లలోని జనరల్ బోగీలన్నీ కిక్కిరిసి ఉంటాయి. హౌరా ఎక్స్ప్రెస్ రైల్లోని జనరల్ బోగీలో అయితే ఒకరిపై ఒకరు కూర్చొని, నిల్చొని ప్రయాణిస్తుండటం రోజూ కనిపిస్తుంది. బెంగళూరు నుంచి కాటా్పడి, తిరుపతి, రేణిగుంట, ఒంగోలు, విజయవాడ, శ్రీకాకుళం, పలాస మీదుగా హౌరాకు చేరుకునే ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసి నడిచింది. ఇందులో జనరల్ బోగీలు కేవలం రెండే ఉన్నాయి. ఈ రెండు బోగీల కెపాసిటీ 180 మంది. మంగళవారం సుమారు వెయ్యి మంది ప్రయాణించి ఉండొచ్చని అధికారుల అంచనా. అనేక మంది ఒంటి కాలుపై నిల్చుని ఉండటం కనిపించింది.ఉన్న వాటికీ ఎసరు ఏలూరులో మంగళవారం ఈస్ట్కోస్ట్ రైలు మధ్యాహ్నం 3.50 గంటలకు వచి్చంది. రెండే జనరల్ బోగీలున్నాయి. అప్పటికే ఆ బోగీ కిక్కిరిసి ఉంది. ఒక్క ఏలూరులోనే ఈ రెండు జనరల్ బోగీల్లో 60 మంది ఎక్కారు. ఒక్కో బోగీలో 150–200 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బాత్రూమ్ల వద్ద, నడిచే మార్గంలో, వాకిట్లో కూర్చున్నారు. మరి కొంతమంది రెండు బోగీలను కలిపే మార్గంలో టాయిలెట్లను ఆనుకుని కూడా కూర్చోనుండటం కని్పంచింది. కరోనా సమయంలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదు. మహిళలు, దివ్యాంగులు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఉండే బోగీ ఇప్పుడు కనిపించడం లేదు. ఉన్న రైళ్లనూ రద్దు చేస్తున్నారు.ఇదీ లెక్కరాష్ట్రంలో రోజూ సగటున ప్రయాణిస్తున్న రైళ్లు 340350ఇందులో విజయవాడ మీదుగా వెళ్తున్న రైళ్లు 280విజయవాడ నుంచి రోజూ రాకపోకలుసాగిస్తున్న ప్రయాణికులు 1,00,000మొత్తం ప్రయాణికుల్లో జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నవారు 40%స్లీపర్ క్లాసులో ప్రయాణిస్తున్నవారు 20%ఒక రైల్లో జనరల్ బోగీలు 10% -
త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్స్
న్యూఢిల్లీ: త్వరలో వందేభారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఆగస్ట్ 15వ తేదీ నాటికి వీటి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఇవి మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ఇవి త్వరలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుని పట్టాలెక్కే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు అంటున్నాయి. వీటితోపాటుగా, తక్కువ దూరంలో ఉండే నగరాల మధ్య ప్రయాణాల కోసం వందే మెట్రో లేదా వందే భారత్ మెట్రోగా పిలిచే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే మొదలవనుందని చెబుతున్నారు. -
ఓ మాజీ సీఎం.. అనూహ్య రైలు ప్రయాణం!
