-
'మిణుగురులు' చిత్రానికి పదేళ్లు.. అమెరికాలో స్పెషల్ షో
అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014లో తెరకెక్కిన చిత్రం 'మిణుగురులు'. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్, దీపక్ సరోజ్ నటించిన ఈ చిత్రం ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో తాజాగా స్పెషల్ షో వేశారు. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుంచి ప్రశంసలందుకుంది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి, స్వర్గస్తులు దర్శకుడు - నిర్మాత దాసరి నారాయణ రావు, దర్శకుడు సుకుమార్, దర్శకుడు శేఖర్ కమ్ముల, పాటల రచయిత చంద్రబోస్ వంటి వారు ఈ చిత్రంలోని సామాజిక అంశాలని, సాంకేతిక విలువలని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణంశెట్టి మాట్లాడుతూ, "2014లో చిత్రం విడుదలైనప్పుడు సోషల్ మీడియా పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలయ్యుంటే జాతీయ అంతర్జాతీయ మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా అందరి నోటా ఒకే మాటగా వెళ్లేది. ఈ చిత్రంలోని సామాజిక విషయాలు పూర్తిగా పరిశోధించి, నిజ జీవితంలో చూపు లేని పిల్లల దయనీయ పరిస్థితిని చూపించటం జరిగింది. సరిగ్గా వారం కూడా ఆడని చిత్రాల మధ్య 'మిణుగురులు' 10 ఏళ్లు నిలిచింది అని ఈ కార్యక్రమానికి వచ్చిన ఒక ప్రేక్షకుడు అన్నారు. ‘మిణుగురులు’ 18వ అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో 'గోల్డెన్ ఎలిఫెంట్' గెలుచుకుంది. ఇండియా అంతర్జాతీయ డిసెబిలిటీ ఫిలిం ఫెస్టివల్,ఇతర ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి ఎంపికైంది. 9వ బెంగళూరు అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో 'ఉత్తమ చిత్రం' అవార్డు గెలుచుకుంది. 2014 లో 'అస్కార్స్' కి ఉత్తమ చిత్ర జాబితాలో ఎంపికయిన చిత్రాల్లో 'మిణుగురులు' కూడా ఉంది. ఆస్కార్ గ్రంథాల్లో శాశ్వత చిత్రాల జాబితాలో 'మిణుగురులు' కథ కూడా ఉంటుంది. అని ఆయన చెప్పారు. అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి జాతీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన దర్శకుడు. పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్లోని నార్త్ వెస్ట్ ఫిలిం సెంటర్లో ఫిలిం మేకింగ్ నేర్చుకున్న ఈయన అమెరికా టివి ఛానల్ ఓపిబిలో కొన్నేళ్లు పనిచేశారు. తన దర్శక నిర్మాణంలో తీసిన పలు షార్ట్ ఫిలిమ్స్, డాక్యూమెంటరీలు చాల అవార్డులు గెలుచుకున్నాయి. ఆయన 'మిణుగురులు' చిత్రం 2014 లో 7 నంది అవార్డులు గెలుచుకుంది. నేటి పరిస్థితులకి తగ్గట్టుగా ఉండే రొమాంటిక్ ప్రేమ కథతో '24 కిస్సెస్' అనే చిత్రాన్ని తీశారు. ఆయన తదుపరి కథల వరుసలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వనున్న గ్లోబల్, ఓటిటిలో చిత్రాలు ఉండడం విశేషం. -
అల్లరే నటుడ్ని చేసింది
