breaking news
Notes Cancellation
-
ఇంకా ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లు ఎంతంటే..
రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 98.04 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.6,970 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.మే 19, 2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 అక్టోబర్ 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.6,970 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!ఇప్పటికీ రూ.2000 నోట్లు ఉంటే ఏం చేయాలంటే..ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లఖ్నవూ, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు. -
ఇంకా మూలుగుతున్న రూ.రెండువేల నోట్లు
రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.7,261 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.మే 19, 2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 ఆగస్టు 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.7,261 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లఖ్నవూ, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు. -
రూ.2000 నోట్లపై మళ్లీ ఆర్బీఐ కీలక నిర్ణయం..
గతేడాది మేలో రద్దు చేసిన రూ.2000 నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. విలువైన రూ.2000 నోట్ల మార్పిడి కోసం పౌరులకు మరో అవకాశం కల్పించింది. దేశంలోని ఆర్బీఐ కార్యాలయాలు, పోస్టాఫీసుల వద్ద పెద్దనోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఇందుకు గడువును మాత్రం నిర్ణయించలేదని తెలిసింది. అయితే రూ.2000 నోట్లు మార్చుకునే పౌరులు ప్రస్తుతం ఆన్లైన్లో లభిస్తున్న దరఖాస్తు ఫామ్ నింపి పోస్టాఫీసు ద్వారా ఆర్బీఐకి పంపవచ్చని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా గతేడాది మే నెలలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు భారతీయ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: నిండుతున్న కేంద్ర ఖజానా.. కానీ ఇకపై.. పోస్టాఫీసు ద్వారా ఎలా మార్చుకోవాలి? ముందుగా ప్రజలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఫారమ్ను పూర్తిచేయాలి. ఆ తర్వాత దగ్గర్లోని ఏదైనా స్థానిక పోస్టాఫీసు నుంచి రూ.2000 నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపాలి. ఎఫ్ఏక్యూలో సమాచారం ప్రకారం ఒక వ్యక్తి పోస్టాఫీసు బేస్డ్ ఫెసిలిటీలతో పాటు 19 ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 వరకు నోట్లను మార్చుకోవచ్చు. -
రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు!
భారతీయ రిజర్వ్బ్యాంక్ రూ.2000 నోట్లను తిరిగి బ్యాంకులు సేకరించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చలామణీలో ఉన్న 97.26 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చేశాయని ఆర్బీఐ వెల్లడించింది. రూ.2 వేల నోటును ఉపసంహరించుకుని ఆరు నెలలు దాటినప్పటికీ.. రూ.9,760 కోట్లు విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. రూ.2 వేల నోటు ఇప్పటికీ లీగల్ టెండర్గా కొనసాగుతుందని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది. రూ.2వేల విలువైన నోటును ఆర్బీఐ ఈ ఏడాది మే 19న ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ నిర్ణయం వెలువడే నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి/ డిపాజిట్కు ప్రజలకు తొలుత సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత అక్టోబర్ 7 వరకు ఆ గడువును పొడిగించారు. ప్రస్తుతం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే నోట్లను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 30 నాటికి 97.26 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికీ రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుందని, ఆర్ఐబీ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను ఎక్స్ఛేంజీ/ డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు చేరుకోలేనివారు రూ.2 వేలు నోట్లను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపించొచ్చని పేర్కొంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, బేల్పుర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగడ్, చెన్నై, గువాహటి, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, నాగ్పూర్, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. -
సాక్షి కార్టూన్ 31-05-2022
మరొక్కసారి నోట్ల రద్దు చేస్తే..! -
నోట్ల రద్దుపై రహమాన్ పాట
ముంబై: నోట్ల రద్దుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ బాణీలు కట్టాడు. ‘ది ఫ్లైయింగ్ లోటస్’ పేరుతో ఈ పాటను శుక్రవారం విడుదల చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నోట్ల రద్దు విషయంలో ప్రజలు చూపిన హర్షం, ఆగ్రహాలను తెలియజేయాలనుకున్నాను’ అని పేర్కొన్నారు. ‘2016 నవంబర్ భారత్కు చాలా ఆసక్తికరమైంది. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో ఆ నిర్ణయం తీసుకోవడంతో ప్రజల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నోట్ల రద్దు సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? వంటి అంశాలపై ది ఫ్లైయింగ్ లోటస్లో చూపేందుకు ప్రయత్నించాను’ అని వివరించాడు. -
అమ్మో.. వచ్చేస్తుంది ఒకటో తారీఖు
జనానికి పొంచి ఉన్న ‘నగదు’ గండం బెంబేలెత్తిపోతున్న పేద, మధ్య తరగతి, వేతన జీవులు పాల నుంచి పచారీ కొట్టు దాకా కష్టాలే క్యాష్.. క్యాష్.. క్యాష్... ఎహే... 15 రోజులుగా ఉన్న గొడవేగా...! మళ్లీ ఏంటి? అది కాదు బాబోయ్... ఫస్టొచ్చేస్తోంది... ఆ వస్తే? ఖర్చులండీ... ఇంటి అద్దె, పచారీ కొట్టు, పనిమనిషి, పాలవాడు, స్కూలు ఫీజు, పిల్లల ఆటో... వగైరా వగైరా వీటన్నింటికీ క్యాష్ కావాలి... వామ్మో... కొత్త నోట్లే! అవును... న్యూ క్యాష్ మరెలా..? ఎలా... ఎలా? పెద్ద నోట్ల రద్దు దేశంలో ఎంతగా అలజడి సృష్టించినా... ప్రభుత్వ పెద్దలు, అరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు లాంటి కేంద్ర మంత్రులు... ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని, దేశహితం కోసం సహనంతో ఉండాలని చెబుతున్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని, నల్లధనాన్ని లెక్కతేల్చి... దేశాభివృద్ధికి వెచ్చిస్తామని నొక్కి చెబుతున్నారు. మరోవైపు సామాన్యుడికేమో ఖర్చులకు నాలుగు కొత్తనోట్లను సంపాదించడానికి సరిపోతోంది. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. పైగా బ్యాంకుల్లో నగదు మార్పిడి పరిమితిని నాలుగు వేల నుంచి రెండు వేల రూపాయలకు కుదించారు. ఏటీఎంలలో రెండు వేలకు మించి రాదు... అదీ గంటల కొద్దీ లైన్లలో నిలబడి.. అదృష్టం బాగుండి మీవంతు వచ్చేసరికి మిషన్లో నగదు ఉంటే! చెక్కుతో తీసుకుంటే ఒకేసారి రూ.24 వేలు (వారానికి) ఇస్తామని ప్రకటించినా... నగదు కొరతతో బ్యాంకులు అంత ఇవ్వట్లేదు. నగదు లావాదేవీలపై ప్రధానంగా ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ మనది. మొదటి తారీఖుకల్లా జీతాలు చేతికందే వారితో పాటు ఇతరులకు కూడా.. నెలలో తొలివారమే కీలకం. ఉండే ఖర్చులన్నీ ఈ వారంలోనే. పాలవాడి నుంచి పచారీ కొట్టు దాకా బిల్లులు చెల్లించాల్సింది ఈ మొదటి వారంలోనే. సాధారణంగా నెలారంభంలో మధ్యతరగతి జీవికి అయ్యే ఖర్చులు... పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అతనికున్న చెల్లింపు వెసులుబాట్లు ఏంటో చూద్దాం. అద్దె: సొంతిళ్లు లేని వారికి ఇదో సమస్య కానుంది. ఇంటి యజమాని తన అద్దె ఆదాయాన్ని లెక్కల్లో చూపడానికి ఇష్టపడకపోతే (ఉద్యోగిగా జీతం తీసుకుంటున్నా, ఇతరత్రా వ్యాపారాల ద్వారా సంపాదిస్తూ అప్పటికే అదాయపు పన్ను చెల్లిస్తున్నా.. ఇంటిపై వచ్చే అద్దెను చాలామంది లెక్కల్లో చూపరు) అద్దెకుండే వారికిచిక్కే. ఎందుకంటే యజమాని చెక్కు వద్దంటాడు. అద్దెను నగదు రూపంలో... అదీ కొత్త నోట్లతో చెల్లించాలి. రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా నగదు అవసరం ఉంటుంది. మెరుుంటెనెన్స: నెలవారీ ఖర్చుల నిమిత్తం చాలావరకు అపార్ట్మెంట్లో నగదు రూపంలోనే మెరుుంటెనెన్స్ వసూలు చేస్తారు. ఇది వెరుు్య నుంచి రెండున్నర వేల రూపాయల వరకు ఉంటుంది. కిరాణా దుకాణం: నెలకు సరిపడా బియ్యం, పప్పులు, ఇతర వస్తువులు కొనాలి. సూపర్మార్కెట్లలో కార్డులు తీసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ పేదలకు ఇబ్బందే. అలాగే చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో కార్డుల సదుపాయం ఉండదు కాబట్టి నగదు పెట్టి కొనాల్సిందే. పాలు, పేపర్ బిల్లు: పాలు, పేపర్ బిల్లుకు నగదు ఇవ్వాల్సిందే. ఇందుకు రూ.2 వేల వరకు కావాలి. కూరగాయలు: నగదు పెట్టే కొనాలి. వారాంతాల్లో నాన్వెజ్ అరుునా క్యాష్తోనే కొనాలి. కేబుల్ బిల్లు: నగదు రూపంలోనే చెల్లించాలి. డిష్ టీవీలు ఉంటే ఆన్లైన్లో మొబైల్ బ్యాంకింగ్ లేదా కార్డు ద్వారా రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్యాస్ బిల్లు: ప్రస్తుతానికి పాతనోట్లు తీసుకుంటున్నా... ప్రభుత్వం గడువు పెంచకపోతే వచ్చేనెల నుంచి ఇది కూడా కొత్తనోట్లతో లేదా రూ.100 నోట్లతో చెల్లించాల్సిందే. స్కూలు ఫీజులు: పాఠశాలలు, కాలేజీల్లో వారుుదాల రూపంలో ఫీజులు కట్టే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు వీటి వారుుదాలను కొత్తనోట్లతో నగదు రూపంలోనే స్కూలు కౌంటర్లో చెల్లించాలి. బ్యాంకుల్లో చెల్లించే వెసులుబాటు ఉన్న స్కూళ్లలో తల్లిదండ్రులకు కొంత ఉపశమనం. స్కూల్ వ్యాన్ బిల్లు: నగదు రూపంలోనే ఇవ్వాలి. ప్రైవేటు ట్యూషన్ ఫీజు: నగదు రూపంలోనే ఇవ్వాలి. కరెంటు బిల్లు: ఆన్లైన్లో