breaking news
Quthbullapur mla
-
'కష్టపడే తత్వం ఉన్న నేతలు పార్టీని వదలరు'
హైదరాబాద్ : స్వతంత్రంగా ఎదగాలని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తమకు సూచించారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానందా తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో కెపి వివేకానందా మాట్లాడుతూ... ఎదిగే ప్రయత్నంలో ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కష్టపడే తత్వం ఉన్న నేతలు టీడీపీని వదలరన్నారు. అధికార టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగి ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, సాయన్న, తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీని వీడారని ఆరోపించారు. తాను కానీ మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కానీ టీడీపీని వీడటం లేదని తెలిపారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ఉందని విమర్శించారు. తాను కూడా పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీ కేడర్లో గందరగోళం సృష్టించేందుకే టీఆర్ఎస్ అలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావాలని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఇప్పటికే కోరామని వివేకానందా తెలిపారు. -
'మంత్రి పదవుల కోసమే రేవంత్ పై విమర్శలు'
హైదరాబాద్: మంత్రి పదవుల కోసమే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేత రేవంత్రెడ్డిపై విమర్శలు గుప్పించేందుకు పోటీ పడుతున్నారని కుత్భుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు ప్రెస్మీట్ పెట్టి పోటీపడ మరీ రేవంత్ ను తిడుతున్నారని వాపోయారు. డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంపై శాసనసభలో రేవంత్రెడ్డిని మాట్లాడనివ్వాలని కోరారు. కాగా, రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖండించారు.టీడీపీని ఎదుర్కొనే సత్తా లేకే అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. రేవంత్ మాట్లాడితే వాస్తవాలు బయటికి వస్తాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అన్నారు. అధికారపక్షమే పోడియంలోకి వచ్చి సభను వాయిదా వేయించిన ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.