రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ధర్నా
రాజమండ్రి: రేషన్ కార్డుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి లో వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టింది. రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఉదయం ఆందోళన చేశారు. ధర్నాలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళనలో నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, సూర్యప్రకాశ్ రావు, షర్మిలా రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.