breaking news
Minister pattipati pullarao
-
20 నుంచి చంద్రన్న క్రిస్మస్ కానుకలు: ప్రత్తిపాటి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి చంద్రన్న క్రిస్మస్ కానుకలను ఉచితంగా పంపిణీ చేయను న్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అలాగే, జనవరి 1వ తేదీ నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు అందిస్తామన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్కార్డులు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న కోటీ 43లక్షల 30వేల కార్డుదారులకు రూ.360కోట్లతో చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు చంద్రన్న క్రిస్మస్ కానుకలు, జనవరి 1 నుంచి ఇతర రేషన్ సరుకులతో కలిపి చంద్రన్న సంక్రాంతి కానుకలను అందిస్తామని మంత్రి తెలిపారు. -
సీఐడి నివేదిక తప్పని పత్తిపాటి అంగీకరిస్తారా ?
-
ఇలాగే అవమానిస్తే ధర్నా చేస్తా
అసెంబ్లీలో తనకు మాట్లాడే చాన్సివ్వకపోవడంపై విష్ణుకుమార్రాజు కినుక సాక్షి, హైదరాబాద్: ‘ప్రతిసారీ నాకు అవమానం జరుగుతోంది... మరోమారు ఇలాగే అవమానిస్తే ధర్నా చేస్తా’ అని బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్రాజు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వెలిబుచ్చారు. ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ఇరకాటంలో పెట్టకుండా సహకరిస్తుంటే ఇలా అవమానించటం సరికాదని, కేంద్రంలో అధికారంలో ఉన్న, రాష్ర్టంలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న జాతీయపార్టీకి పక్కనే ఉన్న తెలంగాణ అసెంబ్లీలో ఎలా అవకాశాలిస్తున్నారో, గౌరవిస్తున్నారో తెలుసుకోండంటూ ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఆయన స్పష్టం చేశారు. ఆగ్రిగోల్డ్ అంశంపై సోమవారం శాసనసభలో చర్చ సందర్భంగా మాట్లాడేందుకు అవకాశమివ్వాలంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావును విష్ణుకుమార్రాజు మూడుసార్లు చెయ్యెత్తి కోరారు. ఒకసారి నిలుచుని అడిగారు. అయినప్పటికీ స్పీకర్ దృష్టి ఆయనపై పడలేదు. ఈలోగా అర్ధంతరంగా సభను మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో సభనుంచి ఆగ్రహంగా బయటికొచ్చిన విష్ణుకుమార్రాజు అసెంబ్లీ లాబీల్లో తారసపడిన మంత్రులు యనమల, ప్రత్తిపాటి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. తీవ్ర స్వరంతో తన అసంతృప్తిని మంత్రులముందు వెళ్లగక్కారు. దీంతో లాబీల్లో ఉన్నవారి దృష్టి అటు పడింది. ఇది ఇబ్బందికర పరిణామంగా భావించిన మంత్రి యనమల.. బీజేఎల్పీ నేత చేయి గట్టిగా నొక్కుతూ మీకన్యాయం జరిగింది, మరోసారి అలా జరగకుండా చూస్తాం, రేపు(మంగళవారం) మాట్లాడేందుకు అవకాశమిస్తాం, శాంతించండని కోరారు. అయితే విష్ణుకుమార్రాజు తగ్గలేదు. దీంతో మంత్రులు వడివడిగా నడుచుకుంటూ బయటికొచ్చి తమ కార్లలో ఎక్కి వెళ్లిపోయారు. ఇలా జరగడం బాధిస్తోంది.. తమ నేతకు ఏపీ అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం లభించలేదని తెలుసుకున్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎందుకలా జరిగిందో విష్ణుకుమార్రాజును వాకబు చేశారు. సభలో నలుగుర ముంటే.. అందులో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు, మరో ఇద్దరం సభ్యులుగా ఉన్నా కనీసం మాట్లాడే అవకాశం రావట్లేదని విష్ణుకుమార్రాజు చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నా మంచి అవకాశాలిస్తున్నారు, బాగా గౌరవిస్తున్నారని, కానీ మాదగ్గర పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందన్నారు. అనంతరం విష్ణుకుమార్రాజు మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులు తనను కలసి వినతిపత్రం అందచేశారని, 40 లక్షలమంది బాధితులపక్షాన బీజేపీ వాదన ను సభలో వినిపించేందుకు అవకాశమివ్వకపోవటం బాధాకరమన్నారు. భూకేటాయింపుల్లో జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమల పేరుతో చేసే భూ కేటాయింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజు కోరారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని మోసం చేసే సంస్థలు చాలా ఉంటాయన్నారు. అందువల్ల భూములు కేటాయించే సమయంలో ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ‘కోటు వేసుకుని వచ్చేవారికి భూములిచ్చేస్తున్నారు. దీనివల్ల భూమిపోతోందేగానీ ఉపాధి లభించట్లేదు. బ్రాడిక్స్ ఇలాగే రూ.3,500 కోట్ల పెట్టుబడి పెడతామని, 60 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వాన్ని భ్రమల్లో పెట్టి భూమి కొట్టేసింది’ అని అన్నారు. -
