తిరుమలలో పద్మావతీ పరియణోత్సవాలు
తిరుమలలో పద్మావతీదేవి పరిణయోత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి. ఇందుకోసం నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయోత్సవానికి మండపాన్ని ఏర్పటుచేశారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్టు 15 లక్షల రూపాయల వ్యయంతో తాత్కాలికంగా నిర్మాణాలు, అలంకరణలు చేపట్టింది.
బెంగళూరుకు చెందిన 50 మంది నిపుణులు వారం రోజుల నుంచి అలంకరణ పనులు చేస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో శ్రీవారికి బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ లాంటి సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దుచేసింది. శనివారం సాయంత్రం వరకు వేళ ఉత్సవాలు జరుగుతాయి.