breaking news
Munugode Assembly Constituency
-
మునుగోడు ఓట్ల వివరాలు ఇవే.. అలాగే మెజారిటీ ఓట్లు వీరివే..
మునుగోడు నియోజకవర్గం జిల్లా: నల్గొండ లోక్ సభ పరిధి: భువనగిరి రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 248,524 పురుషులు: 124,473 మహిళలు: 123,996 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి: నల్గొండ జిల్లా మునుగోడు చందూర్ మర్రిగూడ నాంపల్లి ఘాటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపూర్ చౌటుప్పల్ నియోజకవర్గం ముఖచిత్రం సీపీఐ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఇక్కడి నుంచి ఐదుసార్లు విజయం సాధించారు. ఇప్పటి వరకు మునుగోడులో పదకొండుసార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఐదుసార్లు, సీపీఐ ఐదుసార్లు విజయం సాధించాయి. 1967 వరకు ఈ స్థానం చిన్నకొండూరుగా ఉంది. తెలంగాణ ప్రముఖ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. మునుగోడులో కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాదించారు. 2009లో ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి ఈసారి మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాదించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ది కె. ప్రభాకరరెడ్డిపై 22,552 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97239 ఓట్లు రాగా, ప్రభా కరరెడ్డికి 74687 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.మనోహర్రెడ్డికి 12700 ఓట్లు వచ్చాయి. రాజగోపాలరెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడిరచారు. స్రవంతి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో పాల్వాయి గోవర్దనరెడ్డి పోటీచేసి ఓటమి పాలైతే, 2014లో ఆయన కుమార్తె ఓడిపోవలసి వచ్చింది. అయితే పాల్వాయి 2009లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఐ పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ,సిపిఐతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిపిఐ పోటీచేసినా సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది.సిపిఐ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డికి 20952 ఓట్లు వచ్చాయి. సీనియర్ సిపిఐ నాయకుడు ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలుపొందితే, ఆయన కుమారుడు యాదగిరిరావు ఒకసారి గెలుపొందారు. పాల్వాయి గోవర్ధనరెడ్డి మునుగోడులో ఐదుసార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన గతంలోమంత్రి పదవి నిర్వహించారు. మునుగోడులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఐదుసార్లు గెలిచాయి. టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది. స్వయంగా టిడిపి ఇక్కడ నుంచి గెలవలేదు.సిపిఐ మిత్ర పక్షంగా ఉన్నప్పుడు బలపరిచింది. మునుగోడులో తొమ్మిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసి(పద్మశాలి)నాలుగుసార్లు వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. -
‘డబ్బుల సంచులు పట్టుకుని వచ్చేవాళ్లతో జాగ్రత్త’
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాజాగా నల్లగొండలోని మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ను టార్గెట్ చేసి సంచలన విమర్శలు చేశారు. డబ్బులు చేతిలో పట్టుకుని వచ్చే వారితో జాగ్రత్త అని హెచ్చరించారు. అలగే, ఎన్నికలు ముగిసేలోపు మునుగోడు మరోసారి వస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక, బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కరెంట్ కోసం కర్ణాటకలో రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఓటు వేసే సమయంలో జాగ్రత్తగా వేయండి. దేశంలోనే పింఛన్లను పెంచిందే కేసీఆర్. పింఛన్లను ఐదు వేలకు పెంచుతాం. రైతు బీమా కల్పిస్తాం. మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నాం. రేషన్ కార్డుదారులకు అందరికీ సన్న బియ్యం అందిస్తాం. ఏమాయనే నల్లగొండ అనే పాట నేనే రాశాను. మునుగోడు ప్రజలు చైతన్యంతో ఓటు వేయాలి. డబ్బులు పట్టుకుని వచ్చేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నిన్న ఒక పార్టీ రేపు ఇంకో పార్టీ అని డబ్బు మదంతో ప్రవర్తించే వాళ్లకు బుద్ధి చెప్పాలి. పాలమూరు పూర్తి కావస్తోంది. డిండి ప్రాజెక్టు ద్వారా శివన్న గూడెంకు నీళ్లు అందిస్తాం. ఏడాది కాలంలో రెండు లక్షల ఎకరాలకు నీటిని అందిస్తాం. కాంగ్రెస్ వస్తే కరెంట్ సమస్యలు కర్ణాటకలో ఎలా సమస్య అవుతుందో అలా అవుతుంది. ఉప ఎన్నికల్లో చూపిన చైతన్యాన్ని చూపించి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి. మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం చండూర్ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకున్నాం. వంద పడకల ఆసుపత్రి పనులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ యాభై ఏళ్లు పాలించినా ఫ్లోరైడ్ను అరికట్టేందుకు ఏనాడు ప్రయత్నాలు చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో ఎవరు మనతో ఉన్నారో లేరో మీకు తెలుసు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చేది ఒక్క తెలంగాణ మాత్రమే అని అన్నారు. అంతకుముందు వనపర్తి సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ వచ్చింది. వలసల వనపర్తిని వరిపంటల వనపర్తి చేసిన మొనగాడు కావాలా.. మరొకరు కావాల్నో తేల్చుకోవాలె. నిరంజన్ రెడ్డి నీళ్ల కోసం కృషి చేసిండు. ధరణి తీసేస్తామని రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ధరణి వల్ల సమాజం శాంతిగా ఉంది. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్.. 18 మందికి సీటు దక్కేనా?