breaking news
Rohtak sisters
-
రోహ్తక్ అక్కాచెల్లెళ్లకు కోర్టులో చుక్కెదురు
చండీగఢ్: హర్యానాలో ఓ ఆర్టీసీ బస్సులో తమను వేధించారంటూ ముగ్గురు యువకుల భరతంపట్టి, వీరనారులుగా అందరి ప్రశంసలు అందుకున్న రోహ్తక్ అక్కాచెల్లెళ్లకు కోర్టులో చుక్కెదురయ్యింది. బస్సులో ఇద్దరు యువతులు ముగ్గురు యువకులు మోహిత్, దీపక్, కుల్దీప్లపై దాడి చేసిన ఓ వీడియో రెండేళ్ల కిందట వార్తా ప్రసారమాధ్యమాల్లో తెగ చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే యువకులపై యువతులు పెట్టిన వేధింపుల కేసుకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించలేకపోవడంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. మోహిత్, దీపక్, కుల్దీప్పై పెట్టిన కేసును కొట్టివేస్తూ అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ హరిశ్ గోయల్ తీర్పు వెలువరించారు. నింధితులు వేధింపులకు పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. రోహ్తక్ అక్కాచెల్లెళ్లపై పరువు నష్టం దావా వేస్తామని యువకుల తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు కిందికోర్టు తీర్పును హైకోర్టులో సవాలుచేయనున్నట్టు యువతుల తరఫు న్యాయవాది చెప్పారు. తాము యువతులను వేధించలేదని, కేవలం సీటు విషయంలో జరిగిన వాగ్వాదాన్ని రాద్దాంతం చేశారని యువకులు అన్నారు. ఓ వృద్ధమహిళ కోసం తాము ఇచ్చిన సీటు కోసం యువతులు ఘర్షణకుదిగారని తెలిపారు. ఈ కేసులో 40 మంది ప్రత్యేక్ష సాక్షులను పోలీసులు విచారించారు. యువతులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు తప్పని సాక్షులు పోలీసులకు తెలిపారు. పాలిగ్రాఫ్ టెస్టులో కూడా యువకులకు క్లీన్ చీట్ వచ్చింది. ఆసన్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను అక్కడి గ్రామస్తులంతా వెనకేసుకొచ్చారు. యువకులను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. సంఘటన జరిగిన సమయంలోనే ఈ ఉదంతంపై సమావేశమైన వారు ఆ యువకులకు మద్దతు పలకాలని నిర్ణయించారు. బస్సులో సీటు విషయమై అక్కచెల్లెళ్లు, ముగ్గురు యువకుల మధ్య గొడవ తలెత్తిందంటూ వారు మీడియాకు తెలిపారు. ఆ యువతులు ఇది వరకు కూడా ఇలాగే తప్పుడు కేసులతో యువకులను బెదిరించి, డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. కావాలంటే పోలీసు స్టేషన్కు వెళ్లి వారుపెట్టిన కేసులను చూసుకోవొచ్చు అని తెలిపారు. కుల్దీప్,తాను ఆర్మీలో పనిచేయాలనుకున్నామని దీపక్ తెలిపారు. మెడికల్, ఫిజికల్ టెస్టులు కూడా పూర్తి చేశామని చెప్పారు. కానీ ఈ కేసు కారణంగా పరీక్షలకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం ఇప్పుడు దరఖాస్తు చేసుకుందామనుకుంటే వయస్సు పెరిగిపోయిందని పేర్కొన్నారు. -
రోహ్తక్ అక్కచెల్లెళ్ల మరోసాహసం!
చండీగఢ్: హర్యానాలో గత వారం ఓ ఆర్టీసీ బస్సులో తమను వేధించిన ముగ్గురు ఆకతాయిల భరతంపట్టి వీరనారులుగా అందరి ప్రశంసలు అందుకుంటున్న రోహ్తక్ అక్కచెల్లెళ్లు ఇద్దరూ మరో సహసం చేశారు. సుమారు నెల కిందట ఇదే తరహాలో పోకిరీలకు బుద్ధిచెప్పిన ఉదంతం తాజాగా బయటపడింది. రోహ్తక్లోని హుడా పార్కుకు వెళ్లిన ఆ అక్కచెల్లెళ్లను అక్కడ ఓ బల్ల మీద కూర్చున్న కొందరు పోకిరీలు వేధించారు. దీంతో ఆగ్రహించిన అక్కచెల్లెళ్లు పోకిరీలతో వాగ్వాదానికి దిగారు. చివరకు అక్కచెల్లెళ్లలో ఒకరు ఓ ఆకతాయిని చితక్కొట్టింది. దాంతో మిగిలిన పోకిరీలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దశ్యాలను చిత్రీకరించిన పార్కులోని ఓ వ్యక్తి 30 సెకన్ల ఆ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పలు వార్తాచానళ్లు సైతం మంగళవారం ఆ వీడియోను ప్రసారం చేశాయి. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అక్కచెల్లెళ్లను ప్రశ్నించగా, ఆకతాయిలు పారిపోయినందునే కేసు పెట్టలేదన్నారు. అలాగే ప్రచారం కోసమే తాము వీడియోలను బయటపెడుతున్నట్లు వ స్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. అది తప్పుడు కేసు: గ్రామస్తులు ఆర్టీసీ బస్సులో అక్కచెల్లెళ్లపై వేధింపులకు పాల్పడిన ఆసన్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను అక్కడి గ్రామస్తులంతా వెనకేసుకొచ్చారు. యువకులను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ ఉదంతంపై మంగళవారం సమావేశమైన వారు ఆ యువకులకు మద్దతు పలకాలని నిర్ణయించారు. బస్సులో సీటు విషయమై అక్కచెల్లెళ్లు, ముగ్గురు యువకుల మధ్య గొడవ తలెత్తిందంటూ వారు మీడియాకు తెలిపారు. బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన ఇద్దరు రోహ్తక్ అక్కచెల్లెళ్లను గణతంత్ర దినోత్సవ సందర్భంగా సన్మానించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయిం చిన విషయం తెలిసిందే. వీరికి నగదు బహుమతి అందచేయనున్నట్లు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ నిన్న ప్రకటించారు. ** -
టీజర్ను ఉతికి ఆరేసిన అక్కాచెల్లెళ్లు
-
తిరగబడ్డ ఆడబిడ్డలు