reveiw
-
పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ 'దొంగాట' చూడాల్సిందే..
టైటిల్: దొంగాట నటీనటులు: ఫాహద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్, అలెన్సియర్ లే లోపెజ్ తదితరులు నిర్మాతలు: సందీప్ సేనన్, అనీష్ ఎం థామస్ కథ: సజీవ్ పజూర్ దర్శకత్వం: దిలీష్ పోతన్ సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి సంగీతం: బిజిబాల్ విడుదల తేది: మే 06, 2022 (ఆహా) చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుల్లో మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకరు. కరోనా సమయంలో ఆడియెన్స్ ఓటీటీలకు అలవాటు కావడంతో ఒక్కసారిగా ఫాహద్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. పాత్ర బలంగా ఉంటే ఎలాంటి సినిమా అయినా చేసేందుకు వెనుకాడరు. 'పుష్ప: ది రైజ్' సినిమాలో భన్వర్ సింగ్ షేకవాత్ అనే పోలీసు పాత్రలో ఎంతలా ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంటర్టైన్ చేస్తున్న ఫాహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం 'తొండిముత్యాలుం దృక్సాక్షియుం'. 2017లో విడుదల మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో 'దొంగాట' పేరుతో 'ఆహా' ఓటీటీలో విడుదల చేశారు. ఫహద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్ కీలకపాత్రల్లో నటించారు. మూడు జాతీయ పురస్కారాలను అందుకున్న ఈ 'దొంగాట' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: ఒక మిస్అండర్స్టాండింగ్ కారణంగా దగ్గరైన ప్రసాద్ (సూరజ్ వెంజరమూడ్), శ్రీజ (నిమిషా సజయన్) ప్రేమించి గుడిలో పెళ్లి చేసుకుంటారు. తర్వాత వేరే కాపురం పెడతారు. వ్యవసాయం పండించడానికని నీళ్ల కోసం బోర్ వేసేందుకు శ్రీజ దగ్గర ఉన్న తాళి తాకట్టు పెట్టేందుకు బస్సులో వెళ్తారు. బస్సులో ప్రయాణించేటప్పుడు శ్రీజ మెడలోని బంగారు గొలుసును (తాళి) ప్రసాద్ (ఫాహద్ ఫాజిల్) అనే దొంగ కొట్టేస్తాడు. అది గమనించిన శ్రీజ.. ప్రసాద్ను పట్టుకుని నిలదీస్తే తాను దొంగలించలేదని బుకాయిస్తాడు. దీంతో బస్సులోని వారి సహాయంతో ప్రసాద్ను (ఫాహద్ ఫాజిల్) పోలీస్లకు అప్పగిస్తారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన ప్రసాద్-శ్రీజ దంపతులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. గొలుసు కొట్టేసిన ప్రసాద్ అనే దొంగ నేరం ఒప్పుకున్నాడా ? ఆ తాళి శ్రీజ-ప్రసాద్లకు చేరిందా ? ఇలాంటి కేసుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు? అనే అంశాలతో తెరకెక్కిందే ఈ 'దొంగాట'. విశ్లేషణ: ఇద్దరు దంపతులు, ఒక దొంగ, చిన్న కేసు, పోలీసులు అనే చిన్న కథను చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ దిలీష్ పోతన్. ఒక దొంగతనాన్ని పోలీసులు ఎలా చేధిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫాహద్ ఫాజిల్ బంగారు తాళిని దొంగతనం చేయడంతోనే అసలు కథ ప్రారంభవుతుంది. తర్వాత వచ్చే సీన్లు, దొంగలు, సాక్షులు, సామాన్యులతో పోలీసులు వ్యవహరించే తీరు బాగా అలరిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా తమకు ఎలాంటి సమస్య రాకుండా పోలీసుల ప్రవర్తనా శైలీ ఆలోచింపజేసేలా ఉంటుంది. అమాయకంగా ఉంటూ చివరివరకు నేరాన్ని ఒప్పుకోని దొంగల తీరు, తమకు నష్టం కలిగినా ఇంకొకరికి అన్యాయం జరగకూడదనే భావించే మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనలను చాలా బాగా చూపించారు. అక్కడక్కడా సినిమా కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే ? దొంగలు పారిపోతే పోలీసులు వెతికే తీరు, పై అధికారులకు సమాధానం ఇచ్చేటప్పుడు వారికి కలిగే భయం, దొంగతనం చేసిన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండే దొంగల ప్రవర్తన వంటి అంశాలను నటీనటులు వారి నటనతో చాలా చక్కగా చూపించారు. దొంగ పాత్రలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడు. 