breaking news
pitition dismissed
-
జనసేనకు హైకోర్టు షాక్.. ఎఫ్ఐఆర్ రద్దుకు నిరాకరణ
సాక్షి, అమరావతి: విశాఖ జనసేన కార్యకర్తలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. విశాఖ జనసేన కార్యకర్తలపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలైని పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్కు విచారణ అర్హత ఉందో లేదో తేలుస్తామని వెల్లడించింది. అసలు నిందితుడు కాని మూడో వ్యక్తి ఎఫ్ఐఆర్ను ఎలా సవాలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ప్యాకేజీల పవన్, బాబులతో ఒరిగేదేమీ లేదు: మంత్రి కాకాణి -
ఆజాద్ ఎన్కౌంటర్ కేసు.. భార్య పిటిషన్ కొట్టివేత
మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్ ఎన్కౌంటర్పై అనుమానం వ్యక్తంచేస్తూ ఘటనకు సంబంధమున్న పోలీసులను విచారించాల్సిందిగా ఆయన భార్య పద్మ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కోర్టు కొట్టేసింది. తీర్పుపై స్పంచిందిన పద్మ.. ఆదిలాబాద్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. బూటకపు ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టంచేశారు. 2010లో ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతంలో ఆజాద్ సహా జర్నలిస్ట్ హేమచంద్రపాండే పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. అయితే అది బూటకపు ఎన్కౌంటర్ అని, వారిద్దరినీ సజీవంగా పట్టుకొని చిత్రహింసలు చేసిన అనంతరం చంపారని పలు హక్కుల సంఘాలు ఆరోపించాయి. న్యాయవిచారణ చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.