RVM PO
-
కేజీబీవీ ఎస్వో తీరుపై పీవో అసంతృప్తి
ఎల్.ఎన్.పేట: లక్ష్మీనర్సుపేట కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) ప్రత్యేక అధికారి ఎస్.లలితకుమారి పని తీరుపై రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) పీఓ ఎస్.త్రినాథరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజీబీవీని ఆయన గురువారం పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ బాగులేదన్నారు. ఇటీవలే 24 మంది బాలికలు అతిసారతో అస్వస్థతకు గురై ప్రస్తుతం తేరుకున్నారని, ఇప్పటికీ గుణపాఠం తెచ్చుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. మీ పిల్లలు చదువుకునే పాఠశాలల ప్రాంగణం ఇలా ఉంటే మీకు ఎలా అనిపిస్తోందని నిలదీశారు. తక్షణమే వాడుక నీరు మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడపై నాచుపట్టి ఉందని, ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యార్థినులతో కాసేపు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట గ్రామ పెద్దలు ముగడ జనార్దనరావు, దేవరశెట్టి తిరుమలరావు, ఊణ్ణ పకీరు, పరీక్షల పర్యవేక్షణ అధికారి కె.తేజేశ్వరరావులు ఉన్నారు. -
ప్రణాళికాద్ధంగా విద్యాబోధన
–ఆర్వీఎం పీఓ గోవిందరాజులు నవాబుపేట: ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన చేయాలని ఆర్వీఎం పీఓ గోవిందరాజులు తెలిపారు. మంగళవారం మండలంలోని లింగంపల్లి, నవాబుపేట గ్రామాల్లోని పాఠశాలలో జరిగిన ప్రదానోపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయలకు ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న చతుర్విద ప్రక్రియల ఆధారంగా విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించారు. ప్రతి పాఠశాలను ప్రత్యేక అధికారులు పరిశీలించి చతుర్విద ప్రక్రియలపై పరీక్షలు నిర్వహించి ఉపాధ్యాయులకు గ్రేడింగ్ వేస్తారని ఆయన తెలిపారు. గతంలో మాదిరిగా మొక్కుబడి చదువులు మానివేసి ప్రణాళికబద్ధంగా విద్యార్థులకు చదవటం, రాయటం, మాట్లాడటం లాంటివి రావాలని సూచించారు. పాఠశాలలో రికార్డులు విధిగా రాయాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని హెచ్చరించారు . విద్యా కమిటీలతో కలిసి నెలవారి సమావేశాలు నిర్వహించాలన్నారు.మధ్యాహ్న భోజనం విద్యాకమిటీ పరిశీలించే విధంగా చార్టు రుపొందించాలన్నారు. సమావేశంలో మండల విద్యా శాఖ అధికారి ఆనంతప్ప, హెచ్ఎంలు ఫరహ, ఉషరాణీలు పాల్గొన్నారు.