‘మిణుగురులు’ నా జీవితంలో స్పెషల్ ‘లెజెండ్’తో మరింత గుర్తింపు ‘లవ్ కె రన్’తో హీరోగా ప్రమోషన్ బాల నటుడిగా 42 చిత్రాలు ఇదీ విశాఖ కుర్రోడు దీపక్ సరోజ్ సినీ ప్రొఫైల్ విశాఖపట్నం : దీపక్.. ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ, వెండితెరపై ఆ కుర్రాడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. చిన్నప్పుడు ఎవరైనా అల్లరి చేయడం సహజం. కానీ ఆ పిల్లాడి అల్లరిని తట్టుకోవడం మాత్రం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారింది. కానీ వారికి అప్పుడు తెలియదు..తమ పిల్లాడిలో ఉన్నది అల్లరి కాదు ‘హైపర్ యాక్టివ్’అని. (ఇటీవల ఓ చిత్రంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు). అయితే అతని ఇష్టాన్ని గుర్తించగలిగారు. డాన్స్మాస్టర్ శివకుమార్ వద్ద చేర్పించారు. అల్లరి చేసే సమయం ఇవ్వకుండా స్మిమ్మింగ్, స్కేటింగ్, క్యాషియో వంటివి నేర్పించే వారు. అలా తెలియకుండానే వినోద సంబంధిత రంగాలతో ఆ పిల్లాడు మమేకమైపోయాడు. వాటికి అలవాటు పడి, ఇష్టంగా మార్చుకున్నాడు. తన డాన్స్ పెర్ఫార్మెన్స్తో బహుమతులు అందుకోవడం ప్రారంభించాడు. అప్పటికి అతని వయసు కేవలం ఐదేళ్లు. ఆ తర్వాత ప్రముఖ నటనా శిక్షకుడు సత్యానంద్ వద్దకు చేరడంతో దీపక్ జీవితం పూర్తిగా మారిపోయింది. బాల నటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టేలా చేసింది. మిణుగురులు అనే చిత్రంతో ఆస్కార్ నామినేషన్ వరకూ వెళ్లి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 42 చిత్రాల్లో బాల నటుడిగా తానేంటో నిరూపించుకున్న దీపక్ తాజాగా లవ్ కె రన్ చిత్రంతో హీరో అయ్యాడు. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి: బాలనటుడిగా ఇప్పటి వరకూ చాలా చిత్రాల్లో నటించారు. ఎలా మొదలైంది మీ ప్రస్థానం. దీపక్ : సినిమాల్లోకి రావాలని అసలు అనుకోలేదు. చిన్నప్పుడు నా అల్లరి భరించలేక అమ్మా, నాన్న నాకు డ్యాన్స్ నేర్పించారు. ఐదేళ్ల వయసులో సత్యానంద్ మాస్టర్ దగ్గర నటనలో శిక్షణ ఇప్పించారు. అప్పట్లో ఓ టీవీ చానల్లో డుండుం డిగాడిగా అనే డాన్స్ ప్రోగ్రాం వచ్చేది. దానిలో స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా పెదబాబు చిత్రం మొదలుపెడుతున్నప్పుడు ఆయన చిన్నప్పటి పాత్రకు నన్ను ఎంపిక చేశారు. ఆ వెంటనే ఆర్య చిత్రంలో అవకాశం వచ్చింది. ప్రారంభంలోనే పెద్ద చిత్రాల్లో అడుగుపెట్టడంతో అక్కడి నుంచి వరుసగా ఆఫర్లు వచ్చాయి. అలా ఇప్పటికి 42 చిత్రాల్లో నటించాను. సాక్షి: వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే.. దీపక్ : అతడు, భద్ర, పౌర్ణమి, అసాధ్యుడు, డాన్, సోగ్గాడు, ఆంధ్రుడు, బావ, వంటి చాలా చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. నా జీవితంలో ‘మిణుగురులు’ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చిత్రానికి సెలక్షన్లకు వెళ్లినపుడు కళ్లు కనిపించని పిల్లాడ్ని ఇంటికి వచ్చిన వ్యక్తి అవమానిస్తే ఎలా స్పందిస్తాడో చేసి చూపించమని అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి చెప్పినపుడు పది నిమిషాలు సమయం ఇవ్వండి పాత్ర ను ఇమాజిన్ చేసుకుని చేస్తానన్నాను. ఆ మాటే ఆయనకు నచ్చిందని 15 రోజుల తర్వాత యు ఆర్ సెలెక్ట్టెడ్ అని చెబుతూ అన్నారు. 