breaking news
primary agricultural co-operative
-
కొత్తగా 10,000 కోఆపరేటివ్ సొసైటీలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 10,000 బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (కోఆపరేటివ్ సొసైటీలు/ఎం–పీఏసీఎస్) ఏర్పాటయ్యాయి. కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్షా వీటిని ప్రారంభించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో 2 లక్షల ఎం–పీఏసీఎస్లను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని పంచాయతీ స్థాయిలో కోఆపరేటివ్ సొసైటీలు సమర్థవంతంగా పనిచేస్తే తప్పించి వీటి ద్వారా ఆశించిన సంపద సృష్టి సాధ్యపడదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సహకార రంగంలో డిజిటలైజేషన్ ప్రాధానాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే అన్ని పీఏసీఎస్లను కంప్యూటరీకరించి, వాటిని అనుసంధానించినట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన సొసైటీలకు రిజి్రస్టేషన్ సరి్టఫికెట్లు, మైక్రో ఏటీఎంలు, రూపే కిసాన్ కార్డులను ఈ సందర్భంగా అందించారు. -
దుర్శేడ్ పీఏసీఎస్లో చోరీకి యత్నం
కరీంనగర్ జిల్లా దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)లో చోరీ యత్నం చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి కార్యాలయంలోకి చొరబడ్డ ఒక గుర్తు తెలియని వ్యక్తి డబ్బును భద్రపరిచే లాకర్ను తెరవటానికి యత్నించాడు. అది తెరుచుకోక పోవడంతో వెనుదిరిగాడు. వెళ్తూవెళ్తూ టేబుల్ సొరుగులో ఉంచిన రూ.1200 ఎత్తుకు పోయాడు. చోరీ విషయం సోమవారం ఉదయం వెలుగుచూసింది. పీఏసీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కార్యాలయంలోని సీసీ ఫుటేజిని పరిశీలించారు. స్థానికుడే దొంగతనానికి యత్నించినట్లు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.