breaking news
Pugazh
-
హీరోగా మారిన కమెడియన్, నిజమైన పులితో యాక్టింగ్
హాస్యనటులు కథానాయకులుగా మారడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కోలీవుడ్లో వడివేలు, సంతానం, సూరి.. హాస్యనటులు కథానాయకులుగా అవతారమెత్తి రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ వరుసలో ఇప్పుడు నటుడు పుగళ్ చేరారు. 4 జే స్టూడియోస్ పతాకంపై ఎస్.రాజతంత్రం, జబాజాన్ కలిసి నిర్మించిన చిత్రం మిస్టర్ జూ కీపర్. పుగళ్ హీరోగా నటించిన ఇందులో నటి షెర్లిన్ కాంచాలా హీరోయిన్గా నటించారు. జె.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. కథ చెప్పి మాయమయ్యాడు ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు సూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుగళ్ మాట్లాడుతూ.. ముందుగా దర్శకుడు తనను కలిసి కథ చెప్పి ఆ తరువాత కనిపించలేదన్నారు. కొంత కాలం తరువాత మళ్లీ కనిపించి వెంటనే షూటింగ్కు బయలుదేరండి అని చెప్పారన్నారు. అలా ఈ మూవీలో అవకాశం వరించిందన్నారు. పులిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించా ఈ మూవీలో నిజమైన పులితో నటించడం ముందు భయంగా అనిపించిందన్నారు. ఆ తరువాత దాన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించానన్నారు. అలా ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. సూరి మాట్లాడుతూ హీరోగా గెలవడం కంటే నిలబడడం కష్టమన్నారు. పుగళ్లో మంచి నటుడు ఉన్నాడని, హీరోగా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని సూరి అన్నారు. చదవండి: 'వ్యూహం' విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ -
హీరోగా మారిన మరో కమెడియన్
కథానాయకులుగా అవతారమెత్తిన హాస్యనటుల సరసన ఇప్పుడు నటుడు పుగళ్ చేరారు. కుక్ విత్ కోమాలి బుల్లితెర కార్యక్రమంతో పాపులర్ అయిన ఈయన ఆ తరువాత సినీ రంగప్రవేశం చేసి హాస్యనటుడిగా అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తుడిక్కరదు మీసై చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. యోగి వీరన్ పిక్చర్ పతాకంపై రాము నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎంజే ఇళన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఎస్డీ సభ వద్ద పలు చిత్రాలకు సహాయదర్శకుడిగా పనిచేశారు. తుడిక్కరదు మీసై చిత్ర యూనిట్ అదేవిధంగా నిర్మాత కలైపులి.ఎస్.థాను వద్ద పనిచేసి అనుభవం గడించారు. తుడిక్కరదు మీసై చిత్రం గురువారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకునే ఈతరం యువత గురించి చెప్పే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని వినోదాన్ని జోడించి జనరంజకంగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. చిత్ర కథ మదురై నుంచి చైన్నె వరకూ సాగుతుందని చెప్పారు. సినిమాపై ఆసక్తి, ప్రతిభ కలిగిన యూనిట్తో షూటింగ్కు సిద్ధమైనట్లు చెప్పారు. కాగా దీనికి అశోక్కుమార్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్నారు.