-
టీఆర్ఎస్లో నిరంకుశ పోకడలు: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిరంకుశ పోకడలు పెరిగిపోయాయని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కేబినెట్ పని చేయడం లేదన్నారు. టీజేఎస్ కార్యాలయంలో శుక్ర వారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కమిటీ నియామకం టీజేఎస్ పూర్తిస్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని కోదండ రామ్ శుక్రవారం ప్రకటించారు. తాను అధ్యక్షునిగా వ్యవహరించే పార్టీలో ఉపాధ్యక్షులుగా సయ్యద్ బదృద్దీన్, పీఎల్ విశ్వేశ్వర్రావు, రమేష్రెడ్డి, రాజమల్లయ్యను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా జి.వెంకట్రెడ్డి, ఎ. శ్రీనివాస్, కె.ధర్మార్జున్, జి.శంకర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బాబన్న, బైరి రమేష్, భవానీరెడ్డి, మురళీధర్, జాయింట్ సెక్రటరీలుగా రాజు, రాయప్ప, ముజాహిద్, ఆశప్ప, కోశాధికారిగా డీపీరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వెంకటేశ్వర్రావు, మమత, మోహన్రెడ్డి, లక్ష్మారెడ్డిని నియమించారు. -
వాటి ఫలితమే టీఆర్ఎస్ విజయం: కోదండరామ్
డల్లాస్: ఎన్నికలను మేనేజ్ చేయడం వల్లగానీ, మీడియాను మేనేజ్ చేయడంతోగానీ రాజకీయ పార్టీలు విజయాలు సాధించలేవని ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. డల్లాస్లో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్న సందర్భంగా కోదండరామ్ పలు అంశాలను ప్రస్తావించారు. ‘సామాజిక ఉద్యమాలు, ఘర్షణలు, కదలికలు, అప్పటి పరిస్థితులు ఎన్నికలకు మూలమని విశ్వసిస్తున్నాను. రాజకీయమంటే మీడియాను మేనేజ్ చేయడం, డబ్బులు పంచడం, ఎన్నికలను మేనేజ్ చేయడం కాదు. తెలంగాణ ప్రాంతంలోని సామాజిక పరిస్థితులు, ఉద్యమం, ఇతరత్రా కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఇప్పడు అలాంటి పరిస్థితులు లేవు. ఎన్నికల్లో నెగ్గిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సైతం ప్రస్తుతం ఎన్నికల కోసం అభ్యర్థులను ఎలా కొనగలం, ఇతర పార్టీల నేతలను ఏ విధంగా మన పార్టీలోకి రప్పించాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మన నిర్వహణ సామర్థ్యం ఎలా పెంచుకోగలమని ఆలోచిస్తున్నారు. తొలిదశ ఉద్యమకాలంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యమపార్టీ టీపీఎస్ నుంచి సాధారణ అభ్యర్థులు బరిలోకి దిగి.. కాంగ్రెస్ను ఓడించారు. అయితే ఆ సమయంలో పేపర్ తప్పా ఇతర మీడియా లేకున్నా ఆనాటి పరిస్థితుల కారణంగా టీపీఎస్ గెలుపొందింది. అప్పుడు ఎవరూ ఎన్నికలను గానీ, మీడియాను గానీ మేనేజ్ చేయలేదు. ఉద్యమం ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది. డీపీఆర్ చెప్పండి, చూపించాలని మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివరాలు అడిగితే ఏ విషయాలు చెప్పడం లేదు. సాధారణ రైతులకు జవాబు చెప్పడం లేదు, సిటీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్లాన్ వివరాలు అడిగితే అలాంటివేం లేవు సార్.. ఆ కనిపిస్తున్న చోటు నుంచి ఇక్కడివరకూ భూమి తీసుకోవాలని చెప్పారని అధికారులు చెప్పారని గుర్తుచేశారు. మీకు గుర్తింపు ఉంది కానీ మీకు రాజకీయాలు రావు. అందుకే మీరు ఉంటే మాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మీరు ముందుండండి మేం పనులు చూసుకుంటామని కొందరు అన్నారు. ఎన్నికలను ప్రధానం చేసి ఆలోచిస్తున్నారు. మోసం, దగా తెలియాలి, మాయమాటలు చెప్పడం రావాలి అంటున్నారు. మరికొందరు మాత్రం మీతో డబ్బులు లేవు, మీ వల్ల ఇలాంటివి సాధ్యం కావని చెప్పారు. ఈ ఇద్దరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాం. మేం ఉండాలంటారు.. కానీ పనులు మాత్రం మీరే చూసుకుంటాం అంటున్నారు. అలాంటప్పుడు మేం ఉండటం ఎందుకు అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్లోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేస్తారని అడిగితే వాటికి సమాధానం కరువైందంటూ’ ప్రొఫెసర్ కోదండరాం తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. -
పారిశ్రామిక విధానంలో లోపాలు
ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: పారిశ్రామిక విధానంలో లోపాలున్నాయని, చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి ఈ పారిశ్రామిక విధానం తోడ్పడటం లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమల పునరుద్ధ రణకు జేఏసీ కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. శనివారం ఇక్కడ అఖిల భారత చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు 4,500 చిన్న, మధ్యతరహా పరిశ్ర మలు మూత పడితే, రాష్ట్రం వచ్చిన తర్వాత 2 వేలకుపైగా పరిశ్రమలను బ్యాంకులు బకా యిల పేరిట జప్తు చేసుకున్నాయన్నారు. వేల ఎకరాలను పెద్ద కంపె నీల కోసం సేకరిస్తున్న ప్రభుత్వం.. చిన్న పరిశ్రమల కు 250 గజాల స్థలం ఇవ్వడంలేదని ఆరోపించారు. -
నీళ్లు సరే.. నియామకాలు ఏవీ?
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తూప్రాన్ /రామాయంపేట: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో విలేకరులతో, రామాయంపేటలో సభలో ఆయన మాట్లాడారు. నియామకాలను ప్రభుత్వం విస్మరించిందని, ఇందుకోసం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే ప్రభుత్వం కేవలం 15 వేలే భర్తీ చేసిందన్నారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన యువతను విస్మరించిందని మండిపడ్డారు. ఉద్యోగ కల్పన కోసం ఈ నెల మూడో వారంలో హైదరాబాద్లో నిరుద్యోగులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే తేదీ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని విమర్శించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగిందని ఆరోపించారు. -
విద్యా విధానంలో అంతరాలు తొలగాలి
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం శంషాబాద్: ప్రస్తుత విద్యావిధానంలో ఉన్న అంతరాలు తొలగిపోవాల్సిన అవసరముందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో రెండు రోజులపాటు జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఇందులో కోదండరాం మాట్లాడుతూ చదువులో అన్నివర్గాల ప్రజలకు సమానావకా శాలు అభించడం లేదనీ, కొందరిని నిరాదరణ వెంటాడుతోందన్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పనిచేయడం లేదన్నారు. విద్యార్థులు సంఘటిత శక్తిగా మారితేనే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement