breaking news
Sabotage activity
-
విమాన ప్రమాదం వెనుక విద్రోహ చర్య?: మంత్రి మురళీధర్ మోహోల్
న్యూఢిల్లీ: ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై అన్ని కోణాలలో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. ఈ ప్రమాదం దరిమిలా ఎయిర్ ఇండియా విమానం ఏI 171లోని బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నామని, దానిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారని అన్నారు.విమాన ప్రమాదం దురదృష్టకర సంఘటన అని, ఏఏఐబీ దీనిపై పూర్తి దర్యాప్తు ప్రారంభించిందని, దీనిలో ఏదైనా విద్రోహ చర్య ఉందా? అనే అంశంతో పాటు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లను సంబంధిత అధికారులు సమీక్షిస్తున్నారని, పలు సంస్థలు విచారణలో భాగస్వామ్యం వహిస్తున్నాయని మోహోల్ తెలిపారు. జూన్ 12న లండన్కు వెళ్తున్న బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 ఫ్లీట్కు చెందిన ఏI 171 విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒకరు మాత్రమే ప్రమాదం నుండి బయటపడ్డారు.ఈ ప్రమాదాన్ని మంతి మురళీధర్ మోహోల్ అరుదైన కేసుగా అభివర్ణించారు. రెండు ఇంజిన్లు ఒకేసారి షట్ డౌన్ కావడం ఎప్పుడూ జరగలేదంటూ, అనుభవజ్ఞులైన పైలట్లు, నిపుణుల వాదనలను ఆయన గుర్తుచేశారు. విచారణ అనంతరం నివేదిక వచ్చిన తర్వాతనే ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని అన్నారు. ఈ ఘటనపై నివేదిక మూడు నెలల్లో వస్తుందని కూడా ఆయన తెలిపారు. కాగా బ్లాక్ బాక్స్ను పరిశీలన కోసం విదేశాలకు పంపుతారనే వాదనలను మోహోల్ తోసిపుచ్చారు. -
విద్రోహ చర్యా?
పొంతనలేని మంత్రులు, అధికారుల ప్రకటనలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి కారణాలపై మంత్రు లు, అధికారుల ప్రకటనలకు పొంతన కుదరడం లేదు. ఒకరు విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని చెపుతుంటే.. మరొకరు విద్రోహచర్యను కొట్టిపారేయలేమంటున్నారు. వీరి పొంతనలేని ప్రకటనలతో ప్రమాద కారణాలపై స్పష్టత కరవైంది. పేలుడు పదార్థాల వంటి విద్రోహ చర్య వల్ల ప్రమాదం జరిగిందా.. లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకుందా అన్న అంశంపై సమగ్ర విచారణ చేస్తామని సౌత్ వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ భార్గవ్ ప్రకటించారు. ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్యను కొట్టిపారేయలేమన్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే.. రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే, ఆ శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి మాత్రం విద్రోహ చర్య వాదనను కొట్టిపారేశారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని చెపుతున్నారు. మంత్రులు.. జీఎం ప్రకటనలు పూర్తివిరుద్ధంగా ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో జీఎం రాజీవ్ భార్గవ్ విలేకరులతో మాట్లాడారు. విద్రోహ చర్యను ఏమాత్రం కొట్టిపారేయడానికి వీల్లేదని.. సాంకేతిక నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించి.. సమగ్ర విచారణ చేయిస్తామని ప్రకటించారు. అనంతరం ప్రమాద ప్రదేశానికి చేరుకున్న రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి మాత్రం ప్రమాదం వెనుక విద్రోహ చర్య లేదన్నారు. మధ్యాహ్నం ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.