breaking news
Miss India 2015
-
ఓట్ ఫర్ మిస్ ఇండియా
మిస్ ఇండియా–2015 లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’ టైటిల్ విజేత దీక్ష యూపీ పంచాయితీ ఎన్నికల్లో జాన్పుర్ లోని బక్షా‘గ్రామ ప్రధాన్’గా పోటీ చేస్తున్నారు. నాలుగు విడతల ఆ ఎన్నికల్లో మొదటి విడతలోనే జాన్పుర్ జిల్లా ఉంది. పోలింగ్ ఏప్రిల్ 15 న. మే 2న ఫలితాల వెల్లడి. ‘‘నా చిన్నప్పుడు జాన్పుర్ ఎలా ఉందో ఈ రోజుకీ అలానే ఉంది. ఆ పరిస్థితిని మార్చేందుకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను’’ అని దీక్ష (24) అంటున్నారు. వాస్తవానికి దీక్ష ఇప్పటికే తన కెరీర్ని నిర్మించుకునే క్రమంలో వయసుకు మించిన గుర్తింపే తెచ్చుకున్నారు. ప్రధానంగా ఆమె మోడల్. పెద్ద పెద్ద కంపెనీలకు మోడలింగ్ ఇచ్చారు. త్వరలోనే వెబ్ సీరీస్లో కనిపించబోతున్నారు. ‘ఇష్క్ తేరా’ అనే ఒక సినిమా కథను రాసి, సినిమాగా తెరకు ఎక్కించేందుకు దర్శక నిర్మాతల కోసం చూస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె విడుదల చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ‘రబ్బా మెహర్ కరే’కు నెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇవన్నీ చేస్తున్న దీక్ష ఇప్పుడిక పంచాయితీ ఎన్నికల్లో గ్రామ ప్రధాన్గా పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేస్తున్నది 26 వ నెంబరు వార్డు అభ్యర్థిగా. ఆ వార్డు పేరు బక్షా. దీక్ష పుట్టింది అక్కడే.. బక్షా ప్రాంతంలోని చిత్తోరి గ్రామంలో. ఆ గ్రామం జాన్పుర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. బక్షా గ్రామ ప్రధాన్గా గెలిచి, క్రమంగా జాన్పుర్ జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి జరపాలని దీక్ష ఆశిస్తున్నారు. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు జాన్పుర్ ఎలా ఉందో ఇప్పటికీ ఏ అభివృద్ధీ జరగకుండా అలాగే ఉండటం! మిస్ ఇండియా 2015లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’గా టైటిల్ గెలుచుకున్నప్పుడు దీ„ý వయసు 18. అప్పుడు ఆమె ముంబైలో బి.ఎ.సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అప్పుడే ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆమె తండ్రి జితేంద్ర సింగ్ బిజినెస్మేన్. ముంబై, గోవా, రాజస్థాన్లలో వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. అలా వాళ్ల కుటుంబం ఉత్తరప్రదేశ్లోని జాన్పుర్ నుంచి ముంబైకి మారింది. దీక్ష ఇష్టాలు, ఆసక్తులు కూడా మారి మోడలింగ్ రంగంలోకి వెళ్లిపోయారు. ముంబైలో ఉంటున్న దీక్ష తరచు జాన్పుర్ వస్తుంటారు. ఈసారి అలా వచ్చినప్పుడే పంచాయితీ ఎన్నికల్లో నిలబడాలన్న ఆలోచన ఆమెకు కలిగింది. ‘‘చదువుకున్న అమ్మాయి కదా. నువ్వు గ్రామ ప్రధాన్ అయితే గ్రామం బాగుపడుతుంది. అంతే కాదు.. రాజకీయాల్లో నువ్వు పైపైకి ఎదిగిన కొద్దీ ఊరు, జిల్లా, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతాయి’’ అని ఊళ్లోని పెద్దలు మద్దతు ఇచ్చారు. తల్లి, తండ్రి కూడా సరేనన్నారు. అంతే.. ఏప్రిల్ 3 న నామినేషన్ వేశారు దీక్ష. ఆమె ఆ ఊళ్లో మూడో తరగతి వరకు చదివారు. గ్రామ ప్రధాన్గా ఎన్నికైతే కనుక అదే ఊరి చేత అభివృద్ధి అక్షరాలను దిద్దించబోతారు దీక్ష. -
ఆమె ఎంట్రీతో పంచాయతీ ఎన్నికలకు మరింత అందం!
లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలు కాస్త ఆసక్తిగా మారాయి. ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా బక్షా డెవలప్మెంట్ బ్లాక్ పంచాయతీ పోరులో భాగంగా ఆ గ్రామ 26వ వార్డు నుంచి మోడల్, అందాల రాణి దీక్షా సింగ్ బరిలోకి దిగుతున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు అందం తోడైంది. తన తండ్రి కోరిక మేరకు ఆమె రాజకీయాల్లోకి రానుంది. ఈ ఎన్నికల్లో బ్లాక్లో 26 వార్డు స్థానాన్ని మహిళకు కేటాయించగా, తండ్రి జితేంద్ర సింగ్ తన కుతూరును ఎన్నికల బరిలోకి దించాడు. ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి భాజపా అభ్యర్థి షాలినీ సింగ్తో పోటీ పడనున్నారు. కాగా, బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామానికి చెందిన దీక్ష సింగ్ 2015లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్గా నిలిచింది. అంతేకాకుంగా పలు ప్రైవేటు ఆల్బమ్స్తో పాటు పలు ప్రకటనల్లో కూడా కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ‘రబ్బా మెహర్ కారి’ పాటలో తలుక్కున మెరిసింది. ఆమె తండ్రి జితేంద్ర గోవా, రాజస్థాన్లో ట్రాన్స్పోర్టు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా, యూపీలో ఏప్రిల్ 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జాన్పూర్లో ఏప్రిల్ 15న పోలింగ్ నిర్వహించనున్నారు. చదవండి: ఎన్నికల రిజర్వేషన్ మహిళకు రావడంతో... పెళ్లి! -
కల్యాణ్రామ్తో మిస్ ఇండియా?
నందమూరి కల్యాణ్రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ‘మిస్ ఇండియా 2015’ టైటిల్ గెలుచుకున్న మోడల్ అదితీ ఆర్యని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ మధ్య ఓ సందర్భంలో ‘తెలుగు చిత్రాల్లో అవకాశం వస్తే, నటిస్తా’ అని అదితీ ఆర్య పేర్కొన్నారు. ఈ చిత్రానికి అడగ్గానే అంగీకరించారట. ఇప్పటికే ఆమెపై ఫొటో షూట్ కూడా చేసినట్లు వినికిడి. వచ్చే నెల నుంచి ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనున్నట్లు సమాచారం.