breaking news
Nirbhaya-Jyoti Trust
-
స్వతంత్ర భారతి: తీరిన తల్లి ఘోష
దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్ఠాకూర్ (28), పవన్ గుప్తా (19), వినయ్శర్మ (20) లను ఢిల్లీలోని తీహార్ జైల్లో 2020 మార్చి 20న ఉరి తీశారు. 2012 డిసెంబర్ 16 న దేశ రాజధాని ఢిల్లీలో ఒక వైద్య విద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల, పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 2012 డిసెంబరు 29 న ఆమె తుదిశ్వాస విడిచారు. ఏడేళ్ల పాటు జరిగిన ఈ కేసు విచారణ కాలంలో ఆరుగురు నిందితులలో ఒకరు చనిపోగా, మరొకరు మైనరు కావడంతో అతడికి ఉరి నుంచి మినహాయింపు లభించింది. ‘2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం’గా వార్తల్లో ఉన్న ఆ ఘటనలో దేశం మొత్తం ఆ యువతి కుటుంబం తరఫున నిలబడింది. యువతి తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లి ఆషాదేవి చేసిన న్యాయపోరాటం ఫలించి చివరికి దోషులకు ఉరి అమలయింది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ఇండియాలోకి కోవిడ్–19 వ్యాప్తి. తొలి కేసు జనవరి 20న కేరళలో నిర్థారణ. టిక్టాక్ సహా 59 చైనా యాప్లను నిషేధించిన భారత్. ఆ తర్వాత పబ్జీ సహా మరో 118 చైనా యాప్ల నిషేధం. నేషనల్ ఎడ్యుకేషన పాలసీ–2020 కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, చేతన్ చౌహాన్, ప్రణబ్ ముఖర్జీ, జయప్రకాశ్ రెడ్డి, రామ్విలాస్ పాశ్వాన్.. కన్నుమూత. (చదవండి: సమర కవి: సుబ్రహ్మణ్య భారతి/ 1882-1921) -
అత్యాచార బాధితులను ఆదుకునేందుకు ట్రస్ట్
అత్యాచార బాధితులను ఆదుకునేందుకు నిర్భయ జ్యోతి ట్రస్ట్ ను నిర్భయ తల్లి ప్రారంభించారు. గత సంవత్సరం దేశ రాజధానిలో 23 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ నిర్భయ అత్యాచారం ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో కాన్ స్ట్యూషన్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు నిర్బయ తల్లి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, బీజేపీ నేత సుష్మా స్వరాజ్, బాలీవుట్ నటి షబానా ఆజ్మీలతోపాటు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. అత్యాచార బాధితుల కోసం ట్రస్్్ ఏర్పాటు చేస్తున్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం అని నిర్భయ తల్లి తెలిపారు. షీలా దీక్షిత్, షబానా ఆజ్మిల ఎదుట నిర్భయ తల్లి భోరున విలపించింది. నిర్భయ తల్లి తండ్రులకు పలువురు సంతాపం తెలిపారు. డిసెంబర్ 16 తేదిన అత్యాచారానికి గురైన 'నిర్భయ' మృత్యువుతో పోరాడుతూ డిసెంబర్ 29 తేదిన తుది శ్వాస విడిచారు.