breaking news
new 2000 notes
-
2 వేల రూపాయల నోటుపై క్లారిటీ
న్యూఢిల్లీ: రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోక్సభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని వివరించారు. ‘రూ.2 వేల నోట్లకు చిల్లర కొరతతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో, రూ.500, రూ.200 నోట్లుంచేందుకు ఏటీఎంలను సిద్ధం చేయాలని ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్ తమ అధికారులను ఆదేశించాయి’ అని వివరించారు. చారిత్రక కట్టడాల్లో చోరీలు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీ ఆనందవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహం, కర్ణాటకలోని సదాశివస్వామి గుడిలో రాగి కలశం చోరీకి గురయ్యాయని సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ లోక్సభకు తెలిపారు. రక్షిత చారిత్రక కట్టడాల వద్ద 280 మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులకు అనుమతులిచ్చినట్లు చెప్పారు. (చదవండి: కమల్ను కాపాడిన ‘కరోనా’) -
సాధ్వి ఇంట్లో 24 బంగారు కడ్డీలు.. కోటికి పైగా కొత్తనోట్లు
ఆమె ఒక సాధ్వి. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ, పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసినప్పుడు ఏకంగా 80 లక్షల రూపాయల విలువైన 24 బంగారు కడ్డీలు, కోటి రూపాయల రెండువేల నోట్లు దొరికాయి! ఆ బంగారాన్ని కూడా ఆమె నవంబర్ నెలలోనే కొన్నారు. సాధ్వి జై శ్రీగిరి అనే ఈ మహిళ గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఒక ట్రస్టు నిర్వహిస్తారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఒక ఆలయం కూడా ఉంది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. తన వద్ద బంగారం కొన్నందుకు చెల్లించాల్సిన ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని ఎన్నిసార్లు చెప్పినా ఆమె పట్టించుకోవడం లేదని ఒక నగల వ్యాపారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెళ్లారు. ఆమె ఇంట్లో 80 లక్షల విలువైన 24 బంగారు కడ్డీలు, కొత్త రెండువేల రూపాయల నోట్లలో 1.2 కోట్ల నగదు పట్టుబడ్డాయి. ఇంకా విశేషం ఏమిటంటే, మద్యనిషేధం ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఉండి.. ఆమె ఆశ్రమంలో మద్యం బాటిళ్లు కూడా దొరికాయి. ఇప్పటివరకు ముగ్గురిపై కేసు పెట్టామని, ప్రధాన నిందితురాలు సాధ్విని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. డిసెంబర్ నెలలో ఆమె ఒక కార్యక్రమంలో గాయనీ గాయకులు పాడుతున్నప్పుడు దాదాపు కోటి రూపాయల విలువైన రెండువేల రూపాయల నోట్లు వాళ్లపై విసురుతుండగా సాధ్వి జై శ్రీగిరిని ఎవరో వీడియో తీశారు. అప్పటికి కొత్త నోట్లు దొరకడం చాలా కష్టంగా ఉన్న సమయం కావడంతో ఈ ఘటన బాగా వివాదాస్పదంగా మారింది.