800 మంది ఉన్న పోటీలో నేను సెలెక్ట్ కావడం ఇప్పటికీ ఆశ్చర్యమే. మిణుగురులు కోసం 40 కిలోల బరువు సహజంగా తగ్గాను. ఆ కష్టం ఆస్కార్ వరకూ వెళ్లినపుడు మర్చిపోయాను. ఆ చిత్రం తర్వాత మళ్లీ పూర్తి భిన్నమైన ఛాలెంజింగ్ రోల్ ‘లెజెండ్’లో దొరికింది. బాలయ్య చిన్నప్పటి పాత్ర అది. తర్వాత రాజేంద్రప్రసాద్తో టామీ చిత్రంలో నటించి కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. సాక్షి: చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. దాని ప్రభావం చదువుపై పడలేదా? దీపక్ : లేదు..నేను మొదట్నుంచీ బాగా చదువుతాను. టెన్త్లో 95 పర్సంట్ మార్క్స్ వచ్చాయి. చెన్నై ఎస్ఆర్ఎంలో ఇటీవలే బీబీఎం పూర్తి చేశాను. ఎంబీఏ చేయడానికి సిద్ధమవుతున్నాను. నిజానికి నటనా రంగం నాకు గిఫ్ట్గా దొరికింది. నాకు నేనుగా నేర్చుకున్నది క్రికెట్. అదంటే చాలా ఇష్టం. ఓ రోజు లెజెండ్ సినిమా సెట్లో బాల కృష్ణను అవుట్ చేసి ‘వీడు ఫర్ఫెక్ట్’ అనిపించుకున్నాను. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో కూడా పాల్గొన్నాను. సీసీఎల్కు ఆడే అవకాశం ఉంది. సాక్షి: ఇండస్ట్రీలో ఎవరంటే ఇష్టం దీపక్ : ఒక్కరని చెప్పడం కష్టం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే వ్యక్తి గతంగా చిరంజీవి అంటే పిచ్చి. ఇప్పటి హీరోల్లో అందరూ ఇష్టమే. రామానాయుడు వంటి పెద్దవాళ్లు నువ్ పెద్దవాడివి ఎప్పుడవుతావురా హీరోని చేద్దాం అనేవారు. విశ్వనాథ్ వంటి గొప్పవారు నా నటనను మెచ్చుకునేవారు. టామీ చిత్రం చూసి ఎమ్మెస్ నారాయణ పిలిచి అభినందించారు. సాక్షి: భవిష్యత్ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు దీపక్ : హీరోగా కంటే నటుడిగా అందరికీ గుర్తుండాలనుకుంటాను.ప్రయోగాలు చేయడం ఇష్టం. కమల్హాసన్, నసీరుద్దీన్షా,విక్రమ్, కోటా శ్రీనివాసరావు, ప్రకాష్రాజ్ వంటి వాళ్ల నటనను చూసి నేర్చుకుంటుంటాను. ‘లవ్ కె రన్’ కూడా మంచి కథ. ఈ చ్రితంలో మళయాల హీరోయిన్ మాళవిక మీనన్ నాకు జతగా చేసింది. ఇక ముందు చేయబోయే ప్రాజెక్టులపై మరింత శ్రద్ధ అవసరం. చదువుకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మంచి అవకాశం కోసం ఎదురు చూడాలనుకుంటున్నాను. -
చాలా కష్టపడ్డాను
‘మిణుగురులు’తోఅరంగేట్రం ‘నిర్మలా కాన్వెంట్’లో చక్కటి పాత్ర వరుస చిత్రాలతో అలరిస్తున్న రమణ పెందుర్తి: వెండితెరపై పెందుర్తికి చెందిన పీలా రమణ మెరుస్తున్నాడు. వరుస చిత్రాలతో తన జోరు చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అరంగేట్రం ఆలస్యమైనా వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకుని సినీ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు. ఆస్కార్ బరిలో నిలిచిన తెలుగు చిత్రం ‘మిణుగురులు’తో అరంగేట్రం చేసిన పీలా రమణ అనతికాలంలోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. పలు చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని తన జోరు చూపిస్తున్నాడు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రతో రూపొందిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో రమణ చక్కని పాత్ర పోషించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. దీంతోపాటు రమణ నటించిన ‘ఆకలి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. సంపూర్ణేష్బాబు ‘కొబ్బరిమట్ట’తో పాటు మరికొన్ని చిత్రాలు, టీవీ సీరియళ్లలో కూడా రమణ నటిస్తున్నాడు. ‘మిణుగురులు’ల్లో మెరిసి.. పెందుర్తిలో నివాసం ఉంటున్న రమణది మధ్య తరగతి కుటుంబం. స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద ఓ పాన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడం అలవాటు. ఆ క్రమంలోనే సినీరంగంపై మక్కువ పెంచుకున్నాడు. ఇదే క్రమంలో సినీ అవకాశాల కోసం చాలాకాలం ప్రయత్నిస్తూ చివరకు సఫలమయ్యాడు. 