-
నాటా కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ రాఘవరెడ్డి
సాక్షి, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రాఘవరెడ్డి గోశాల బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఎన్నికైన నాటా కార్యవర్గ సభ్యులతో నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమసాగర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కమిటీలో రాఘవరెడ్డితోపాటు కొర్సపాటి శ్రీధర్రెడ్డి, బాలా ఇందుర్తి, ఆళ్ల రామిరెడ్డి, గండ్ర నారాయణరెడ్డి, సోమ వరపు శ్రీనివాసులురెడ్డి, శివ మేక, గంగసాని రాజేశ్వర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి కొట్లూరు, రమణారెడ్డి క్రిస్టపాటి, కోటిరెడ్డి బుర్ల, శ్రీనివాస్రెడ్డి కానుగంటి, పెనుమాడ శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. డాక్టర్ రాఘవరెడ్డి గోశాల ప్రస్థానం.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా కొండమీది కొండూరు గ్రామంలో రైతు కుటుంబంలో రాఘవరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన ఉన్నత విద్యకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకొన్నారు. వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా ఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. నాటా ద్వారా అమెరికాలోని తెలుగువాళ్లకే కాకుండా ఏపీ, తెలంగాణల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాఘవరెడ్డి నాటా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆయన స్వగ్రామంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఏటా సొంత ఊరికి వచ్చి అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటారని, ఎవరు ఎలాంటి సహాయం అడిగినా కాదనకుండా చేస్తారని ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. -
మున్సిపల్ బరిలో వైఎస్సార్సీపీ
మంకమ్మతోట, న్యూస్లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్చార్జి కొండ రాఘవరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డితో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2కార్పొరేషన్లలో 100 కార్పొరేటర్ స్థానాలు, 9 మున్సిపాలిటీల్లో అన్ని కౌన్సిలర్ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తారని తెలిపారు. సంక్షేమమే అజెండాగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో శాతవాహన విశ్వవిద్యాలయం, రూ.1300 కోట్లతో రాజీవ్ రహదారి, రూ.73కోట్లతో అండర్గ్రౌండ్ డ్రె రుునేజీ నిర్మాణం చేపట్టారన్నారు. రాజీవ్గృహకల్ప, ఎల్లంపల్లి ప్రాజెక్టునిర్మాణం, నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ తీసుకొచ్చారని చెప్పారు. వ్యవసాయానికి ఉచిత వి ద్యుత్ సౌకర్యం కల్పిస్తూ మొదటి సంతకం చేశారని గు ర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగిపోయిందని, పెద్ద రాష్ట్రంగా ఉంటే బాగుంటుందని తమ అధినేత భావిం చారన్నారు. పజా సంక్షే మంకోసం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచారని, వారంతా వైఎస్సార్ సీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానా లు సాధించి విజయభేరి మోగిస్తామని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీచేస్తామని, తమ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి, షర్మిల, వైఎస్.విజయమ్మ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. నగర కన్వీనర్ డాక్టర్ కె.నగేశ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బోరుునపల్లి శ్రీనివాసరావు, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ అక్కెనపెల్లి కుమార్, ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ మోకెనపెల్లి రాజమ్మ, రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యుడు మోతె గంగారెడ్డి, మహిళా విభాగం నగర కన్వీనర్ బోగె పద్మ, ఎస్టీసెల్ జిల్లా కన్వీనర్ భూక్య రఘునాయక్, సేవాదళ్ జిల్లా కన్వీనర్ జూపాక సుదర్శన్, మహిళావిభాగం జిల్లాప్రధాన కార్యదర్శి గంట సుశీల, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ ఎండీ.అస్లమ్, నగరకన్వీనర్ ఎస్కే.జావిద్, వేణుమాధవ్రావు, అవినాశ్రెడ్డి, కాసారపు కిరణ్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక మంకమ్మతోట, న్యూస్లైన్ : నగరంలోని ఒకటి, 21వ డివిజన్కు చెందిన పలువురు యువకులు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. విద్యార్థి నాయకులు అవినాశ్రెడ్డి, గంగాధర కల్యాణ్, మోతె రాకేశ్ ఆధ్వర్యంలో చేరిన వీరికి పార్టీ అధికార ప్రతినిధి, మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్చార్జి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఒకటో డివిజన్కు చెందిన గంగాధర భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, లక్ష్మి, భరణి, సంతప్, శ్రీనివాస్, కనకరావు, థామస్, వంశీ, సిద్దార్థ, రాజు, సాయి, జనార్దన్, మిహ పాల్, 21వ డివిజన్ నుంచి రాజు, రాకేశ్, కార్తీక్, సాయిచరణ్, సాయిరామ్, ప్రకాశ్, ఆదిత్య, సురేష్, శ్రావణ్, అజయ్, విజయ్, గగన్, అభిరామ్, రమేష్, శ్రీను, చందు, హరీశ్, నరేశ్, షఫీ, సాయిచంద్, వంశీ తదితరులు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement