breaking news
Register to vote
-
ఓటు హక్కు ప్రజల చేతిలో ఆయుధం!
-
సోనియా గాంధీ పేరుతో ఓటు నమోదుకు దరఖాస్తు
సరూర్నగర్, న్యూస్లైన్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పేరుతో ఓటు నమోదుకు ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తి దరఖాస్తు చే సిన సంఘటన కలకలం సృష్టించింది. సరూర్నగర్ మండలం జిల్లెలగూడ గ్రామ పంచాయితీ పరిధిలోని గాయత్రినగర్, ఇంటినెం. 1-2-3 చిరునామాతో ఫారం నెం.6ను ఆన్లైన్లో ఈ-రిజిస్ట్రేషన్ చేశారు. సోమవారం ఇది సిబ్బంది పరిశీలనలో బయటపడింది. 2001, మే 12 నుంచి గాయత్రినగర్లో సోనియా గాంధీ నివాసం ఉంటున్నట్లు దరఖాస్తు చేశారు. సోనియా, భర్త రాజీవ్, ఇంటి పేరు గాంధీ, వయసు (66) అని, పుట్టిన తేదీ 09 డిసెంబర్ 1947గా పేర్కొన్నారు. 44వేల 679 మంది ఓటు హక్కు కోసం ఆన్లైన్లో ఈ-రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వాటిని పరిశీలిస్తున్న తరుణంలో ఈ దరఖాస్తు బయటపడిందని సరూర్నగర్ మండల డిప్యూటీ కలెక్టర్ కె.చంద్రారెడ్డి తెలిపారు. ప్రముఖుల పేర్లను ఇలా దుర్వినియోగం చేయడం నేరమన్నారు. దీనిపై ఆయన మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ప్రత్యేక ఓటరు నమోదుకు.. నేడే గడువు
కలెక్టరేట్, న్యూస్లైన్: ప్రత్యేక ఓటరు నమోదు సవరణకు గడువు నేటితో ముగియనుంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటలకు తహశీల్దార్ కార్యాలయాలు, కళాశాలలు, ప్రత్యేక శిబిరాలలో ఓటు నమోదు చేసుకోవచ్చు. బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండరు. వచ్చే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలంటే ఇప్పుడు తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరముంది. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించింది. గతనెల 24, ఈనెల 1,8,15 తేదీలను ప్రత్యేక దినాలుగా ప్రకటించి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట నిర్ణయించిన గడువు ఈ నెల 17న ముగిసినప్పటికీ.. యువత నుంచి అనూహ్య స్పందన రావడంతో ఎన్నికల సంఘం గడువును 23 వరకు పొడిగించింది. ఆదివారం వరకు బూత్లెవల్ అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 13 నియోజకవర్గాల్లోని 57 మండలాల్లో 3,326 పోలింగ్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో 18-19 సంవత్సరాల వయస్సు ఉన్న యువత 1,65,994 మంది ఓటరు నమోదుకు అర్హులుగా ఉన్నారు. ఈనెల 21 వరకు 1,37,111 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,05,870 మంది దరఖాస్తులు సమర్పించగా, 32,241 మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఆన్లైన్లో నమోదుకు అవకాశం కల్పించడంలో యువత దానిపైనే ఆసక్తి చూపుతున్నారు. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోనూ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు ఇస్తూ నమోదు చేయిస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 21,717, రామగుండంలో 12,222, హుజూరాబాద్లో 8,927, సిరిసిల్లలో 7,825 మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇంతకంటే తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా దరఖాస్తులను నమోదు చేసుకొని జనవరి 16న ఓటర్ల జాబితా అధికారికంగా ప్రకటిస్తారు. 26న ఓటర్లకు గుర్తింపుకార్డులు అందజేస్తారు. -
కొత్త ఓటర్లకు ఫేస్బుక్ వల
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటంతో వారిని ఆకర్షించేలా ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్సైట్ ఫేస్బుక్ కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. దేశంలో కొత్తగా ఓటుహక్కు వచ్చినవారు 1.70 కోట్ల మంది ఉన్నారు. వీరంతా 18-19 ఏళ్ల వయసువారే కావడంతో వీరిని ఆకర్షించేందుకుగాను ‘రిజిస్టర్ టు ఓట్’ అనే ఫీచర్ను ప్రారంభించినట్లు ఫేస్బుక్ వర్గాలు వెల్లడించాయి.