2014లో ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం రేసులో బరిలో నిలిచిన ‘మిణుగురులు’లో డర్టీ పోలీస్ పాత్రలో రమణ అరంగేట్రం చేశారు. తర్వాత 30 వరకు చిత్రాల్లో పలు పాత్రలు పోషించారు. సినీ పరిశ్రమతో పాటు అభిమానులు, పెద్దల మన్ననలు పొందారు. కల నెరవేరింది ఆస్కార్ రేసులో నిలిచిన చిత్రంతో నా అరంగేట్రం మరిచిపోలేని అనుభూతి. తాజాగా నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించిన ‘నిర్మలా కాన్వెంట్’లో నటించాను. పెందుర్తి నుంచి చిత్ర పరిశ్రమకు వెళ్లే క్రమంలో చాలా కష్టపడ్డాను. చివరకు అవకాశాలు రావడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రతిభతో రానున్న కాలంలో మరింత రాణిస్తాను. విశాఖ సినిమా పరిశ్రమకు చాలా అనుకూలం. ఇక్కడకు పరిశ్రమ పూర్తిస్థాయిలో వస్తే నాలాంటి ఔత్సాహిక కళాకారులకు అవకాశాలు వస్తాయి. - పీలా రమణ -
మిణుగురులు తరహాలో...
అందంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఓ వ్యక్తి అనుకోకుండా కాలు పోగొట్టుకుంటాడు. ఆ వ్యక్తి తన మిగతా జీవితాన్ని ఎలా గడిపాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బంగారు పాదం’. దయా, జ్యోతిశ్రీ ముఖ్య పాత్రల్లో స్వీయదర్శకత్వంలో ఎన్.హెచ్.ప్రసాద్ నిర్మించారు. దర్శక-నిర్మాత మాట్లాడుతూ -‘‘రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. వస్తువులకు, మనుషులకు ఉన్న సంబంధాలను ఈ సినిమాలో చూపించాం’’ అని చెప్పారు. ‘‘ ‘మిణుగురులు’ చిత్రం తర్వాత ఆ తరహాలో ఉండే ఈ చిత్రానికి సంగీతం అందించాను. అందరికీ నచ్చే సినిమా ఇది’’ అని సంగీత దర్శకుడు జోశ్యభట్ల తెలిపారు. -
బుల్లితెరపై మిణుగురులు
‘మిణుగురులు’... గత ఏడాది జనవరిలో రిలీజైన ఈ ఆలోచనాత్మక చిత్రం గుర్తుందా? ఒక అంధుల హాస్టల్లో జరిగే అన్యాయాల మీద విద్యార్థులు తిరగబడే ఇతివృత్తంతో ప్రవాస భారతీయుడు అయోధ్యకుమార్ క్రిష్ణంశెట్టి రూపొందించిన సినిమా అది. రెండేళ్ళ క్రితం హైదరాబాద్లో జరిగిన ‘అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం’లో లైవ్యాక్షన్ కేటగిరీలో పోటీపడిన ఈ సినిమా పలువురు విమర్శకుల ప్రశంసలందుకొంది. పలు అవార్డులందుకొన్న ఈ చిత్రం తొలిసారిగా టీవీలో రానుంది. ఈ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ‘మా’ టీవీలో ప్రసారమవుతోంది. ‘‘ఇలాంటి చిత్రాల్ని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు తీయాలనే ఉత్సాహం వస్తుంది. ప్రస్తుతం ఆరేడు బౌండ్ స్క్రిప్టులతో ప్రముఖ నటీనటుల్ని కలిశాను. ఈ నెలలోనే కొత్త సినిమా ప్రకటన చేస్తున్నా’’ అని నాలుగేళ్ళ పాటు అమెరికాలో ఫిల్మ్ మేకింగ్లో డిగ్రీ చేసిన అయోధ్యకుమార్ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement