breaking news
One time resigstration
-
యూపీఎస్సీ వన్టైమ్ రిజిస్ట్రేషన్ సదుపాయం
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం వన్టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానాన్ని యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీఆర్ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్ చేసుకుంటే చాలు. వేర్వేరు పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటీఆర్ నంబర్ తెలియజేస్తే సరిపోతుంది. వారి వివరాలన్నీ దరఖాస్తు పత్రంలో ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కావడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభతరంగా మారుతుందని, దరఖాస్తుల్లో పొరపాట్లకు అవకాశం ఉండదని యూపీఎస్సీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఓటీఆర్లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంటుందని తెలిపాయి. ఆన్లైన్ దరఖాస్తు పత్రంలో ఈ ఓటీఆర్ నంబర్ నమోదు చేస్తే 70 శాతం దరఖాస్తును పూర్తిచేసినట్లే. యూపీఎస్సీ నిర్వహించే అన్నిపరీక్షలకు ఓటీఆర్ ఉపయోగపడుతుంది. upsc.Govt.in లేదా upsconline.nic.in వెబ్సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే ఓటీఆర్లో అభ్యర్థులు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని యూపీఎస్సీ ఒక ప్రకటనలో సూచించింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ యూట్యూబ్ చానల్ తొలగింపు -
‘వన్టైమ్’కు భారీ స్పందన
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 5.83 లక్షల మంది రిజిస్ట్రేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) చేపట్టిన ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)’కు భారీ స్పందన వస్తోంది. కమిషన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనికి ఇప్పటివరకు 5,83,839 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర సర్వీసు కమిషన్లో లేని విధంగా ‘ఓటీఆర్’ విధానాన్ని టీఎస్పీఎస్సీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వివిధ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి సిలబస్ ప్రకటన, పలు పోస్టుల నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నేపథ్యంలో ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ గా ఉన్నారు. పురుషులు 3,93,947 మంది, మహిళలు 1,89,892 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక కీలకమైన గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్లు జారీ ప్రారంభమైతే ఇది మరింత పెరుగుతుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అత ్యధికం..: ఓటీఆర్ చేసుకున్న వారిలో హైదరాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగులే ఎక్కువగా ఉన్నారు. తర్వాత స్థానంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల వారు ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి 68,979 మంది, వరంగల్ నుంచి 67,514 మంది ఓటీఆర్ చేసుకున్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 48,295 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. ఏ రాష్ట్రం పేరూ పేర్కొనకుండా మరో 1,892 మంది ఓటీఆర్ చేసుకున్నారు. ‘వన్టైమ్’కు దరఖాస్తుల తీరు.. జిల్లా పురుషులు మహిళలు మొత్తం మహబూబ్నగర్ 31,937 12,692 44,629 రంగారెడ్డి 37,428 21,179 58,607 హైదరాబాద్ 44,298 30,608 74,906 మెదక్ 28,456 12,673 41,129 నిజమాబాద్ 23,630 12,129 35,759 ఆదిలాబాద్ 24,979 10,735 35,714 కరీంనగర్ 45,350 23,629 68,979 వరంగల్ 45,294 22,220 67,514 ఖమ్మం 32,528 15,527 48,055 నల్లగొండ 40,796 17,564 58,360 ఇతర రాష్ట్రాలవారు 37,927 10,368 48,295 రాష్ట్రాన్ని పేర్కొననివారు 1,324 568 1,892 మొత్తం 3,93,947 1,89,892 5,83,839