'చివరివరకు బయటపడకూడదు అనేదే తన స్టైల్' అని చెబుతూ అమాయకపు చూపులు, పోలీసులతో మాట్లాడే వైఖరీ, ఎవరు లేనప్పుడు అసలైన దొంగలా ప్రవర్తించే ఫాహద్ నటన ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి వ్యక్తుల్లా సూరజ్, నిమిషా కూడా చాలా చక్కగా ఒదిగిపోయి నటించారు. మిగతా పోలీసు పాత్రలు సైతం వారి నటనతో మెప్పించారు. పోలీసు వ్యవస్థలోని లొసుగులు, మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనా ధోరణి, సమస్యలు ఎదురైనప్పుడు వారు రాజీపడే విధానాన్ని చూపించి దర్శకుడు దిలీప్ పోతన్ మంచి మార్కులు కొట్టేశారనే చెప్పవచ్చు. అయితే ఫాహద్ ఫాజిల్ దొంగగా మారడానికి కారణాలు, తర్వాత మంచివాడిలా మారేందుకు ప్రేరేపించిన కారణాలు అంతగా చూపించలేకపోయాడు. సజీవ్ పజూర్ అందించిన కథ, శ్యామ్ పుష్కరణ్ డైలాగ్లు ఓకే అనిపించాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, బిజిబాల్ సంగీతం పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో నటనకు గానూ ఫాహద్ ఫాజిల్కు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. బెస్ట్ స్క్రీన్ప్లే రైటర్గా సజీవ్ పజూర్ కూడాల జాతీయ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును సైతం అందుకుంది ఈ మూవీ. ఫైనల్గా ఏంటంటే కాస్త నెమ్మదిగా సాగిన ఈ 'దొంగాట' ఓసారి చూడాల్సిందే. -
తూతూ మంత్రంగా టీడీపీ సమీక్ష
నాయకులు, కార్యకర్తలపై విసుక్కున్న నేతలు ఓ దశలో అసహనంతో మాట్లాడిన శివాజీ శిక్షణకు హాజరు తక్కువపై అచ్చెన్న ఆగ్రహం శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు గురువారం తూతూ మంత్రంగా జరిగాయి. బుధవారం నాటి సమీక్ష వాడీ వేడిగా ఉండడంతో మరుసటి రోజుకూడా అదే తరహాలో ఉంటుందని అందరూ భావించారు. అయితే, ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు ముందస్తుగా కార్యకర్తలకు హెచ్చరించడం, బ్రతిమాలుకోవడం వంటి చర్యలతో సమీక్ష నామమాత్రంగానే జరిగింది. పలువురు కార్యకర్తలు జన్మభూమి కమిటీ సభ్యులు తీరును దుయ్యబట్టారు. దీనిని సాధారణంగా తీసుకున్న మంత్రులు, పరిశీలకులు వారికి సర్ధిచెప్పారు. ప్రతి నియోజకవర్గ సమీక్షలోనూ నాయకులు, కార్యకర్తలపై మంత్రులు విసుక్కున్నారు. శిక్షణ తరగతులకు హాజరు తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పలాస ఎమ్మెల్యే శివాజీ, ప్రభుత్వ విప్ కూన రవికుమార్లు ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తారని భావించగా మౌనవ్రతం వహించారు. పలాస నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు వైఎస్సార్ సీపీ గ్రామాల్లో పనులు జరగడం లేదని నేతల దృష్టికి తీసుకువచ్చారు. రేషన్కు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ–పాస్ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు కార్యకర్తలు వాపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని, రేషన్కార్డులు కూడా తొలగించడంతో ప్రజలనుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోందని కొందరు కార్యకర్తలు సమావేశంలో నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఇటువంటి ఆరోపణలు మనపార్టీ వారు చేయడం సరికాదని మంత్రి అచ్చెన్న అన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం తమ పరిధిలో లేదని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పరిటాల సునీత వీరందరికీ సర్దిచెప్పారు. సమీక్ష సమావేశంలో పార్టీ పరిశీలకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జనార్దన్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పాలనే గెలిపిస్తుంది
-
పాలనే గెలిపిస్తుంది
వరంగల్ ఉపఎన్నికపై సమీక్షలో సీఎం కేసీఆర్ * అభ్యర్థి ఎవరైనా గెలుపు మనదే.. ప్రజలు మన వెంటే ఉన్నారు * ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్లండి * మనం గెలవడానికి కరెంటు ఒక్కటి చాలు... ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా విద్యుత్ ఇస్తున్నాం * సర్వేలో మనకు 55 శాతం అనుకూలంగా వచ్చింది * ఎవరూ నారాజు కావొద్దు.. అందరికీ అవకాశాలు వస్తాయి * ఉప ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం * పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ సాక్షి, హైదరాబాద్: 'వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి గురించి మరచిపోండి. అభ్యర్థి ఎవరైనా మన పార్టీ గెలుస్తుంది. గడచిన పదహారు నెలల పాలనే మనల్ని గెలిపిస్తుంది' అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ నేతలతో అన్నారు. 