-
‘బంగారు కొండ’లకు పోషకాహారం!
సాక్షి, రాజమహేంద్రవరం : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి, సంపూర్ణ పోషణ అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ‘బంగారుకొండ’ పేరుతో నూతన విధానానికి బుధవారం నాంది పలికారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్ని బాల మిత్రల ద్వారా గుర్తించి సాధారణ స్థితికి తెచ్చే వరకూ 6 నెలల పాటు నెలకు రూ.300 విలువ చేసే 8 రకాల పోషక పదార్థాలను దాతల సాయంతో అందివ్వాలన్నదే కార్యక్రమ ఉద్దేశం. కలెక్టరేట్ వేదికగా వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ను హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్, కలెక్టర్ కె.మాధవీలతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే పిల్లల్లో పౌష్టికాహార సమస్యను దూరం చేయాలని సీఎం జగన్.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఎదుగుదల, పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దాతలు నెలకు రూ.500 చొప్పున ఆరు నెలలకు రూ.3,000 వేలు చెల్లించి బాలమిత్రగా నమోదు కావాలని సూచించారు. పలువురు చిన్నారుల బాధ్యత తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పౌష్టికాహార సమస్యతో బాధపడుతున్న పిల్లల్ని ఆరు నెలల పాటు పోషణ నిమిత్తం దత్తత తీసుకునేందుకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహం చూపారు. హోం మంత్రి వనిత ఓ చిన్నారిని, ఎంపీ మార్గాని భరత్రామ్ ఇద్దరిని, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్లు ఇద్దరు చొప్పున, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కమిషనర్ దినే‹Ùకుమార్లు చెరో చిన్నారిని దత్తత తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 85,700 మంది పిల్లలుంటే.. వారిలో తక్కువ బరువు ఉన్న పిల్లలు 368 మంది, వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారు 506 మంది, బరువుకు తగ్గ ఎత్తు లేని వారు 409 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఆ మేరకు 1,283 మంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు 1,283 మంది బాల మిత్రలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు. -
ఆ సమయంలో బత్తాయి, కమలా బదులు అరటి, బొప్పాయి తింటే...
ఏం తింటున్నాం? దేహానికి అవసరమైన ఆహారాన్ని తింటున్నామా? జంక్తో పొట్ట నింపేస్తున్నామా? అనే జాగ్రత్తల వరకు చైతన్యవంతంగానే ఉంటున్నాం. కానీ మనం తిన్న ఆహారాన్ని మన దేహం సక్రమంగా గ్రహిస్తోందా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతోంది. మాల్న్యూట్రిషన్ ఎంత ప్రమాదమో మాల్ అబ్జార్షన్ కూడా అంతే ప్రమాదకరం. మాల్ అబ్జార్షన్ అంటే అపశోషణం. తేలిక పదాల్లో చెప్పాలంటే జీర్ణాశయంలోకి చేరిన ఆహారం అక్కడ సరిగ్గా పచనం కావడం, చిన్నపేగుల్లోకి చేరిన తర్వాత ఆహారంలోని శక్తిని పేగులు పీల్చుకోవడం అనే క్రియలు సక్రమంగా జరగకపోవడం. ఆహారంలోని పోషకాలు దేహానికి అందకుండా వ్యర్థాలతోపాటు విసర్జితం కావడం అన్నమాట. సామాన్య భాషలో తిన్నది ఒంటికి పట్టకపోవడం అంటుంటాం. తినడమే కాదు, తిన్నది ఒంట పట్టిందా లేదా అనేది కూడా ముఖ్యమే. ఈ సమస్య చిన్నదిగానే అనిపించవచ్చు, కానీ తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అనేక అనుబంధ ఆరోగ్యసమస్యలకు కారణమవుతుంది. మొదటగా విరేచనాల రూపంలో బయటపడుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంగా