breaking news
posterity
-
సంప్రదాయాలను భావితరాలకు చాటుదాం
మంత్రి పరిటాల సునీత అనంతపురం ఎడ్యుకేషన్ : తెలుగింటి అభిరుచులు, అలవాట్లు, సంప్రదాయాలు భావితరాలకు చాటుదామని పౌర సరఫరాల శాఖ మంత్రి పల్లె సునీత పేర్కొన్నారు. సాంస్కృతిక వ్యవహార శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్లో సంక్రాతి సంబరాలు-15 జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్చౌదరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి వేడుకలు’ నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు రూ. కోటి రూపాయలు నిధులు విడుదల చేశారన్నారు. ఇక్కడ స్టాళ్లు, ముగ్గుల పోటీలు, గురవయ్యలు, కబడ్డీ, సాంస్కృతిక కార్యక్రమాలు పల్లెలను గుర్తు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబమూ సంక్రాంతి పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ‘చంద్రన్న సంక్రాతి కానుక’ అందజేశామన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి నిలువుటద్దంలా ఉన్న అనంతపురం జిల్లా ఔన్నత్యాన్ని చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ పల్లె వంటకాలతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. ఇన్చార్జి కలెక్టరు లక్ష్మీకాంతం మాట్లాడుతూ భాషా ప్రయుక్తంగా ఏర్పడిన సంక్రాంతి పండుగను ఆడంబరంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతపురం మేయర్ మదమంచి స్వరూప, ఏజేసీ ఖాజామొహిద్దీన్, డీఆర్వో హేమసాగర్, జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
మన సంస్కృతిని భావితరాలకు అందించాలి
పల్లారుగూడ (సంగెం) : రోజురోజుకూ కనుమరుగవుతున్న సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. సంగెం మండలంలోని పల్లారుగూడ శివారు మహారాజ్తండాలో గురువారం సంగెం జెడ్పీటీసీ సభ్యురాలు గుగులోత్ వీరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యూరు. ఈ సందర్భంగా రాజయ్యను గిరిజనులు డప్పుచప్పుళ్లతో ఘనంగా స్వాగతించి సన్మానించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తీజ్ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా... గత పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు 18 ఏళ్లు నిండిన గిరిజన యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.50 వేల ఇవ్వనున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. గిరిజనులు, మైనార్టీలు, దళితుల అభివృద్ధికి రూ.వేల కోట్లు కేటారుుంచారన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే దళిత, గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులకు నెలకు వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1,500 చొప్పున దసరా నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు పునరుద్ఘాటించారు. ఐదేళ్లలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రుపొందించుకుందామన్నారు. గంగదేవిపల్లిలాగ దేశంలో పేరు వచ్చేలా రాజకీయూలకతీతంగా... పోటీతత్వంతో గ్రామాభివృద్ధికి కృషిచేయూలన్నారు. కాగా, మైదాన ప్రాంతానికి ప్రత్యేక ఐటీడీఏను ఏర్పాటు చేయాలని రాజయ్యను పలువురు గిరిజనులు కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, స్వామి నాయక్, వర్ధన్నపేట ఎంపీపీ మార్నెని రవీంద ర్రావు, లలితాయాదవ్, భరత్కుమార్రెడ్డి, మదన్కుమార్, సాగర్రెడ్డి, గోపీసింగ్, శంకర్రావు, దేవ్సింగ్, వీరన్న, యాదగిరిరావు. రాజు, సంపత్, సదానందం పాల్గొన్నారు.