'మేనిఫెస్టోలో ఇవ్వని ఎన్నో హామీలను అమలు చేశాం. ప్రజలు మన వెంటే ఉన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. కిందటిసారి కంటే ఎక్కువ మెజారిటీ రావాలి. సర్వేలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. సర్వేలో 55 శాతం మనకు అనుకూలంగా ఉన్నారని ఫలితం వచ్చింది. మనం చేసిన కార్యక్రమాలు.. ముఖ్యంగా ఒక్క విద్యుత్ అంశం చాలు మనం గెలవడానికి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా కరెంటు ఇస్తున్నాం. అంతా కలసి గెలిపించాలి' అని సీఎం అన్నట్టు తెలిసింది. గురువారం తెలంగాణ భవన్లో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు సీఎం కర్తవ్య బోధ చేశారు. పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఉప ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. టికెట్ ఆశిస్తున్న వారందరినీ ప్రత్యేకంగా దగ్గరకు పిలుచుకుని మాట్లాడారు. 'రాజకీయాల్లో ఓపిక ఉండాలి. అవకాశం వచ్చే దాకా ఎదురు చూడాలి. లేదంటే డాక్టర్ పరమేశ్వర్కు ఎదురైన పరిస్థితి వస్తది. ఆయన మనతోనే ఉండి ఉంటే.. ఇవ్వాళ ఆయనొక్కడి పేరే పరిశీలనలో ఉండేది. టికెట్ ఎవరికి వచ్చినా అంతా కలిసి పనిచేయండి' అని వారికి సూచించారు. ఆశావహులు ఎందరున్నా టికెట్ ఒకరికి మాత్రమే ఇవ్వగలుగుతామని, మిగిలిన వారికీ ఏదో ఒక అవకాశం వస్తుందని వారితో పేర్కొన్నారు. ఎన్నిక కోసం నామినేటెడ్ నియామకాలు వాయిదా వరంగల్ ఉప ఎన్నిక వల్లే నామినేటెడ్ పోస్టుల భర్తీని వాయిదా వేశామని, ఎన్నిక పూర్తి కాగానే నియామకాలు చేపడతామని కేసీఆర్ పార్టీ నేతలకు హామీనిచ్చారు. 'ముందు నుంచీ పార్టీలో ఉన్నవారు, ఇప్పటికీ కొనసాగుతున్న వారు కొద్దిమందిమే మిగిలాం. టికెట్ రానంత మాత్రాన నారాజు కావొద్దు, అందరికీ పదవులు దక్కుతాయి..'అని భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్లమెంట్ అంటే ఆషామాషీ కాదని, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిషు భాషలు వచ్చి ఉండాలని, చట్టం తెలిసిన వారు కూడా అయి ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానికేతరుడిని అభ్యర్థిగా పెట్టబోమని స్పష్టంచేసినట్లు తెలిసింది. 'టీడీపీ పని అయిపోయింది. బీజేపీకి బలం లేదు. కాంగ్రెస్కు అభ్యర్థే దొరకడం లేదు. గత మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా పనిచేయండి..'అని కేసీఆర్ సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం. గుండు చేరికపైనా చర్చ టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పార్టీలో చేరే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. 'ఆమె మన పార్టీలో చేరుతానని కలిసింది. రెండు మూడ్రోజుల్లో ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. ఎమ్మెల్యే కొండా సురేఖతో కూడా మాట్లాడాతా. ఆమెకు ఏ కమిట్మెంట్ ఇవ్వలేదు. పదవులు రాకుండా పోతాయేమోనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని సీఎం అన్నట్టు సమాచారం. గుడిమల్ల పేరు ఖరారు? వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ నేత, అడ్వొకేట్ గుడిమల్ల రవికుమార్ పేరు దాదాపు ఖాయమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అనూహ్యంగా దాదాపు 14 మంది టికెట్ ఆశించారు. వీరందరినీ సీఎం ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశానికి ఆహ్వానించారు. మొదట్నుంచీ టికెట్ ఆశిస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. శుక్రవారం మంచి రోజైనందున టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. చివరి నిమిషంలో ఏమైనా అనూహ్య మార్పులు జరిగితే తప్ప గుడిమల్ల అభ్యర్థిత్వం ఖరారైనట్లేని సమాచారం. ఆయన అభ్యర్థిత్వానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం. మరోసారి నిపుణుల సలహా కూడా తీసుకుందామని, గుడిమల్ల 'కులం' సమస్యపై సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎక్కడా రవికుమార్ పేరు ప్రస్తావించకుండానే, ఆయనే దాదాపు అభ్యర్థి అన్న తరహాలో సీఎం మాట్లాడారని వినికిడి.