breaking news
pascal mazurier
-
‘భార్యే అలా చేస్తే ఆ బాధ చెప్పలేం..’
బెంగళూరు: ఫ్రాన్స్కు చెందిన రాయబారికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఐదేళ్ల పోరాటం తర్వాత తనపై నమోదైన ఆరోపణలు అవాస్తవాలు అని బెంగళూరు కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన ఊపరిపీల్చుకున్నాడు. సుదీర్ఘపోరాట ఫలితంగా తనకు న్యాయం జరిగిందంటూ ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ పాస్కల్ మజురియర్ అనే ఫ్రాన్స్ రాయబారిపై ఆయన భార్య స్వయంగా కేసు పెట్టింది. 2012లో ఆయనపై ఈ మేరకు ఆరోపణలు నమోదయ్యాయి. బెంగళూరులోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో పాస్కల్ డిప్యూటీ చీఫ్గా పనిచేసేవాడు. అయితే నాలుగేళ్ల తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన భార్య స్వయంగా కేసు పెట్టింది. దీంతో ఆయనను పోలీసులు 2012లో జూన్ 19న అరెస్టు చేశారు. అనంతరం నాలుగు నెలలపాటు జైలులో ఉన్న పాస్కల్ అనంతరం బెయిల్పై విడుదలయ్యాడు. అనంతరం తన పిల్లలను కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తన తండ్రి మనవళ్లను, మనవాలిని చూసేందుకు వెళుతున్నా అవకాశం ఇవ్వడం లేదని తీవ్రంగా పోరాటం చేశారు. ఏ తప్పు చేయకపోయినా తన భార్య అనవసరం తనపై ఆరోపణలు చేసిందని, కావాలనే తనను నిందించిందంటూ వాపోయాడు. తాను ఏ తప్పు చేయలేదంటూ పలుమార్లు మీడియా ముందు తన బాధను వ్యక్తం చేశాడు. ఈ కేసు విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయాలని మోదీకి విజ్ఞప్తి కూడా చేశారు. కోర్టు తీర్పు అనంతరం పాస్కల్ మీడియాతో మాట్లాడుతూ..‘ఇది నేను చేసిన సుదీర్ఘ పోరాటం. చివరికి న్యాయం జరిగినందున చాలా సంతోషంగా ఉంది. కట్టుకున్న భార్యే నిన్ను చులకన చేసి బయటేసిందని అర్థమైనప్పుడు అది ఎంత తీవ్రమైన గాయమో చెప్పలేం. కానీ, దేవుడు నాకు పోరాడేందుకు కావాల్సిన శక్తినిచ్చాడు. ఇలాంటి ఆరోపణల వచ్చినప్పుడు చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అసలు ప్రస్తుతం నా నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న నా భార్యే అసలైన నేరస్ధురాలు’ అని చెప్పారు. -
మోడీ వద్దకు ఫ్రెంచ్ కాన్సులేట్ వ్యవహారం!
న్యూఢిల్లీ:కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రెంచ్ కాన్సులేట్ పాస్కల్ మజురియర్ వ్యవహారం కాస్తా ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు చేరింది. బెంగళూర్ లోని ఫ్రెంచ్ రాయబారి కార్యాలయంలో కాన్సులేట్ గా విధులు నిర్వర్తించిన మజురియర్ తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని సస్పండ్ చేసి.. అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే బెయిల్ పై వచ్చిన అతను గత రెండు రోజుల క్రితం నరేంద్ర మోడీకి సుదీర్ఘమైన లేఖ రాశారు. ' నాతో విడిగా ఉంటున్న నా భార్య తప్పుడు కేసులు బనాయించింది. ప్రస్తుతం నా ముగ్గురు పిల్లలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. మా పిల్లలు వారి యొక్క జాతీయ భాషను మరిచిపోతున్నారు. మా సంస్కృతి, కుటుంబ చరిత్ర కూడా వారికి చేరడం లేదు' అని తన లేఖలో పేర్కొన్నారు. 'నా పై విధించిన ఆంక్షలు నా కీర్తిని నాశనం చేయడమే కాదు, నా ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని' అని మోడీకి వివరించారు. తనకు తొందరగా న్యాయం జరగాలంటూ ఆ ప్రెంచ్ అధికారి స్పష్టం చేశారు. గత 13 సంవత్సరాల నుంచి ఫ్రెంచ్ విదేశీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముజురియర్.. ఆ ముగ్గురు పిల్లలు తన రక్తం అని, వారిని తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ జనవరి నెలలో తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో భారతీయ పినల్ కోడ్ 376 ప్రకారం కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. అనంతరం అతను బెయిల్ విడుదలైయ్యాడు. భారతీయ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందంటున్న ఫ్రెంచ్ అధికారి.. తనతో పాటు కూతురికి కూడా న్యాయం జరగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.