breaking news
several places
-
హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం దాకా భగభగ మండిన ఎండలతో అల్లాడిన హైదరాబాద్ వాసులకు అకస్మాత్తుగా వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం లభించింది. భాగ్యనగరంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్నగర్లో వర్షం పడింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కాగా, శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా లక్కవరంలో 46.1 డిగ్రీల సెల్సియస్గా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 24.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. చదవండి: అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది? -
వైఎస్సార్సీపీ కమిటీల్లో పలువురికి చోటు
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘా ల జిల్లా కమిటీల్లో పలువురికి చోటు కల్పించారు. ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకాల ఉత్తర్వులు కేంద్ర కార్యాలయం నుంచి వెలువడ్డాయి. పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీలుగా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన తొండమాల రవిప్రసాద్, సి. రామకృష్ణ, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన ఎం.షఫీఅహ్మద్, జిల్లా కార్యదర్శిగా ఎస్. రషీద్ఖాన్, మహిళా విభాగం జిల్లా కార్యదర్శిగా ఎం. షమాబేగం, జాయింట్ సెక్రటరీగా ఎ. అన్సర్జాన్ను నియమించా రు. అలాగే ధర్మవరం మండలం పార్టీ అధ్యక్షుడిగా నూకాల రామయ్య, బత్తలపల్లి మండలం అధ్యక్షుడిగా బగ్గారి బయపరెడ్డిని నియమించారు.