breaking news
nalini gets parol
-
రాజీవ్ హంతకురాలు నళినికి పెరోల్
సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్కి మద్రాస్ హైకోర్టు 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. గత 28 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. తన కూమార్తె వివాహానికి ఆరు నెలలు పెరోల్ కావాలని, తాను స్వయంగా వాదించుకుంటానని మద్రాస్ హైకోర్టును ఆమె ఏప్రిల్లో కోరింది. కోర్టు అనుమతి మేరకు కోర్టులో స్వయంగా వాదనలు వినిపించింది. అయితే నళినికి ఆరు నెలలు ఇవ్వలేమనీ, ఇతర సాధారణ ఖైదీల్లాగే 30 రోజుల పెరోల్ను కోర్టు మంజూరు చేసింది. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వైజాగ్ నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్కి వెళ్లిన ఆనాటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. -
నళినికి 12 గంటల పెరోల్
తండ్రి అంత్యక్రియలకు హాజరు సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళినీ శ్రీహరన్కు ఆమె తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బుధవారం 12 గంటల పెరోల్ మంజూరైంది. పెరోల్పై ఆమె వేలూరు జైలు నుంచి చెన్నైకి చేరుకుని తండ్రి శంకర నారాయణ్(91) అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత మళ్లీ జైలుకు వెళ్లారు.2004లో తన సోదరుడి పెళ్లికి పెరోల్పై విడుదలైన నళిని ఆ తర్వాత బయటి ప్రపంచాన్ని చూడడం ఇదే తొలిసారి. రాజీవ్ హత్య కేసులో ఆమెకు 1998లో ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించగా, 2000లో రాష్ట్ర గవర్నర్ ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు.