-
నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్: రాజ్నాథ్
బలియ: పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగానే దేశంలోని నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్ చేశామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ బిలియ జిల్లాలో పరివర్తన్ ర్యాలీలో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో నల్లధనానికి శాశ్వత పరిష్కారం దొరికిందన్నారు. పాకిస్తాన్ ప్రోత్సాహంతో దేశంలో చెలామణి అవుతున్న నకిలీ నోట్లకు అడ్డుకట్ట పడినట్లు అయిందన్నారు. కాగా రూ.500, 1000 నోట్లు రద్దు వెనుక నల్ల ధనాన్ని అరికట్టడమే కాకుండా, నకిలీ నోట్లు అన్నవి లేకుండా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన నోట్లకు నకిలీ తయారు చేయడం దాదాపు అసాధ్యమేనని నిఘా వర్గాలు చెబుతున్నాయి. -
ఏటీఎంల్లో ఎలాంటి సర్ఛార్జీలు ఉండవు...
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగిస్తే ఎలాంటి సర్ఛార్టీలు ఉండవని వెల్లడించింది. కాగా ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాయల్ ఉచిత లావాదేవీలను బ్యాంకులు అయిదింటికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. అయితే రూ.500, 1000 నోట్ల రద్దుతో ఏటీఎంల నుంచి రోజుకు రూ.2వేలు, ఆతర్వాత రూ.4వేలు మాత్రమే డ్రా చేసుకునే పరిమితి విధించడంతో ఈ వెసులుబాటు కల్పించింది. కేంద్ర తాజా నిర్ణయం సామాన్యులకు కాస్త ఊరట కలిగించే విషయమే. మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ముంబయి, ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఐటీ దాడులు జరిగాయి. ప్రముఖ వ్యాపారుల నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు జరిగినట్లు సమాచారం.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- దాడిచేసింది వారు.. మాపై కేసులా?
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
- బిభవ్ కుమార్ అరెస్ట్
- డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
- Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
Advertisement