'ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర'
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ఆయనిక్కడ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు.