breaking news
Ram Chandra
-
నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్
ఖట్మాండు: నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్కు చెందిన రామచంద్రను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంతో ప్రధానమంత్రి ప్రచండ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అధికార సంకీర్ణ కూటమి అభ్యర్థి రామచంద్రను ఎన్నిక కోసం తెరవెనుక ప్రచండ పన్నిన రాజకీయ వ్యూహాలు ఫలించాయి. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్టు సెంటర్) తో పాటు ఎనిమిది పార్టీల సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి పార్లమెంటులో రెండో అతి పెద్ద పార్టీ సీపీఎన్–యూఎంఎల్ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్ చంద్ర నెబ్మాంగ్పై విజయం సాధించారు. రామచంద్రకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అధ్యక్షుడిగా గెలిస్తే నేపాల్ ప్రభుత్వంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉండేది. -
బవానాలో ఆప్ అభ్యర్థి గెలుపు
న్యూఢిల్లీ: ఉత్కంఠ నడుమ జరిగిన బవానా ఉప ఎన్నిక కౌంటింగ్ లో చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థినే విజయం వరించింది. ఆప్ అభ్యర్థి రామ్ చంద్ర సుమారు 22 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి స్వల్ఫ ఆధిక్యంలో ముందంజలో ఉంటూ వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర కుమార్ 12 రౌండో తర్వాత అనూహ్యంగా వెనకబడిపోయారు. క్రమక్రమంగా మెజార్టీ పెంచుకుంటూ పోయిన ఆప్ పార్టీ అభ్యర్థి చివరకు 56,178 ఓట్లు సాధించి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ఇక మూడో స్థానానికి పరిమితమవుతుందని భావించిన బీజేపీ అభ్యర్థి వేద ప్రకాశ్ చివరకు 34 వేల 501 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. గెలుపు మీద గంపెడు ఆశలు పెంచుకున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్కుమార్ 30,758 ఓట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. -
ఒక్కటిగా ముందుకు సాగాలి
సాక్షి, న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారం కోసం రైతులంతా పార్టీలకు అతీతంగా ఏకం కావాలంటూ భారతీయ కిసాన్సంఘ్ అఖిల భారత అధ్యక్షుడు రామచంద్ర ముర్కుటేపిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో నిర్వహించిన కిసాన్ అధికార్ ర్యాలీలో లక్షలాదిమంది రైతులు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లా ల నుంచి దాదాపు 1,500 మంది రైతులు పాల్గొన్నారు. వీరిలో వంద మంది వరకు మహిళా రైతులుకూడా ఉన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిం చేందకు గ్రామగ్రామాన పోరాటాలు చేయాలని పేర్కొన్నారు. డిమాండ్లు సాధించుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశా రు. రైతుల సమస్యలపై స్పందించని ప్రభుత్వాలను గద్దె దించే వరకు తమ ఉద్యమించాలని అన్నారు. ఆహార భద్రత బిల్లుతో ప్రపంచ దేశాల మధ్య భారతదేశాన్ని తిండికొరత ఉన్న దేశంగా అప్రతిష్టపాలు చేశారని ఆరోపించారు. ధర్నాలో పాల్గొన్న భారత కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్యాద అంజిరెడ్డి మాట్లాడుతూ..వ్యవసాయ ఉత్పత్తులన్నింటిని లాభసాటి ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాల ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టాలన్నారు. నీరు, విత్తన ప్రైవేటీకరణకోసం పార్లమెం టులో ప్రవేశపెట్టిన బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. నీరు, విత్తనాలపై రైతాంగానికే సంపూర్ణ అధికారం ఉండాలన్నారు. భూసేకరణ చట్టాన్ని పేరు మార్చి భూవినియోగ చట్టంగా చేయాలన్నా రు. వ్యవసాయ భూములపై రైతులకే హక్కులు ఉండేవిధంగా చట్టం తీసుకురావాలన్నారు. వ్యవసాయ భూములు ఇతర అవసరాలకు వాడితే రైతులకు రాయల్టీ చెల్లించాలని డిమాండ్ చేశారు. భూమిలోని అన్ని ఖనిజాలపై రైతులకు హక్కులు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడకొట్టు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వ్యవసాయ విత్తన ఉత్పత్తి బహుళ జాతీయ కంపెనీల హస్తగతమైం దని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పోరాడని రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లపు సూర్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.సాయిరెడ్డి,రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీధర్రెడ్డి,కుమారస్వామి, సురేందర్రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.