చెల్లించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అరుుతే ఊరికి బిల్ కలెక్టర్ వచ్చినపుడు నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్, మొబైల్ బిల్లులు: ఆన్లైన్లో చెల్లించొచ్చు. నగదు రూపంలో కట్టేవారికి ఇదో అదనపు భారం. గ్రామీణులకు దీనికి క్యాష్ అవసరం. పని మనిషి: చేసే పనిని బట్టి రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు నగదు ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్త్రీ: సగటున ఐదారు వందలు. నగదు ఇవ్వాలి. ఈఎంఐ: టూ వీలర్ లేదా ఫోర్ వీలర్, గృహరుణం తీసుకున్న వారికి కిస్తులు (ఈఎంఐలు) చెల్లించాల్సి ఉంటుంది. అరుుతే ఈసీఎస్, చెక్కుల రూపంలో ఇది జరిగిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ప్రైవేటు చీటీలు: రిజిస్టర్ చిట్ఫండ్లు అరుుతే చెక్కు లు, ఆన్లైన్ పేమెంట్లు స్వీకరిస్తారుు. అరుుతే చాలామంది మిత్రులు, బంధువులు, పరిచయస్తుల దగ్గర ప్రైవేటు చీటీలు వేయడం అలవాటైపోరుుంది. ఇది చట్టబద్ధమైనది కాదు కాబట్టి నగదులోనే ఇవ్వాలని నిర్వాహకులు కోరుతారు. వేసే చీటీని బట్టి కిస్తు మొ త్తం ఉంటుంది. దీనికీ నగదు సర్దాల్సి వస్తుంది. ఆఫీసుల్లో మైక్రో ఏటీఎం జనం నగదు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్ని పెట్రోల్ బంకుల్లో మైక్రో ఏటీఎంల ద్వారా కొత్తనోట్లను విత్డ్రా చేసుకొనే అవకాశం కల్పించారు. అలాగే ఒకటో తేదీ నుంచి ఆఫీసుల్లోనే మైక్రో ఏటీఎం ద్వారా నగదును అందజేయవచ్చు. ఉద్యోగి వేతన ఖాతాను అనుసంధానించిన డెబిట్ కార్డు ద్వారా విత్డ్రా పరిమితిని పెంచి మైక్రో ఏటీఎంతో రూ.15 వేల నగదును ఉద్యోగి చేతికి అతని కార్యాలయంలోనే అందించొచ్చు. ► ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు బ్యాంకుల్లో భారీ క్యూలో నిలబడటం కష్టమే. క్యూలలో ఇప్పటికే పలువురు అస్వస్థతకు గురై చనిపోయారు. కాబట్టి వీరికోసం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడం, నీడ, తాగునీటి వసతి లాంటివి కల్పిస్తే కాస్త ఉపశమనం ఇచ్చినట్లవుతుంది. ఖాతాలు లేనివారికి నేరుగా గ్రామపంచాయతీల్లో నగదు అందజేస్తున్నట్లే నవంబరు పింఛన్ను అందరికీ నగదు రూపంలో అందజేసే అవకాశాలను పరిశీలించడం మరో మార్గం. వారంలో పెళ్లి.. డబ్బుల కోసం కంటతడి ‘‘సార్.. నా కుమారుడి పెళ్లి.. ఎలాగైనా చేసి డబ్బులియ్యండి..’’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నిమ్మవానిపల్లెకు చెందిన నిమ్మల శ్రీనివాస్ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కుమారుడు వెంకటేశ్ పెళ్లి డిసెంబర్ 1న జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అరుుతే పెళ్లి ఖర్చుల కోసం సమకూర్చుకున్న డబ్బు బ్యాంకులో ఉంది. దీంతో ముస్తాబాద్లోని ఎస్బీఐకి వెళ్లి.. డబ్బులివ్వాలని కోరగా రూ.24 వేల కంటే ఎక్కువ ఇవ్వలేమని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక శ్రీనివాస్ కంటతడి పెట్టారు. సేవింగ్స్ ఖాతా డిపాజిట్కే పాత నోట్ల వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: పోస్టాఫీసుల్లో కేవలం సేవింగ్స బ్యాంక్ ఖాతాలోనే రద్దైన రూ.500, రూ.1,000 నోట్ల డిపాజిట్లకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తపాలా శాఖ వర్గాలు తెలిపారుు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పాత నోట్ల డిపాజిట్లను అంగీకరించకూ డదని మంగళవారం స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా సేవింగ్ బ్యాంక్ ఖాతాకు మినహారుుస్తూ సవరణ ఆదేశాలు జారీ చేసింది. పోస్టాఫీసుల్లో చిన్న మొత్తాల పథకాల పరిధిలోకి వచ్చే సేవింగ్స బ్యాంక్, రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి అకౌంట్ (ఎస్ఎస్ఏ), మంత్లీ ఇన్కం స్కీం (ఎంఐఎస్), సీనియర్ సిటిజన్ అకౌంట్ తదితర ఖాతాల్లో డిపాజిట్లకు పాతనోట్లను అనుమతిస్తూ వచ్చారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయంతో కేవలం సేవింగ్స బ్యాంక్ అకౌంట్ డిపాజిట్కు మాత్రమే పాత నోట్లను అనుమతించనున్నారు. పర్యవసానాలు... ► మొదటి వారంలో నగదు తిప్పలు ఉంటారుు కాబట్టి ఉద్యోగుల హాజరు శాతంపై ప్రభావం ఉంటుంది. ► ఏటీఎంలో తీసుకునే డబ్బు ఏమూలకు సరిపోదు. బ్యాంకుల్లో చెక్కు ద్వారా డబ్బు ‘డ్రా’ చేయడానికి క్యూలో నిలబడితే ఆ రోజుకు ఆఫీసుకు ఎగనామమే అవుతుంది. పైగా బ్యాంకుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు కూడా తీవ్ర ఇబ్బందే. వయోభారం కారణంగా వారు బ్యాంకు క్యూలలో గంటలకొద్దీ నిలబడలేరు. ఇలా చేస్తే కాస్త ఊరట.. ► కేంద్ర ప్రభుత్వ, రక్షణ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని గ్రూపు ‘సి’ ఉద్యోగులకు రూ.10 వేలు వేతన అడ్వాన్సును నగదు రూపంలో ఇస్తున్నారు. ► రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు నవంబరు నెల వేతనాన్ని ఓ రూ.15 వేల వరకు కొత్తనోట్లను ఇస్తే.. వేతనజీవి బండి సాఫీగా సాగుతుంది. లేకపోతే చుక్కలు కనిపిస్తారుు. ► తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ జీతం (డిసెంబరు ఒకటిన ఇచ్చేది) మొత్తాన్ని నగదు రూపంలో (కనీసం రూ.10 వేలు) ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ► కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఇలాంటి వెసులుబాటును కల్పిస్తే.. తక్షణావసరాలకు చేతిలో డబ్బు ఉంటుంది. జనం అవసరాలు కొంతమేరకు తీరుతారుు. జనం ముందున్న మార్గాలివీ ఏటీఎం: రూ.2 వేలు. (రోజుకు రూ.2 వేల చొప్పున ఖర్చులకు సరిపడా తీయాలంటే ఏడెనిమిది రోజులు క్యూలో నిలబడాలి. ఇది అసాధ్యం. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఖాళీగా ఉంటే క్యూలో నిలబెట్టొచ్చు) చెక్కు ద్వారా విత్డ్రా: వారానికి 24,000. (ఆర్బీఐ ఎక్కువ డబ్బు ఇవ్వట్లేదని, తమ దగ్గరున్న నగదును అందరికీ సర్దాల్సి ఉంటుందని, కాబట్టి తక్కువ మొత్తమే ఇవ్వగలమని బ్యాంకులు చెబుతున్నారుు) డెబిట్/క్రెడిట్ కార్డులు: పట్టణ ప్రాంతాల్లో చెల్లింపులకు వాడుకోవచ్చు. ప్రధానంగా కరెంట్, నెట్, కిరాణా బిల్లులు తదితరాలకు వాడొచ్చు కానీ అద్దె, పనిమనిషి వేతనం లాంటి ఇతరత్రా అవసరాలకు కుదరదు. చిన్న పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో వీటిద్వారా లావాదేవీలకు ఆస్కారం తక్కువ. వ్యాలెట్ యాప్స్: బిల్లుల చెల్లింపు, డిష్ టీవీ, మొబైల్ రీచార్జ్లు తదితరాలకు వాడుకోవచ్చు. మొబైల్లో నెట్ యాక్సెస్ ఉండి.. వీటిని వాడగలిగేవారికి ఓకే. అరుుతే గ్రామీణులకు వీటిపై అవగాహన లేదు. వాడలేరు. - సాక్షి నాలెడ్జ సెంటర్