-
యోగి కోటలో హోరాహోరీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. దేశమంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆరు, ఏడు దశల ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. ఇప్పటికే 292 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ సజావుగా సాగింది. గురువారం మరో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ తేదీన ఏడో దశతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. దేశ రాజకీయాలకు దిక్సూచి గా భావించే ఉత్తర ప్రదేశ్లో పార్టీల జయాపజయాలను అంచనా వేసేందుకు జాతీయ, ప్రాంతీయ చానళ్లు సహా దాదాపు 87 మీడియా, రీసెర్చ్ సంస్థలు ఎగ్జిట్ పోల్, ప్రీ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ‘ఒకవైపు మాకు ఎన్నికల హడావుడి. ఇంకో వైపు సర్వే సంస్థల దరఖాస్తుల పరిశీలన. నా సర్వీసులో ఇంత పెద్ద సంఖ్యలో సర్వేలు చేయడం ముందెన్నడూ చూడలేదు’ అని సుల్తాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ రవీశ్ గుప్తా అన్నారు. బెట్టింగు సంస్థలు సైతం సర్వే సంస్థల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాయి. దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లో యూపీ ఎన్నికలపై వందల కోట్లలో బెట్టింగులు నడుస్తున్నాయంటున్నారు. నేడు యోగి కోటలో పోలింగ్ నేడు ఎన్నికలు జరగనున్న 57 నియోజకవర్గాలు అంబేడ్కర్ నగర్ (5), బలరాంపూర్ (4), సిద్ధార్థ్ నగర్ (5), బస్తీ (5), సంత్ కబీర్ నగర్ (3), మహరాజ్గంజ్ (5), గోరఖ్పూర్ (9), ఖుషీనగర్ (7), దియోరియా (7), బలియా (7) జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో అంబేడ్కర్ నగర్, బలియా మినహా మిగతా జిల్లాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బలమైన కోటలని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ‘గతంలో గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఓటమి చవిచూసిన తరువాత యోగి వైఖరిలో చాలా మార్పు కన్పించింది. గోరఖ్పూర్, దాని సమీప జిల్లాల్లో అభివృద్ధిపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ప్రధాని మోదీ సహకారం కూడా తోడవడంతో ఇప్పుడు ఈ ప్రాంతం యోగి బాబాకు మద్దతు పలుకుతోంది. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ప్రాంతంలో ఎస్పీ కూడా గణనీయంగా ఓట్లు పెంచుకుంటుందని మా అంచనాలో వెల్లడైంది’ అని బెనారస్ హిందూ యూనివర్సిటీ మాజీ పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.కె.శర్మ చెప్పారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్ల మనోభావాలు తెలుసుకోవడం తనకు హాబీ అని సుల్తాన్పూర్లో సాక్షి ప్రతినిధులకు తారసపడిన సందర్భంగా శర్మ తన అనుభవాలను నెమరేసుకున్నారు. ఆరో దశ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో నిన్నటిదాకా సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్, యోగి విస్తృతంగా పర్యటించారు. ‘మా సభలకు విస్తృతంగా జనాలు వస్తున్నారు. అనూహ్య స్పందన కూడా ఉంది. కచ్చితంగా మా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. రాష్ట్ర నలు దిక్కులా మా తడాఖా ఏమిటో చూపించబోతున్నాం’ అని ఎస్పీ సీనియర్ నేత డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అఖిలేశ్ సభలకే కాదు, మోదీ, యోగి సభలకు కూడా భారీగా జనం వస్తున్నారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ అనూహ్య విజయాలు నమోదు చేసుకోబోతున్నదన్నదే రాజకీయ పండితులంతా చెపుతున్న మాట. ‘ఏమాత్రం అనుమానం లేదు. ఎస్పీ బాగా పుంజుకుంది. కానీ, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం పొరపాటు. మరోసారి ప్రజలు యోగికే పట్టం కట్టబోతున్నారు’ అని సుల్తాన్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆర్ ఈ వర్మ చెప్పారు. కుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ఎంపికలో పార్టీలు అసెంబ్లీ స్థానాలవారీగా ఓటర్ల సామాజిక గణనను పరిగణనలోకి తీసుకున్నాయి. నిర్దిష్ట కులం/మతానికి చెందిన అభ్యర్థి తన సొంత నియోజకవర్గంలోనే కాకుండా, పొరుగు నియోజకవర్గాలు, ప్రాంతాల్లో కూడా కుల, సామాజిక వర్గ ఓట్లు రాబట్టగలడని భావించి ఆ ప్రాతిపదికన అభ్యర్ధులను నిలబెట్టాయి. కుల ప్రాతిపదికన సరైన అభ్యర్థులను నామినేట్ చేయడానికి యూపీలో పార్టీలు ప్రతి నియోజకవర్గంలో కుల గణన ఆధారంగా ఓటర్ల పర్యవేక్షణకు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకున్నాయి. ప్రత్యేకించి బీజేపీ ఈ విషయంలో ముందుంది. ఎస్పీ కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉన్న కులాల ఆధారంగా టికెట్లు కేటాయించింది. ‘యూపీలో కులాల ప్రభావం ఎక్కువ. అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి ఏజంట్ల నియామకం ఆ ప్రాతిపదికనే జరిగింది. ఎన్నికల సంఘం ఓటర్ల కుల, మత నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఓటర్ల జాబితాను ప్రచురించదు గనుక పార్టీలు దీని కోసం ప్రత్యేక కసరత్తు చేశాయి’ అని ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. సుల్తాన్ పూర్ (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: -
పూర్వాంచల్లో పోటాపోటీ
► నేడే పోలింగ్ ► బీజేపీకి తలనొప్పిగా హిందూ యువవాహిని సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరగనుంది. నేపాల్, బిహార్లతో సరిహద్దును పంచుకుంటున్న పూర్వాంచల్ ప్రాంతంలోని జిల్లాలతో కలిపి మొత్తం ఏడు జిల్లాల్లోని 49 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. బాగా వెనుకబడిన ఈ ప్రాంతంలో యాదవులు, ముస్లింలు, యాదవేతర ఎంబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు)లు ఎక్కువమంది ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ బలహీనంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. పోటీ బీజేపీ, సమాజ్వాదీ పార్టీల మధ్యనేనని వారి అభిప్రాయం. ఇక్కడ 2012 ఎన్నికల్లో ఎస్పీ 27, బీఎస్పీ 9 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీకి 7, కాంగ్రెస్కు 4, ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. బీఎస్పీ నుంచి ముక్తార్ అన్సారీ పోటీ పూర్వాంచల్లోని మూడు జిల్లాల్లో పేరుమోసిన నేరగాడు ముక్తార్ అన్సారీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరి మవూ జిల్లా సాదర్ నుంచి పోటీచేస్తున్నారు. ఆయన 1996 నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొదటిసారి బీఎస్పీ తరఫున, తర్వాత రెండుసార్లు స్వతంత్రుడిగా గెలిచారు. 2009 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బీఎస్పీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఘాజీపూర్ జిల్లా మహ్మదాబాద్ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్రాయ్ హత్యకేసులో నిందితునిగా ముక్తార్ 2005 నవంబర్ నుంచీ జైల్లోనే ఉన్నారు. ఎస్పీలో చేరడానికి ముక్తార్ ప్రయత్నాన్ని సీఎం అఖిలేశ్ అడ్డుకోవడంతో బీఎస్పీలో చేరారు. పది సీట్ల పెద్ద జిల్లా ఆజంగఢ్ గతంలో కేంద్ర మాజీ మంత్రి చంద్రజీత్ యాదవ్, మాజీ సీఎం రాంనరేష్ యాదవ్ వంటి హేమాహేమీలు ఆజంగఢ్ జిల్లా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ముస్లింలు, యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ జిల్లాలోని పది సీట్లకు బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ నెలకొంది. సీట్ల రీత్యా ఇది అతి పెద్ద జిల్లా కాగా, గోరఖ్పూర్(9), కుషీనగర్(8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీజేపీ ఓట్లు చీల్చే హిందూ యువవాహిని అభ్యర్థులు.. హిందువులను రెచ్చగొడుతూ, ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కొంత అసంతృప్తితో ఉన్నా బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆశీస్సులతో పనిచేసే హిందూ యువసేన చీలికవర్గం గోరఖ్పూర్ జిల్లా, దాని చుట్టు పక్కల దాదాపు డజను సీట్లలో పోటీచేస్తూ బీజేపీని దెబ్బతీస్తోంది. యువవాహిని రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్ను ఇప్పటికే ఆదిత్యనాథ్ బహిష్కరించారు. క్షత్రియ వర్గానికి చెందిన యోగి అత్యంత వివాదాస్పద నేత. మాజీ ప్రధాని, అప్పటి కాంగ్రెస్ యంగ్టర్క్ గ్రూపు నేత అయిన చంద్రశేఖర్ది బలియా జిల్లా. బాగా వెనుకబడిన ఈ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో అభివృద్ధి లేకపోవడంతో పరిస్థితి బీజేపీకి కాస్త అనుకూలంగా ఉంది. ఎస్పీ 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో సాధించిన స్థానాలే మెజారిటీ అందించాయి. స్వామిప్రసాద్ మౌర్యకు బీజేపీ సీనియర్ల నుంచి ఇబ్బందులు.. 2012 మార్చి నుంచి వరుసగా నాలుగేళ్లు బీఎస్పీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కిందటి జూన్ లో బీజేపీలో చేరారు. ఇప్పుడు కుషీనగర్ జిల్లా ముఖ్యపట్టణం పడరౌనా నుంచి ఆయన మూడోసారి పోటీచేస్తున్నారు. ఆయన బీఎస్పీలో ఉండగా బ్రాహ్మణులు, హిందువులను దూషిస్తూ చేసిన ప్రసంగాల్లోని మాటలతో కూడిన కరపత్రాలను హిందూ జాగరణ్ మంచ్లోని అసమ్మతివర్గం పంపిణీచేస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement