‘ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూలో 71 నౌకలు’
విశాఖ: ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూలో 71 నౌకలు భాగస్వామ్యం అవుతున్నాయని ఈఎన్సీ(Eastern Naval Command) చీఫ్ సంజయ్ భల్లా స్పష్టం చేశారు. 71 నౌకలతో పాటు 19 విదేశీ యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయన్నారు. ఆరు వరుసల్లో నౌకలను మోహరిస్తారన్నారు ఈఎస్సీ చీఫ్. ‘రాష్ట్రపతి ఫ్లిట్ రివ్యూ ను సమీక్షిస్తారు. ఐఎఫ్ఆర్లో 50 ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొంటున్నాయి. 1995 లో నాలుగు దేశాలతో ప్రారంభమైన మిలన్ లో ఇప్పుడు 65 దేశాలు భాగం పంచుకుంటున్నాయి. అయాన్స్ కాంక్లేవ్ 2008 లో ప్రారంభమైంది. 19న జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ లో 45 దేశాల నేవీ కంటెంజెంట్స్ భాగస్వామ్యం అవుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ సహా 17యుద్ధ నౌకలు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి’ అని స్పష్టం చేశారు.