ఛోటామోటా నాయకులే కాదు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు తాము వీఐపీలుగా భావించుకుంటూ విలాసాలు కోరుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో ఓ మాజీ ముఖ్యమంత్రి అతి సాధారణ వ్యక్తిలాగా స్లీపర్ క్లాస్ రైలు కపార్ట్మెంట్లో ప్రయాణించారు. ఎవరూ ఊహించనిరీతిలో 160 కిలోమీటర్లు మామూలు బోగీలో ప్రయాణించి.. తోటి ప్రయాణికులతో మమేకమయ్యారు. డాబూ, దర్పాలకు పోకుండా సామాన్యులతో మమేకమై.. సామాన్యుడిలా ఆయన చేసిన ప్రయణంపై ఇప్పుడు సోషల్మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనే కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ. మొన్నటివరకు సీఎం పదవిలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకుడు గత సోమవారం స్లీపర్ క్లాస్ కపార్ట్మెంట్లో 160 కిలోమీటర్లు ప్రయాణించి కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన నిరాడంబర ప్రయాణం ఫొటోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో తమను వీఐపీల్లాగా చూడాలని, ప్రత్యేక ధరతో టికెట్లు ఇవ్వాలని, వీఐపీ లాంజ్లోకి అనుమతించాలని, ఇంకా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కొందరు ఎంపీలు కొన్ని వారాల కిందట కోరిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మాజీ సీఎం జరిపిన ఈ సాధారణ ప్రయాణాన్ని నెటిజన్లు కీర్తిస్తున్నారు. తన ప్రయాణంపై మాజీ సీఎం ఊమెన్ చాందీ స్పందిస్తూ ‘పెద్దగా రద్దీ లేని స్లీపర్ క్లాస్ రైళ్లలో ప్రయాణించడానికి నేను ఇష్టపడతాను. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు రైల్లోనే వెళుతాను. దీనివల్ల ప్రజలతో మమేకమవ్వొచ్చు. లేకపోతే ఒంటరితనంగా తోస్తుంది. వీఐపీ అన్న భావనపై నాకు నమ్మకం లేదు’ అని పేర్కొన్నారు. గత మే నెలలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఊమెన్ చాందీ సీఎం పదవి నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన గతంలోనూ పలు సందర్భాల్లో సాధారణ ప్రయాణికుడిలా బస్సు ప్రయాణం చేశారు. -
వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు అదనపు బోగీ
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ-చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (12797/12798) కు శాశ్వత ప్రాతిపదికన ఒక స్లీపర్క్లాస్ బోగీని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-చిత్తూరు ప్రయాణికులకు శని వారం (నవంబరు 29) నుంచి, చిత్తూరు-కాచిగూడ ప్రయాణికులకు ఆదివారం (నవంబరు 30)నుంచి ఈ అదనపు బోగీ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
స్లీపర్ కోచ్లు మాయం.. ఇక ఏసీల యుగం!!
రైళ్లలో స్లీపర్ కోచ్ అంటే.. సామాన్యులు చాలామంది ఎంచుకునే బోగీ. ఏసీ తరగతి అంటే కాస్తంత ఎగువ మధ్యతరగతి నుంచి ఆ పైవాళ్లు మాత్రమే ప్రయాణిస్తారు. కానీ ఆదాయంపై కన్నేసిన రైల్వేశాఖ క్రమంగా చాలావరకు సూపర్ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉన్న స్లీపర్ క్లాస్ బోగీలన్నింటినీ క్రమంగా ఏసీ బోగీలుగా మార్చేయాలని తలపెడుతోంది. ముందుగా ఈ ప్రయోగం దక్షిణ రైల్వేలో మొదలయ్యింది. ఇప్పటికే అక్కడ కొన్ని రైళ్లలో ఒక్కో స్లీపర్ బోగీని తీసేసి.. వాటి స్థానంలో ఏసీ బోగీలు అమరుస్తున్నారు. ఇది గనక విజయవంతం అయితే రాబోయే ఐదారేళ్లలో చాలావరకు స్లీపర్ క్లాస్ బోగీలు ఏసీలుగా మారిపోతాయి. ముందుగా ఎర్నాకులం-నిజాముద్దీన్ మంగళా ఎక్స్ప్రెస్ (రైలు నెం. 12617)లోని ఎస్-2 బోగీని ఏసీ బోగీగా మార్చేసి దాని పేరును కూడా బి-4గా మార్చారు. ప్రస్తుతం ఈ రైల్లో 11 స్లీపర్ బోగీలు, మూడు త్రీటైర్ ఏసీ బోగీలు, రెండు టూటైర్ ఏసీ బోగీలు ఉన్నాయి. తాజా మార్పుతో స్లీపర్ బోగీల సంఖ్య 10కి తగ్గి, త్రీటైర్ ఏసీ బోగీలు నాలుగు అవుతాయి. ఎర్నాకులం నుంచి నిజాముద్దీన్ (ఢిల్లీ)కి స్లీపర్ క్లాస్ టికెట్ 925 రూపాయలు కాగా, త్రీటైర్ ఏసీ టికెట్ 2,370 రూపాయలు. అంటే, ఒక్కో ప్రయాణికుడి మీద అదనంగా 1445 రూపాయల చొప్పున భారం పెరుగుతుంది. మొత్తం ఒక బోగీలో ఉండే 72 సీట్లకు కలిపి దాదాపు లక్ష రూపాయల అదనపు ఆదాయం రైల్వే శాఖకు వస్తుంది.