కొనసాగుతున్నా, తరచుగా ఎదురవుతూ ఉన్నా... దేహం శక్తిహీనం అవుతూ బరువు తగ్గడం మొదలవుతుంది. మాల్ అబ్జార్షన్కు దారి తీసే ప్రత్యక్ష కారణం జీర్ణ ప్రక్రియలో ఎదురయ్యే అంతరాయాలు. అయితే ఇందులో జీర్ణరసాల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, పైత్యరసం ఉత్పత్తి తగ్గిపోవడం, ఆమ్లాల ఉత్పత్తి మితిమీరడం, చిన్న పేగుల్లో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందడం వంటి కారణాలు పరోక్షంగా ఉంటాయి. అన్నీ కలిపి తింటే ఇంతే... ఒక్కో ఆహారాన్ని జీర్ణం చేయడానికి దేహం ఒక్కో రకమైన జీర్ణరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏకకాలంలో పరస్పరం పొంతన లేని జీర్ణరసాల అవసరం ఏర్పడినప్పుడు జీర్ణవ్యవస్థ కొంత అయోమయానికి, సంక్లిష్టతకు లోనవుతుంది. అలాంటప్పుడు కూడా ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా ఇబ్బంది ఎదురవుతుంది. ఇది ప్రధానంగా డిన్నర్లలో భోజనం చేసినప్పుడు వస్తుంటుంది. రకరకాల పదార్థాలతో జీర్ణాశయాన్ని నింపేయడం వల్ల ఏ రకమైన జీర్ణరసం ఉత్పత్తి ఎంత మోతాదులో జరగాలో అనే అయోమయం ఏర్పడుతుంది. కొందరిలో అప్పటికే జీర్ణరసాల ఉత్పత్తి లోపించి ఉండడం వంటి కారణాలతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మరుసటి రోజు విరేచనాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. అలాగే బయట ఆహారం, పరిశుభ్రత లోపించిన ప్రదేశాల్లో వండిన ఆహారం తినాల్సి రావడం వల్ల కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. డయేరియా అనేది నెలలో ఒకటి లేదా రెండు సార్లు అయితే ప్రమాదకరం కాదు. కానీ ఇలా తరచూ జరుగుతుంటే దేహంలో ఇతర అవయవాల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. డయేరియా వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ కోలుకునే వరకు మసాసాలు, పాలు మానేసి మజ్జిగ, పెరుగు తీసుకోవాలి. వంటి పుల్లటి పండ్లకు బదులు అర బత్తాయి, కమలాటి, బొప్పాయి వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. -
సేంద్రియ చెరకు రసం ఏడాది పొడవునా అధికాదాయం!
► పాలేకర్, చోహన్ క్యూ ప్రకృతి సేద్య పద్ధతులను అనుసరిస్తున్న తూ. గో. జిల్లాకు చెందిన యువ కౌలు రైతు ► చెరకు సాగులో అధిక దిగుబడులు.. రసం తీసి విక్రయించడంతో ఏడాది పొడవునా అధిక నికరాదాయం ► టన్ను చెరకుకు మిల్లు ధర రూ. 1,800.. సేంద్రియ చెరకు రసంతో ఐదు రెట్ల ఆదాయం గతంలో పంట బాగా పండితే చాలు రైతుకు అదృష్టం కలిసి వచ్చినట్టేనని భావించేవారు. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో మంచి ధర లభించక రైతుకు చెరకు సాగు చేదవుతోంది. అందుకే కొత్తపోకడలను ఆకళింపు చేసుకున్న ఓ యువ కౌలు రైతు ఏడాది పొడవునా లాభాల తీపిని రుచిచూస్తున్నాడు. తన పొలం దగ్గరే రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, పరిశుభ్రమైన చెరకు రసాన్ని విక్రయిస్తూ అధిక నికరాదాయం గడిస్తున్నాడు. తాను పండించిన చెరకును తోటి రైతుల్లా కంపెనీకి విక్రయించకుండా రసం తీసి విక్రయించటం ద్వారా అధికంగా నికరాదాయం ఆర్జిస్తున్న ఆ ఆదర్శ రైతు పేరు మేడపాటి వీరారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలోని గోపాలపురం ఆయన స్వగ్రామం. ఇంటర్ వరకు చదివిన ఆయన కిరాణా దుకాణం నడిపేవారు. వ్యవసాయం చేసిన అనుభవం లేకపోయినా.. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల విజయగాథలను గురించి పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకొని స్ఫూర్తి పొంది, ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఆ క్రమంలో బెంగళూరులో ప్రకృతిసేద్యంలో సాగవుతున్న చెరకు తోటల సందర్శనకు ఉద్యానశాఖ అధికారులు వీరారెడ్డిని తీసుకువెళ్లారు. అక్కడ పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ సూచించిన పద్ధతిలో చెరకు సాగు చేయటాన్ని స్వయంగా చూశాడు. 2015లో జాతీయ రహదారికి ఆనుకొని తన ఇంటి పక్కనే ఉన్న ఐదు ఎకరాల నల్లరేగడి పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. పెట్టుబడిలేని ప్రకృతి సేద్య విధానంతోపాటు దక్షిణ కొరియాకు చెందిన ప్రకృతి సేద్య నిపుణుడు చోహన్క్యూ పద్ధతులను న్యూలైఫ్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకొని చెరకును సాగు చేస్తున్నారు. ఫిష్ అమైనో ఆసిడ్, లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా, పొగాకు ద్రావణం, మట్టి ద్రావణం, నువ్వు మోళ్ల ద్రావణం, అరటి బోదెల ద్రావణం, అల్లం+బెల్లం, వెల్లుల్లి+ బెల్లం ద్రావణం వంటి అనేక ద్రవరూప ఎరువులను నిపుణుల సూచన మేరకు సొంతంగా స్వల్ప ఖర్చుతోనే తయారు చేసుకొని తగిన మోతాదులో చెరకు పంటకు వాడుతున్నారు. వీటితోపాటు క్రమం తప్పకుండా జీవామృతం, పంచగవ్యలను పంటకు అందిస్తున్నారు. 30 వరకు పిలకలు.. తొలి ప్రయత్నంగా 2016 ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ఎకరాలో చెరకు సాగుకు వీరారెడ్డి ఉపక్రమించారు. పొలాన్ని దుక్కి చేసి 20 టన్నుల పశువుల ఎరువు వేశారు. రసం అధికంగా ఉండే వీ–46 చెరకు రకాన్ని సాగు చేస్తున్నారు. 21 రోజుల వయసున్న మొక్కలను నాటారు. ఎండ, గాలి బాగా తగిలేలా సాళ్ల మధ్యలో 6 అడుగులు, మొక్కల మధ్య 2 అడుగుల ఎడంలో.. ఎకరాకు పాతిక వందల మొక్కలు నాటారు. నాటిన 45 రోజుల తర్వాత పక్క పిలకలు వచ్చేందుకు మొక్క మొవ్వును కత్తిరించారు. 2017 జనవరి నుంచి పక్వానికి వచ్చిన గడలను వచ్చినట్టు ఏరోజుకారోజు నరికి రసాయనిక అవశేషాల్లేని తాజా చెరకు రసం తీసి విక్రయిస్తున్నారు. ఒక్కో చెరకు గడ 2 కిలోల బరువుంది. ఒకసారి గడలు నరికిన దుబ్బులో పెరిగే పిలకలు 3 నెలల్లో పెరిగి పక్వానికి వస్తున్నాయి. ఒక్కో దుబ్బుకు 25–30 పిలకలు వస్తున్నాయి. తొలుత ఐదారు గడలు మాత్రమే ముదిరి పక్వానికి వస్తాయి. వీటిని నరికిన తరువాత మిగిలిన పిలకలు గడలుగా పెరుగుతాయి. ఎండిన చెరకు ఆకును తగులబెట్టకుండా పొలంలోనే నేలపై ఆచ్ఛాదనగా వేస్తున్నారు. బోరు నీటిని బిందు సేద్య పద్ధతిలో అందిస్తున్నారు. ఎకరానికి 70 టన్నుల దిగుబడి సాధారణ విధానంలో దుబ్బుకు ఐదారు గడలు వస్తాయి. అయితే ప్రకృతి సేద్య పద్ధతిలో దూరంగా నాటిన మొవ్వు కత్తిరించిన మొక్కకు మాత్రం 20–30 పిలకలు వచ్చి, దిగుబడి రెట్టింపైంది. మొదటి ఆరు నెలల్లోనే 30 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం పొలంలో మరో 20 టన్నుల పంట ఉంది. రానున్న ఆరు నెలల్లో కొత్తగా పెరిగే చెరకు గడల వల్ల మరో 20 టన్నుల పంట దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఎకరాలో ఏడాదికి 70 టన్నుల వరకు దిగుబడి వస్తున్నది. రసాయన సేద్యంలో 30–40 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని వీరారెడ్డి చెప్పారు. చెరకులో అంతర పంటగా నేలలో నత్రజనిని స్థిరీకరించే ద్విదళ పంట అయిన మినుమును సాగు చేశారు. క్వింటాన్నర దిగుబడి వచ్చింది. రూ. 15 వేల ఆదాయం లభించింది. రెండు స్టాళ్ల ద్వారా చెరకు రసం విక్రయం గోపాలపురంలోని తన పొలం వద్ద, సమీపంలో ఉన్న రావులపాలెం సెంటరులోనూ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ముందుగా చెరకు గడలను ఉప్పు నీటి ద్రావణంలో కడుగుతారు. గడలను ముక్కలు చేసి ట్రేలలో పెట్టుకొని స్టాల్స్కు తరలించి రసం తీస్తారు. 300 మి. లీ గ్లాసు రసం రూ. 20 చొప్పున, లీటరు రూ. 60 చొప్పున విక్రయిస్తున్నారు. రుచికరమైన చెరకు రసం లభిస్తుండటంతో ఈ స్టాల్స్ ప్రజాదరణను చూరగొన్నాయి. లాభసాటిగా ఉండటంతో రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు వేరువేర్వు ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తానని వీరారెడ్డి తెలిపారు. కూలీలు, మొక్కల కొనుగోలు, బోదెలు ఏర్పాటుకు ఎకరాకు రూ. లక్ష ఖర్చయింది. రసాయనిక సేద్యంలో పండించి ఫ్యాక్టరీకి అమ్మితే టన్ను చెరకుకు వచ్చే ధర రూ. 1,800 మాత్రమే. బెల్లం తయారుచేసినా రైతుకు నికరంగా మిగిలేది ఎకరాకు రూ. 30 వేలు మాత్రమే. ఈ విషయాన్ని అవగాహన చేసుకోవటం వల్ల వీరారెడ్డి తాను పండించిన చెరకును తానే రైతు రసం తీసి విక్రయిస్తున్నారు. ఐదు రెట్ల అధికంగా నికరాదాయం పొందుతున్నాడు. జడలు అల్లే పని లేదు.. అచ్చు పద్ధతిలో సాళ్లు, మొక్కల మధ్య దూరం పెరగటం వల్ల గాలి, వెలుతురు అధికంగా లభించి ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు పంటను ఆశించలేదు. మొక్కలు దూరంగా ఉండటం వల్ల జడలు అల్లాల్సిన అవసరం తప్పి కూలీల ఖర్చు రైతుకు ఆదా అయింది. సాధారణంగా చెరకు పంటకాలం రెండేళ్లు. ప్రతి రెండేళ్లకోసారి పంటను విత్తుకునేందుకు ఎకరాకు రూ. 25 వేల వరకు రైతుకు ఖర్చవుతుంది. అయితే, వీరారెడ్డి అనుసరిస్తున్న అచ్చు పద్ధతిలో తొలి ఏడాది రూ. 10 వేలు ఖర్చు చేస్తే చాలు.. 10–12 ఏళ్ల వరకు పంట తీసుకోవచ్చు. సాధారణంగా చెరకు సాగు చేసే రైతులకు ఏడాదిలో ఒక్కసారే ఆదాయం వస్తుంది. ఈ విధానంలో రైతుకు ఏడాదంతా పంట, ఆదాయం వస్తుంది. చీడపీడలు, తెగుళ్ల బెడద తగ్గి రైతుకు నికరాదాయం పెరుగుతుంది. ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. అన్నింటికి మించి ఆరోగ్యకరమైన సేంద్రియ చెరకు రసం ఉత్పత్తులు లభిస్తున్నాయి. లా సాటిగా ఉండటంతో 2017 ఫిబ్రవరిలో ఎకరాలో, జులైలో మరో 2 ఎకరాల్లో చెరకు మొక్కలు నాటారు. రైతులు సంశయం వీడాలి.. చెరకును ఆరుగాలం పండించినా రైతుకు గిట్టుబాటు కావటంలేదు. ఏడాదంతా కష్టపడితే రైతు పొందే ఆదాయానికన్నా, దాన్ని కొనుగోలు చేసిన వ్యాపారి 10 రెట్ల లాభంపొందుతున్నాడు. రైతులకు గిట్టుబాటుకావాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలి. మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు. రైతులు ధైర్యం చేసి.. సంశయం వదిలి రంగంలోకి దిగాలి. లేకుంటే ఎన్నాళ్లైనా అప్పుల తిప్పలు తప్పవు. రైతులు పంట పండించడమే కాదు. దిగుబడులను నేరుగా అమ్మకుండా .. ఉత్పత్తులుగా మార్చి తమ ప్రాంతంలో వినియోగదారులకు నేరుగా విక్రయించాలి. ఇది కూడా దేశసేవే. శీతల పానీయాల కంపెనీల వ్యాపారంలో పదో వంతును చేజిక్కించుకున్నా రైతులు స్థిరమైన నికరాదాయం పొందగలరు. – మేడపాటి వీరారెడ్డి (98497 95139), సేంద్రియ చెరకు రైతు, గోపాలపురం, రావులపాలెం మండలం, తూర్పు గోదావరి జిల్లా – కొవ్వూరి ఆదినారాయణరెడ్డి, సాక్షి, రావులపాలెం, తూ. గో. జిల్లా
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement