breaking news
Samaikyandhra party
-
'చెప్పు'ల దుకాణం కట్టేశారు!!
-
మెగా ఫిక్సింగ్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : జమిలి ఎన్నికల చివరి అంకంలో టీడీపీ బరితెగించింది. గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోంది. పోటీ చేస్తున్న ఇతర పార్టీల అభ్యర్థులకు కోట్లు కుమ్మరించి బరిలో లేకుండా చేస్తోంది. వారి ద్వారా ఒక్క ఓటు వచ్చినా చాలన్నట్టుగా వ్యవహరిస్తోంది. గట్టిగా వంద మంది ఓటర్లను ప్రభావితం చేయలేని అభ్యర్థులను కూడా పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీ డీపీలో చేర్చుకుంటోంది. ప్రచారం చేసే సమైక్యాంధ్ర పార్టీకి చెందిన నలుగురు అసెంబ్లీ అభ్యర్థుల్ని టీడీపీ గంపగుత్తగా కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. వారంతా సోమవారం బరిలో నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. గురజాల, మాచర్ల, ప్రత్తిపాడు, పెదకూరపాడు నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా టీ డీపీతో కుమ్మక్కయ్యారు. ఈ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థికి రూ.50 లక్షలు చెల్లించినట్లు సమాచారం. నల్లారితో ఒప్పందం మేరకేనని ప్రచారం... జిల్లాలో తెలుగుదేశం పార్టీతో జై సమైక్యాంధ్ర పార్టీ కుమ్మక్కు రాజకీయాలు నడుపుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్కుమార్రెడ్డిల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకొని టీడీపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. మాచర్ల నుంచి పోటీ చేస్తున్న పులుసు సత్యారెడ్డి, గురజాల అభ్యర్థి కోలా అప్పిరెడ్డి, వినుకొండ అభ్యర్థి రమేష్, చిలకలూరిపేట అభ్యర్థి ఆంజనేయులు తాము పోటీ నుంచి తప్పుకొని టీడీపీలో చేరుతున్నట్లు సోమవారం ప్రకటించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్పార్టీ సీమాంధ్రులకు తీరని అన్యాయం చేసిందని ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు జై సమైక్యాంధ్రపార్టీ స్థాపించినట్లు ప్రకటించిన కిరణ్కుమార్రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కు కావడంపై ప్రజలు తీవ్ర అసహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జేఎస్పీ అభ్యర్థులకు ప్రజలను ఏ మాత్రం ప్రభావితం చేసేశక్తి లేదు. అయినా ఒకటి, రెండు ఓట్ల కోసం టీడీపీ ఇంతకు దిగజారుడు రాజకీయాలు చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల సహకారం... ఎన్నికల బరి నుంచి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తప్పించేందుకు ఎంతకైనా తెగిస్తున్న టీడీపీ అప్రజాస్వామ్యక రాజకీయాలకు తెరలేపింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎదుర్కొన లేక చీకటి రాజకీయాలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు పావులు కదిపింది. ఇందుకోసం పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపు ఖాయమనుకున్న నియోజకవర్గాల్లో ఈ తరహా రాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే మాచర్ల, తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, సత్తెనపల్లి, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు టీడీపీకి సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కార్పొరేట్ రాజకీయాలు... జిల్లాలో రాజకీయాలు పూర్తిగా వ్యాపార పరంగా మారిపోయాయి. కార్పొరేట్ తరహా రాజకీయాలు జిల్లాలో ప్రవేశించాయి. ఓటుకు నోటుతో పాటు ప్రత్యర్థుల శక్తి సామర్ధ్యాలను బట్టి రేటును నిర్ణయిస్తున్నాయి. ఇందులో భాగంగా పార్టీల అభ్యర్థులను కొనుగోలు చేయడం, వంటివి చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఇంతటి కుమ్మక్కు, అప్రజాస్వామిక రాజకీయాలకు పాల్పడటంపై ప్రజలు ఆశ్చర్యాన్ని, అసహ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
"కేంద్ర ప్రభుత్వానికి... 'మా' నాయకత్వానికీ..."
-
పితానికి ఝలక్
ఆచంట, న్యూస్లైన్ : ఆచంట నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదం.. చేసిందే నిర్ణయం అన్నట్టుగా వ్యవహరించిన తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షాక్ ఇచ్చాయి. ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ తరఫున ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పితాని సత్యనారాయణను చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు తీర్మానించారు. శనివారం ఆచంటలోని రామేశ్వరస్వామి సత్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ కులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లెం ఆనంద్ప్రకాష్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర అభ్యర్థుల ఓటమే ధ్యేయంగా తామంతా పనిచేస్తామని ప్రకటించారు. కష్టపడి పనిచేసిన నాయకులను, ద్వితీయ శ్రేణి నాయకులను పితాని సత్యనారాయణ అణగదొక్కారని, వలసదారులను ప్రోత్సహించారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పితానికి తగిన గుణపాఠం చెప్పడానికి అంతా సంసిద్ధంగా ఉన్నారన్నారు. డీసీసీ కార్యదర్శి కానుమిల్లి జోగిరాజు మాట్లాడుతూ ఆచంటలో ప్రధాన సమస్యలైన డ్రెయినేజీ, రహదారుల విస్తరణ, 30 పడకల ఆసుపత్రి వంటి అతి ముఖ్య మైన పనులను పూర్తి చేయడంలో పితాని విఫలమయ్యారని ధ్వజమె త్తారు. ఏఎంసీ ఉపాధ్యక్షుడు చేకూరి సూరిబాబు మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గానికి ఎంపీ కోటాలో 2 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరైతే వాటిని పేదలకు అందకుండా పితాని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ను చెల్లెం ఆనందప్రకాష్కు ఇవ్వాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కానుమిల్లి మోహన్రావు, నెక్కంటి సతీష్, పోడూరి సాయిబాబా, డీటీడీసీ బాబు, కానుమిల్లి జోగిరాజు, పెదపాటి పెద్దిరాజు, పిల్లి వీరన్న తదితరులు మాట్లాడారు. -
ఎక్కండయ్యా బాబూ.. ఎక్కండి
దేవరపల్లి, న్యూస్లైన్ : ఎక్కండయ్యా బాబూ.. ఎక్కండయ్యా బండి.. ఎక్కండయ్యా.. అంటూ సమైక్యాంధ్ర పార్టీ నేతలు ప్రజలను బతిమాలుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి నూతనంగా పెట్టిన సమైక్యాంధ్ర పార్టీ రాజమండ్రిలో బుధవారం నిర్వహించే సదస్సుకు ప్రజల తరలింపునకు ఆ పార్టీ నేతలు అష్టకష్టాలు పడ్డారు. గోపాలపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 50 బస్సులను ఏర్పాటు చేశారు. సదస్సుకు వెళ్లడానికి ప్రజలు బస్సు ఎక్కేందుకు రాకపోవడంతో కనిపించిన వారిని బతిమిలాడి మొహమాటపెడుతూ బస్సులు ఎక్కించారు. అంతేకాక బస్సు ఎక్కిన వారికి రూ. 200 ఇస్తామని చెప్పడంతో కొంతమంది ఇష్టం లేకపోయినా డబ్బులు కోసం సదస్సుకు వెళ్లారు. ఒక్కొక్క బస్సులో పట్టుమని 10 మంది కూడా లేకపోవడంతో బస్సులు ఖాళీగా వెళ్లాయి. సాయంత్రం ఆరు గంటల వరకూ బస్సులు వెళుతూనే ఉన్నాయి.