breaking news
NARASAPURA parliamentary
-
ముహూర్తంతో ముందుకు
సాక్షి, ఏలూరు (మెట్రో) : సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో సంబంధిత అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలోని కీలకమైన మొదటి దశలోకి అడుగుపెట్టారు. కీలక ప్రక్రియ అయిన నామినేషన్ల పర్వానికి బుధవారం తెరలేపారు. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ప్రధాన ఎంపీ స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియను బుధవారం మొదలు పెట్టారు. జిల్లాలో ఒక వైపు పార్టీల అధినేతలు ప్రచార పర్వాలు కొనసాగిస్తుంటే మరోవైపు ఆయా పార్టీల అభ్యర్థుల వారి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. మంగళవారం పోలవరం నియోజవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తే బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో రెండు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభలు పెట్టారు. అధినేతలు ప్రచారాలు ఒక ఎత్తయితే అభ్యర్థులు నామినేషన్ల పత్రాలు మరో వైపు దాఖలవుతున్నాయి. జిల్లాలో నరసాపురంలో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి అయిన రఘురామకృష్ణంరాజు బుధవారం నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అదే విధంగా తాడేపల్లిగూడెం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, కొవ్వూరు అభ్యర్థి తానేటి వనిత నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అదే విధంగా దెందులూరు తెలుగుదేశం అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియను బుధవారం వారి ముహూర్తాల ప్రకారం పూర్తి చేశారు. ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా లోక్సభ స్థానానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా జ్యోత్సుల వెంకట సూర్యనారాయణ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్కు అందించారు. మొత్తం నామినేషన్లు అసెంబ్లీకి 20 నామినేషన్లు, 26 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంటు స్థానాలకు 2, దీనికి గాను 4 సెట్లు దాఖలయ్యాయి. పార్లమెంటు స్థానాలకు ఇలా.. నరసాపురం 1 ఏలూరు 1 అసెంబ్లీ స్థానాలకు ఇలా.. కొవ్వూరు 3 నిడదవోలు 2 ఆచంట 4 ఉండి 1 తణుకు 2 తాడేపల్లిగూడెం 2 ఉంగుటూరు 2 దెందులూరు 3 పోలవరం 1 పాలకొల్లు – నర్సాపురం – భీమవరం – ఏలూరు – గోపాలపురం – చింతలపూడి – -
పొత్తు పోటు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీజేపీతో పొత్తు జిల్లా తెలుగుదేశం పార్టీకి శరాఘాతంలా తగిలింది. కొందరు నేతల రాజకీయ భవిష్యత్ను చిదిమేసింది. చంద్రబాబును నమ్మి సీటుపై ఆశతో కొత్తగా పార్టీలో చేరిన నేతలు తాజా పరిణామాలతో విస్తుపోయి దిక్కులు చూస్తున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంటరీ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ బీజేపీకి కేటాయించింది. నరసాపురం పార్లమెంటరీ స్థానాన్ని మొదటి నుంచీ బీజేపీకి వదిలేస్తారని భావించినా తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటును వదులుకోవడం మాత్రం అనూహ్యమైన విషయంగానే విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బీజేపీకి వదిలేస్తారనే ప్రచారం రెండురోజుల నుంచీ సాగుతోంది. బీజేపీ నేతలు ఆ సీటు అడగకపోయినా చం ద్రబాబు ఒత్తిడి చేసి మరీ వారికివ్వడం ఇటీవలే టీడీపీలో చేరిన అక్కడి నేతలను విస్తుపోయేలా చేసింది. చంద్రబాబు వంచనతో వారి పరిస్థితి దయనీయంగా మారిపోయింది. కొట్టు, ఈలికి షాక్ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సీటును ఆశించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈలి నాని, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. కొట్టు సత్యనారాయణ దాదాపు మూడు నెలల నుంచి ప్రయత్నాలు చేసి టీడీపీ అధినేతతోపాటు స్థానిక నేతలు వద్దన్నా అందరినీ ఒప్పించి మరీ ఆ పార్టీలోకి వెళ్లారు. తనకే సీటు వస్తుందనే ధీమా మొన్నటివరకూ ఆయనలో కనిపించింది. ఈలి నాని సైతం తనకు మరో చోటైనా సీటిస్తారని ఆశించారు. ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న ముళ్లపూడి బాపిరాజుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన్ను జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో కొట్టు, ఈలి నానికి మార్గం సుగుమం అయినట్లే కనిపించింది. కానీ.. చివరి నిమిషంలో చంద్రబాబు ఈ సీటును బీజేపీకి ఇచ్చేసి ఇద్దరి నెత్తినా శఠగోపం పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కొట్టు సత్యనారాయణ లబోదిబోమంటూ బీజేపీ అగ్రనేతల వద్దకెళ్లి తాను బీజేపీలో చేరతానని.. తనకు సీటివ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే వారు ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడికొండల మాణిక్యాలరావును ఇక్కడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని చెబుతున్నారు. త్వరలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే పరిస్థితి కనిపిస్తోంది. రఘురామకృష్ణంరాజుకూ డౌటే! టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని ముందే ఊహించిన కనుమూరి రఘురామకృష్ణంరాజు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేయూలన్న తలంపుతో.. చంద్రబాబు ఆశీస్సులతో బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా ఇరకాటంలో పడింది. కేంద్ర మాజీ మంత్రి, సినీ ప్రముఖుడు యూవీ కృష్ణంరాజు నరసాపురం పార్లమెంటరీ సీటును ఆశిస్తున్నారు. తాజాగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు కూడా నరసాపురం సీటు కోసం ఢిల్లీలో లాబీయింగ్ నడుపుతున్నారు. ఆయన ఆదివారం ఆఘమేఘాల మీద బీజేపీ సభ్యత్వం తీసుకున్నట్లు సమాచారం. బీజేపీ పెద్దలు గంగరాజు అభ్యర్థిత్వం గురించి సీరియస్గా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రఘురామకృష్ణంరాజు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. అడిగింది ఒకటి.. ఇచ్చింది మరొకటి.. తొలుత బీజేపీ నేతలు ఉంగుటూరు, ఉండి అసెం బ్లీ స్థానాలు అడిగారు. దానికి చంద్రబాబు నిరాకరించి నరసాపురం లేదా తాడేపల్లిగూడెంలో ఏదో ఒకటి తీసుకోవాలని సూచించారు. నరసాపురం అయితే ఉపయోగం ఉండదని తేల్చిన బీజేపీ జిల్లా నేతలు తాడేపల్లిగూడెం కూడా వద్దని కొవ్వూరు, ఏలూరు స్థానాలను తమ పార్టీకి కేటారుుంచాలని కోరారు. కానీ చంద్రబాబు ఆ ప్రతిపాదనలన్నింటినీ తిరస్కరించి బలవంతంగా తాడేపల్లిగూడెం స్థానాన్ని అంటగట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.