breaking news
Paiditalli sirimanotsavam
-
అంబరాన్నంటిన పైడితల్లి సిరిమానోత్సవం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. పైడితల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలను సమర్పించారు. సంప్రదాయ బద్ధంగా.. హుకుంపేట నుంచి సిరిమాను మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం వద్దకు చేరుకుంది. సాయంత్రం 5.10 గంటలకు ఉత్సవం పూర్తయింది. చివరగా మూడోసారి ఉత్సవం పూర్తవుతుందనగా వర్షం కురవడంతో భక్తజనం తన్మయత్వం పొందారు. కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ఎస్పీ దీపికా ఎం.పాటిల్ ఏర్పాట్లను పర్యవేక్షిచారు. భక్తుల జయజయధ్వానాల నడుమ.. అమ్మవారి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. సిరిమాను మూడులాంతర్లు వద్ద నున్న ఆలయం నుంచి జయజయధ్వానాల మధ్య బయలుదేరింది. ఆలయ ప్రధాన అర్చకులు దూసి కృష్ణమూర్తి పూర్ణకుంభంతో ముందు వెళ్లగా.. ఆ ప్రాంతమంతా భక్తిభావం నెలకొంది. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, దేవదాయశాఖ కమిషనర్ ఎం.హరిజవహర్లాల్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వాణీమోహన్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు, దివంగత ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతి, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. -
మది నిండుగ...పైడితల్లి సిరిమానోత్సవం
-
అంగరంగ వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం
-
ముగిసిన పైడితల్లి సిరిమానోత్సవం
విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పైడితల్లి సిరిమానోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉత్సవం సందర్భంగా తొలిసారిగా కేంద్ర బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దింపారు. 144 సెక్షన్ విధించారు. భారీ భద్రత మధ్య పైడితల్లి సిరిమానోత్సవం నిర్వహించారు. ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో భక్తుల సంఖ్య బాగా తగ్గింది. ఈ ఉత్సవానికి పూసపాటి రాజవంశానికి చెందిన అశోకగజపతిరాజు హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది.