breaking news
scolded his wife
-
ఎంత ఫ్రెండయితే నా పెళ్లాన్నే తిడతాడా?
అనంతపురం క్రైం: భార్యను దూషించాడనే కోపంతో స్నేహితుడిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం అనంతపురంలోని పాతూరు బంగారు వీధిలో చోటు చేసుకుంది. వన్టౌన్ సీఐ ప్రతాప్రెడ్డి తెలిపిన మేరకు... మునిదేవ్ అలియాస్ దేవా, వెంకటేశ్ స్నేహితులు. దేవా 20 ఏళ్లుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నాడు. మూడు నెలల కిందటే అనంతపురానికి వచ్చాడు. వెంకటేశ్ టీవీ టవర్ వద్ద నివాసముంటున్నాడు. వీరిద్దరూ బంగారు వీధిలో దుకాణాల ముందు రోజు చెత్తాచెదారాన్ని ఊడ్చుతూ జీవనం సాగించే వారు. పని ముగించుకుని దేవా బంగారు వీధిలోనే నిద్రించేవాడు. ఏరోజుకారోజు వచ్చిన డబ్బుతో మద్యం సేవించేవారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. ఆ సమయంలో వెంకటేశ్ భార్యను దేవా తిట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేశ్ తన వద్ద ఉన్న కత్తితో దేవాపై దాడి చేశాడు. దేవా శరీరంలో ఏడు చోట్ల కత్తి గాయాలయ్యాయి. కుడివైపు గొంతులో లోతుగా గాయమైంది. క్షతగాత్రుడిని పోలీసులు, స్థానికులు 108 ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. కాగా, దేవాను అంబులెన్స్ ఎక్కించే సమయంలో వెంకటేశ్ అక్కడే ఉంటూ సాయపడడం గమనార్హం. -
భార్యను తిట్టిందని అమ్మను చంపేశాడు
అలిరాపూర్: భార్యను తిట్టిందనే కోపంతో కన్నతల్లినే కడతేర్చాడో ప్రబుద్ధుడు. మధ్యప్రదేశ్లోని అలీరాపూర్కు చెందిన 35 ఏళ్ల అమన్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇంటి పని సరిగ్గా చేయడం లేదని కోడలు సంగీతను మందలించిది అత్తగారు 60 ఏళ్ళ సాని బాయి. దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు తల్లిని గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి ఆనంద్ సింగ్ తెలిపారు. నిందితుడికి ఇద్దరు అన్నదమ్ములున్నారు. కూలిపని చేసుకునే ఈ కుటుంబం రెండువారాల క్రితమే గుజరాత్ నుంచి ఇక్కడు వచ్చినట్టు ఆయన తెలిపారు.