-
దర్శిలోనూ దౌర్జన్యం
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ నామినేషన్ల ఘట్టం చివరి రోజున టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. దర్శి నగర పంచాయతీ 8వ వార్డులో టీడీపీ తరఫున చింతలపూడి శ్రీనివాసరావు, ఆయన తండ్రి సాంబయ్య ఇద్దరూ నామినేషన్ వేశారు. సోమవారం ఉపసంహరణకు ఆఖరి రోజు కావడంతో వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేడం మోహన్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో సహనం కోల్పోయిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, నేతలు.. దామచర్ల జనార్దన్, నారపుశెట్టి పాపారావు, కందుల నారాయణరెడ్డి, పమిడి రమేష్ ఎన్నికల అధికారి కార్యాలయం ముందు నానా యాగీ చేశారు. కార్యాలయం లోపలికి వెళ్తామంటూ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల అధికారి అనుమతి ఉంటేనే లోపలికి పంపుతామని ఎస్ఐ చంద్రశేఖర్ నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఆర్వోనే బయటకు రావాలని, లేదంటే తామే లోపలికి వెళ్లి తేల్చుకుంటామంటూ ఎస్ఐకి వేలు చూపిస్తూ దురుసుగా వ్యవహరించారు. ఎట్టకేలకు తమ లాయర్ రావడంతో టీడీపీ నేతలు కార్యాలయంలోనికి వెళ్లారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు చూపడంతో నేతలు వెనుదిరిగారు. -
ముగిసిన పంచాయతీ నామినేషన్ల ఘట్టం
కీసర, న్యూస్లైన్: నాగారం, దమ్మాయిగూడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరిరోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నాగారం గ్రామంలో మంగళవారం కౌకుట్ల అనంతరెడ్డి, అన్నంరాజు అర్చన సర్పంచ్కు నామినేషన్లు దాఖలు చేశారు. 49 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు సమర్పించారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 13 నామినేషన్లు, 18 వార్డు స్థానాలకు గాను 154 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి మధుసుదన్ తెలిపారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. దమ్మాయిగూడలో... దమ్మాయిగూడలో మొత్తం 83 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం సర్పంచ్ స్థానానికి ఇండిపెండెంట్గా స్వప్న నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 3 నామినేషన్లు, 16 వార్డు స్థానాలకు గాను 80 నామినేషన్లు అందినట్లు ఎన్నికల అధికారి కె.శ్రీనివాస్ తెలిపారు. జవహర్నగర్లో మొత్తం 276 నామినేషన్లు జవహర్నగర్: జవహర్నగర్లో మంగళవారం చివరిరోజు వివిధ పార్టీల నాయకులు తమ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున బ్యాండ్మేలాలతో వెళ్లి నామినేషన్లు వేశారు. జవహర్నగర్ దళిత నాయకుడు యాకస్వామి వార్డు అభ్యర్థులతో కలిసి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయగా, టీడీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటాపురం రాంచందర్ (చందు) టీడీపీ రాష్ట్ర నాయకుడు మల్లారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి నక్క ప్రభాకర్గౌడ్, గ్రామ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి వార్డు అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేశారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 23 మంది, 20 వార్డులకు గాను 253 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శంషాబాద్లో... శంషాబాద్: శంషాబాద్ మేజర్ గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. మొత్తం 20 వార్డులకుగాను 162 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వార్డు సభ్యులకు తీవ్ర పోటీ నెలకొంది. 1వార్డు జనరల్ స్థానానికి అత్యధికంగా 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 2వ వార్డులో 14 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నేత నామినేషన్ టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా ఆ పార్టీ నాయకుడు రాచమల్ల దాసు జనసందోహంతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు ఆర్. గణేష్గుప్తా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుక్కవేణుగోపాల్, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీపామల్లేష్, ఎంపీటీసీ అభ్యర్థులు డి. వెంకటేష్గౌడ్, వై.సురేష్గౌడ్, జహంగీర్ఖాన్.వై కుమార్ తదితరులున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement