breaking news
Planning Commission Deputy Chairman
-
జూన్ నాటికి 1400ఇళ్లు పూర్తి
వనపర్తి/పెద్దమందడి(ఖిల్లాఘనపురం): జూన్ నాటికి వనపర్తి నియో జకవర్గంలో 1400 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని 2019 ఎన్నికల నాటికి మరో 2వే ల ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని మంగంపల్లిలో ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామానికి 20ఇళ్లు మంజూరయ్యాని తెలిపారు. అవసరమై న ప్రతి గ్రామానికి మంజూరు చేస్తామన్నారు. నిరుపేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు నాణ్యతతో, సకాలంలో నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు మం జూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దయా కర్, ఖిల్లాఘనపురం వైస్ ఎంపీపీ ఉమామహేశ్వరి, కాంగ్రెస్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి గిరిజాదేవి, నాయకులు సత్యారెడ్డి, బుచ్చిలింగం, రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయ కులు మేఘారెడ్డి, సర్పంచ్ శ్రీలత, సింగల్విండో అధ్యక్షుడు విట్టా శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్యాడ్ అంచనాల కంటే తగ్గొచ్చు: మాంటెక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) అంచనాల(జీడీపీలో 3.8%)కన్నా తక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీని వెనక్కి తీసుకుంటే ఆ ప్రభావాన్ని తట్టుకోగల స్థాయిలోనే భారత్ ఉందని వివరించారు. దేశంలోకి వచ్చే, దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్య తేడాను క్యాడ్గా వ్యవహరిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో క్యాడ్ జీడీపీలో 4.8 శాతం(8820 కోట్ల డాలర్లుగా) నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనిని 3.8 శాతానికి(7,000 కోట్ల డాలర్లు) తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.