breaking news
mlc allegatins
-
MLC Elections: విఠల్ ఏకగ్రీవానికి టీఆర్ఎస్ విఫలయత్నం.. ‘విత్డ్రా’మా.. వివాదం
సాక్షి, ఆదిలాబాద్: ‘స్థానిక’ఎమ్మెల్సీ నామినేషన్ల ఉప సంహరణకు చివరిరోజైన శుక్రవారం ఆదిలా బాద్లో వివాదాలు తలెత్తాయి. తమ అభ్యర్థి దండె విఠల్ను ఏకగ్రీవం చేసుకునేందుకు టీఆర్ఎస్ నేత లు చివరివరకు ప్రయత్నించారు. నామినేషన్లు ఉప సంహరించుకోవాలంటూ స్వతంత్ర అభ్యర్థులపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో అందరూ విత్డ్రా చేసుకున్నా.. స్వతంత్ర అభ్యర్థి, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందూర్ పుష్పరాణి పోటీలో నిలిచారు. అంతకుముందు ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్ ఉపసంహరించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద పుష్పరాణి ధర్నా చేశారు. ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు, బీజేపీ శ్రేణులు ఆమెకు మద్దతు రావడం.. మరోవైపు పోటీగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీ సులు అప్రమత్తమై.. ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే పుష్పరాణి పోటీలో ఉన్నట్టు రిటర్నింగ్ అధి కారి ప్రకటించాక.. ఈ వివాదం సద్దుమణిగింది. (చదవండి: దేవుడిలా ఆదుకున్న పోలీస్.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రశంసలు) మరో అభ్యర్థి ఆందోళన మరోవైపు జాబితాలో తన పేరు లేకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థి పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నేతలు ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్ను ఉప సంహరించారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశానని, కోర్టును కూడా ఆశ్రయిస్తానని తెలిపారు. (చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) -
మావాడు.. పనికిమాలిన సీఎం: ఎమ్మెల్సీ
''ఇప్పుడున్నది అసలు రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పనికిమాలిన ముఖ్యమంత్రి.. వెంటనే ఆయనను మార్చేసి అనుభవజ్ఞుడైన, సమర్థుడైన కొత్త ముఖ్యమంత్రిని పెట్టండి. లేకపోతే పార్టీ మనుగడే అనుమానంలో పడుతుంది'' అని ఓ ఎమ్మెల్సీ తమ సొంత పార్టీ ముఖ్యమంత్రి గురించి వ్యాఖ్యానించారు. ఆ ఎమ్మెల్సీ పేరు.. దేవేంద్ర ప్రతాప్ సింగ్. ఆయన చెప్పిన ముఖ్యమంత్రి.. అఖిలేష్ యాదవ్. ఆయన సూచన చేసినది.. సాక్షాత్తు పార్టీ పెద్దాయన ములాయం సింగ్ యాదవ్కి. ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేసే అన్ని సంస్థలలోను అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని దేవేంద్ర ప్రతాప్ ఇటీవలే ఆరోపించారు. యూపీపీఎస్సీ గత రెండేళ్లలో చేసిన నియామకాలు అన్నింటి మీదా సీబీఐ దర్యాప్తు చేయించాలని జూలై నెలలో ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ కూడా రాశారు. నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న తర్వాత ఇప్పటికీ అఖిలేష్ యాదవ్ ఒక గుర్తింపు కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారని, చాలా సందర్భాల్లో ఆయన పనితీరు సరిగా ఉండట్లేదని సింగ్ తాజాగా చెప్పారు. యూపీ చరిత్రలోనే అత్యంత బలహీనమైన, అసమర్థ ముఖ్యమంత్రిగా ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. ఉత్తరప్రదేవ్ రాష్ట్రానికి అఖిలేష్ ఓ బండలా తగులుకున్నారని విమర్శించారు. అందువల్ల పార్టీ బతికుండాలంటే వెంటనే సీఎంను మార్చేయాల్సిందిగా నేతాజీని (ములాయం) కోరతున్నానని ఆయన విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు.