breaking news
photogarphers
-
బాల ఫోటో గ్రాఫర్లకోసం అదిరిపోయే కెమెరా..ఫీచర్లు ఏంటంటే ?
-
ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’కి ఆరు బహుమతులు (ఫొటోలు)
-
Corona Tragedy: ఫొటో, వీడియోగ్రాఫర్ల బతుకులు ఆగం
కరోనాతో అందరి బతుకులు ఆగమవుతున్నాయి. ఉపాధి కోల్పోయి పూటగడవని పరిస్థితుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఫొటోగ్రాఫర్ల జీవితాల్లో కరోనా వైరస్ చీకట్లు నింపింది. పెళ్లిళ్ల సీజన్లో వీడియోగ్రాఫర్లు ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకుని మిగతా సమయాల్లో ఎలాగోలా కాలం వెల్లదీస్తారు. అలాంటిది కరోనా అడ్డంకులు, ఆంక్షలతో పెళ్లిళ్లు, శుభకార్యాలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో పెళ్లిళ్ల గిరాకీ రాకపోవడం, మామూలు ఫొటోలు ఎవరూ దిగకపోవడం, లాక్డౌన్తో షాపులు తెరుచుకోకపోవడంతో అటు ఉపాధి కరువై ఇటు షాపుల అద్దె చెల్లించలేక, పూటగడవక అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యానగర్(కరీంనగర్): కరోనా ప్రభావం అన్ని వర్గాలవారిపై ప్రభావం చూపిస్తోంది. ఫొటోగ్రాఫర్ వృత్తిపై సైతం ఎక్కువగానే ఉంది. స్టూడియోలు ఏర్పాటు చేసుకున్న వారికంటే పెద్ద కెమెరాలు కొనుగోలు చేసి పెళ్లిళ్ల సీజన్లో పని చేసే ఫొటోగ్రాఫర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రభావానికి గతంలో వలె ఆర్భాటంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగడం లేదు. దీంతో ఫొటోగ్రాఫర్లకు పని తగ్గిపోయింది. ప్రస్తుతం పెద్ద ఫంక్షన్ల ఊసే లేకుండా పోయింది. తగ్గిన డిమాండ్.. అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు సైతం మమ అన్నట్లుగా చేస్తుండటం, పెళ్లిళ్లకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో పెళ్లివారు ఫొటోలు, వీడియోలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో గతంలో కంటే ఒక్కో పెళ్లి ఆర్డర్లో 50 శాతం రేట్లు తగ్గించినా గిరాకీలు రావడం లేదని వాపోతున్నారు. సీజన్ ఫొటోగ్రఫీ చేసేవారు కొందరు కిస్తీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫొటో స్టూడియో ఉన్నవారి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఇటు ఆర్డర్లు లేక, అటు కిరాయిలు కట్టలేక అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి పెళ్లిళ్ల సీజన్లో లాక్డౌన్ ఆంక్షలతో వేడుకలు సాదాసీదాగా జరుపుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ సెషన్స్ లేదు. ఇరుపక్షాల నుంచి ఒక్కరితోనే ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇదివరకు ఒక పెళ్లికి దాదాపు ఐదారుగురికి పని దొరికేది. ఇప్పుడు అన్ని ఒక్కడై ఫొటోలు, వీడియోలు తీసుకుంటుండడంతో మిగతావారికి పని లేకుండా పో యింది. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి. – ఆవుల నరేశ్, తారిక ఫొటో స్టూడియో, కరీంనగర్ ఫోన్లతో తీసుకుంటున్నారు కరోనా మహమ్మారితో ఎక్కువ మందిని పెళ్లిళ్లు, శుభాకార్యాలకు పిలవడం లేదు. 20, 30 మంది సమక్షంలో పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. కొంత మంది సెల్ఫోన్లలోనే ఫొటోలు తీసుకుంటున్నారు. రిసెప్షన్ వంటివి లేకుండా పోయాయి. అన్ని ఒక్కరోజు, ఒక్క దగ్గరే జరిపిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో పని లేకుండా పోయిందని వీడియో, ఫొటోగ్రాఫర్లు బాధపడుతుంటే మరోపక్క కరోనా మా బతుకులను వీధిన పడేసింది. – నకిరేకొమ్ముల శ్రీనాథ్, వీడియోగ్రాఫర్, కరీంనగర్ బతుకులు రోడ్డునపడ్డాయి.. కరోనాతో గతేడాదిగా ఉపాధి కరువైంది. ఈ పెళ్లిళ్ల సీజన్పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఈ సీజన్లో కొన్ని పెళ్లిళ్లకు అడ్వాన్స్ తీసుకున్నాం. కరోనా సెకండ్వేవ్తో పెళ్లి ఊరేగింపులు లేవు, హంగామా లేదు. అంతా సాదాసీదాగా చేస్తున్నారు. దీంతో ఎవరికీ పని లేకకుండా పోయింది. మామూలు రోజుల్లో ఒక్క పెళ్లి ద్వారా 100 మందికి ఉపాధి దొరికేది. క్యాటరింగ్, డెకరేషన్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఇలా.. ప్రస్తుతం అందరి బతుకులు రోడ్డునపడ్డాయి. – గోగుల ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్, గోగుల ఈవెంట్స్ కరీంనగర్ పోషణ కష్టమవుతోంది కరోనాతో గిరాకీ లేక కుటుంబ పోషణ కష్టమవుతుంది. పెళ్లిళ్లు జరుగుతున్నా ఒక్కరికే అవకాశం ఇస్తున్నారు. తక్కువ మందితో కార్యాన్ని కానిస్తున్నారు. కరోనాకు ముందు ఒక పెళ్లికి దాదాపు ఫొటో, వీడియోకు లక్ష రూపాయల వరకు బడ్జెట్ కేటాయించే వారు. ఇప్పుడు కేవలం పెళ్లి ఫొటోలతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో అందరికీ ఉపాధి లభించడం లేదు. – బద్దరి వంశీ, వీడియోగ్రాఫర్, కరీంనగర్ చదవండి: Telangana: లాక్డౌన్ను పొడిగిస్తూ, పలు సడలింపులు -
జర్నలిస్ట్ నుంచి ఈ స్థాయికి వచ్చాను: మంత్రి
సాక్షి, అమరావతి: విజయవాడలోని కల్చరల్ ఆఫ్ సొసైటీలో ఫోటోగ్రాఫర్ జర్నలిస్టుల అవార్డ్స్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొని ఫోటో గ్రాఫర్లకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. తానూ ఒక జర్నలిస్ట్గా పని చేసి ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. ఎక్కడి నుంచి వచ్చినా మన మూలాల్ని మర్చిపోకూడదని, రిపోర్టర్ కన్నా ఫొటోగ్రాఫి చాలా కష్టమైన పని అని అన్నారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు తాను జర్నలిస్టునని, అప్పుడు ఒక ఫొటోగ్రాఫర్.. ఎన్టీఆర్ కనురెప్ప నుంచి కారుతున్న నీటి బిందువును కెమెరాలో బంధించారని చెప్పారు. ఆ ఫొటో చూశాక తనకు ఫొటోగ్రాఫర్లపై మరింత గౌరవం పెరిగిందన్నారు. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్స్ అందరితో కలిసి పనిచేసిన తాను.. ఇప్పుడు వారికే అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఫోటోల సాక్ష్యంతోనే ఎన్నో కేసులు తీర్పులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ సీతారాం మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్స్కి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచం అంతమయ్యేవరకు ఫోటోగ్రఫీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. టూరిజం పరంగా విశాఖ రిషికొండని మరింత అభివృద్ధి చేయాలని ప్రత్యేక ప్రణాళిలు రచిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగనమోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం సమయంలో తల్లి కొడుకుల భావోద్వేగాన్ని ఫొటోలో బంధించడం చాలా ఆనందంగా ఉందన్నారు.విజయవాడ నగరం అంతా ఫోటోగ్రాఫర్స్ పై ఆధారపడి ఉందిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. ఫోటోగ్రాఫర్స్ కి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజున ఫోటోగ్రాఫర్ ఫంక్షన్ జరగడం చాలా ఆనందరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. -
ఫొటో ట్రేడ్ ఎక్స్పో
-
ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి
మంత్రి దేవినేని ఉమ కానూరు (పెనమలూరు) : ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కానూరులో జరుగుతున్న ఫొటోట్రేడ్షోలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో వచ్చిన నూతన మార్పులను గుర్తించి సమాజానికి మరింత ఉన్నత సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సంఘ అధ్యక్షుడు మాదాల రమేష్, సభ్యులు జానకీరామ్, శ్రీనివాస్, కృష్ణా, గుంటూరు జిల్లాల ఫోటో, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.