breaking news
Railway issues
-
రైల్వే సమస్యలు పరిష్కరించండి
- దక్షిణ రైల్వే జీఎంకు ఎమ్మెల్యే రోజా వినతి - తిరుపతి - చెన్నై మధ్య డీజీ రైలు పుత్తూరు:నగరి నియోజకవర్గ పరిధిలోని రైల్వేస్టేషన్లల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె చెన్నైలోని సదరన్ రైల్వే జీఏం అశోక్కుమార్ అగర్వాల్, డీఆర్ఎం అనుపం శర్మలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మె ల్యే పేర్కొన్న ప్రధాన సమస్యలు ఇవీ.. - ప్రధానంగా ఏకాంబర కుప్పం రైల్వే గేటు వద్ద రాకపోకల సందర్భంగా రోడ్డు ఛిద్రమైపోవడంతో తరచూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వెంటనే మరమ్మతులు చేపట్టాలి. -ప్రయాణికులకు షెల్టర్లు, పైనుంచి దిగే ప్రయాణికులకు వీలుగా మెట్లు ఏర్పాటు చేయాలి. ఇక్కడ చెన్నై- ముంబై ఎక్స్ప్రెస్ స్టాపింగ్కు చర్యలు తీసుకోవాలి. - నగరి రైల్వేస్టేషన్లో ఉన్న ప్లాట్ ఫాం పెంచాలి. - సప్తగిరి ఎక్స్ప్రెస్తో పాటు చెన్నై నుంచి తిరుత్తణి వరకు వచ్చే యూనిట్ ట్రైన్లను తిరుపతి వరకు పొడిగించాలి. -పుత్తూరు రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ రెండు షిప్టులు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. - ప్రస్తుతం ఉన్న షెల్టర్లు ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోవడంలేదు. కొత్తగా షెల్టర్లు నిర్మించాలి. - తాగునీటి సౌకర్యంతో పాటు వెయిటింగ్ హాల్లో అదనంగా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. - పూడి రైల్వేస్టేన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. అక్కడ అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగే ఏర్పాటుచేయాలి. - ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నుంచి ప్రత్యేకంగా విద్యుత్లైన్లు ఏర్పాటుచేసి రైల్వేస్టేషన్తో పాటు పక్కనే ఉన్న ఊరికి 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించాలి. - పాత రైల్వేస్టేషన్ బిల్డింగ్ను వెయింటింగ్ హాల్గా మార్చాలి. అలాగే అప్రోచ్రోడ్లు వేయాలి. - వేపగుంట రైల్వేస్టేషన్ వద్ద లిఫ్ట్ గేటు మరమ్మతులు చేపట్టాలి. ప్లాట్ఫాం పెం చడంతో పాటు ప్రయాణికులకు తాగునీ టి వసతి, ఇరువైపులా షెల్టర్లు నిర్మిచాలి. - ఎమ్మెల్యే రోజాతో పాటు తిరుపతి ఎంపీ వరప్రసాద్, నగరి మున్సిపల్ చైర్పర్సన్ కెజె.శాంతికుమార్, వైఎస్ఆర్సీపీ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెజె.కుమార్, బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలుమలై(అమ్ములు)తో పాటు పుత్తూరు, నగరి నాయకులు రైల్వే ఉన్నతాధికారులను కలిసిన వారిలో ఉన్నారు. తిరుపతి - చెన్నై డీజీ రైలు తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాట్లాడు తూ, తిరుపతి నుంచి పుణ్యక్షేత్రాల మీదుగా షిర్డీకి డీజీ రైలు నడపాలని గతంలో కేంద్ర రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశామని పేర్కొంటూ, మరికొద్ది రోజు ల్లో ఇది కార్యరూపం దాల్చబోతోందన్నారు. కేంద్రం పచ్చ జెండా ఊపడంతో త్వరలో ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట ైరె ల్వే స్టేషన్లలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. -
రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి
వెంకటగిరి టౌన్: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వేపరమైన సమస్యలను ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావు అన్నారు. రైల్వే సమస్యలపై వెంకటగిరిలో శనివారం ఆయన స్థానికులతో చర్చించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రైల్వే జీఎం పర్యటనకు హాజరుకాలేకపోయానన్నారు. ప్రజల నుంచి సమస్యల వివరాలు సేకరించి ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు రైల్వే మంత్రితో చర్చిస్తాన్నారు. ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. శేషాద్రి, శబరి ఎక్స్ప్రెస్లను వెంకటగిరిలో నిలిపేలా చూడాలన్నారు. నిమ్మ ఎగుమతుల నేపథ్యంలో హౌరా ఎక్స్ప్రెస్లో ప్రత్యేక బోగీ ఏర్పాటు చేయాలని, యాతలూరు రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ రైళ్లను నిలపాలని కోరారు. బుసపాళెం వద్ద రైల్వే క్రాసింగ్ను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. వెంకటగిరి- నాయుడుపేట మార్గంలో రైల్వేస్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తిరుపతి నుంచి షిరిడీకి రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని సాయిభక్తులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ వరప్రసాద్రావు స్థానిక రైల్వేస్టేషన్ మాస్టర్ శేషగిరిరావుతో సమావేశమై ప్రజల నుంచి వచ్చిన వినతులపై చర్చించారు. వీటిలో కొన్ని సమస్యలను ఇటీవల రైల్వే జీఎం శ్రీవాత్సవ దృష్టికి తీసుకెళ్లామని స్టేషన్ మేనేజర్ వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఆవుల గిరియాదవ్, నాయకులు నక్కా వెంకటేశ్వరరావు, చిట్టేటి హరికృష్ణ, మధు, సాయినాయుడు, కె రాజారెడ్డి, తిరుమల పాల్గొన్నారు.