దారుణ మాయ
రైతున్నపై ప్రకృతి పగబట్టింది. వరుణుడు కరుణించలేదు. పంటలు భూముల్లోనే ఎండిపోయాయి. సాగుకోసం చేసిన అప్పులు మిగిలాయి. బ్యాంకులో నగలు కుదవ పెట్టిన బంగారు నగలు విడిపించుకోలేకపోయాడు. బ్యాంకుల్లో రుణానికి వడ్డీ తోడు కావడంతో అప్పుల కుప్పలు మిగిలాయి. ఆడబిడ్డకు పెళ్లి చేయాలని, కొడుకును పెద్ద చదువులు చదివించాలనేఆశలు తీరలేదు. పదుగురికి పట్టెడన్నం పెట్టే రైతన్న పరువు కాపాడుకునేందుకు పరితపించాడు. ఇదే సమయంలో ఎన్నికలొచ్చాయి. అధికారం కోసం చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. పదవి చేపట్టగానే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నారు. బ్యాంకులకు అప్పులు కట్టవద్దన్నాడు. గుడ్డిగా నమ్మిన జనం రుణాల చెల్లింపులో జాప్యం చేశారు. మాఫీ ప్రకటనకు రకరకాల నిబంధనలు పెట్టారు. మొదటి రెండు విడతల్లో ప్రభుత్వం జమ చేసిన మొత్తం వడ్డీకి కూడా చాలలేదు. ఈ క్రమంలో రెండేళ్లు గడిచాయి. ఇక ఆగడం తమ వల్ల కాదని బ్యాంకులు కొరడా ఝుళిపించాయి. అప్పు చెల్లించకుంటే నగలు వేలం వేస్తామని నోటీసులు జారీ చేశాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేసేశాయి. కాగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు బుధవారం శాసనసభలో చేసిన ప్రకటనతో రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు. ‘బ్యాంకుల్లో రైతులు బంగారం తాకట్టు రుణాలకు సంబంధించిన బంగారు నగలు వేలం వేస్తున్నట్లు మాకు సమాచారంలేదు.’ ఇదీ అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటన. ‘రుణమాఫీలో పేరుందో? లేదో? మాకు సంబంధం లేదు. ముందు అసలు, వడ్డీతో అప్పు తీర్చాల్సిందే.’ ఇదీ బ్యాంకర్ల నైజం. రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలతో రైతులు రుణాల చెల్లింపులో కాస్త ఉదాసీనంగా వ్యవహరించారు. దీంతో వడ్డీలకు వడ్డీలు పడి, రుణ భారం పెరిగింది. ప్రస్తుతం ఆ రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. అయితే బ్యాంకర్లు బంగారు రుణాలకు సంబంధించి వేలం నోటీసులు జారీ చేస్తుండడంతో రుణమాయలో పడి దారుణంగా మోసపోయామని బాధపడుతున్నారు తిరుపతి: బాబు మాటలు నమ్మి అన్నదాతలు నట్టేట మునిగారు.. ఎవరూ రుణాలు చెల్లించవద్దు.. బంగారు రుణాలు విడిపించే పూచి నాది చెల్లెమ్మలు అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అందరూ నమ్మారు. రుణాలపై వడ్డీ చెల్లించలేదు. అసలుతో కలిసి అప్పు మొత్తం కొండలా పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా అప్పుతీర్చమని నోటీసులు, వేలం వేస్తామంటూ పత్రికల్లో ప్రకటనలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కళ్ల ముందే బంగారం వేలం వేయడాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అన్నదాత గుండెకు గాయాన్ని చేశాయి. పంట రుణాలు తీసుకున్న రైతుల బంగారు నగలను బ్యాంకులు వేలం వేస్తున్న సమాచారం లేదని చెప్పడం చూసి రైతన్నలు నివ్వెర పోతున్నారు. తమకు వచ్చిన నోటీసులు చేత బట్టుకుని ఇవేంటని ప్రశ్నిస్తున్నారు. బంగారు రుణాలు ఇలా... 2013-14వరకు బంగారు రుణాలు తీసుకున్న రైతులు: 2,01,751 రుణం మొత్తం: రూ.1682 కోట్లు అన్నదాతకు కష్టాలు జిల్లాలో 2013 డిసెంబరు వరకు 8,70,321 మంది రైతులు రూ.11,180 కోట్ల రుణం తీసుకున్నారు. ఇందులో 5.63 లక్షల మంది రైతుల రుణాలను బ్యాంకర్లు అనుసంధానం చేశారు. తొలి విడతలో 3,06,544 మంది, రెండో విడతలో 1,42,229 మొత్తం 4,53,773 మంది రైతులు రుణమాఫీ పొందారు. వీరంతా కేవలం రూ.600 కోట్ల మాత్రమే రుణమాఫీ పొందడం గమనార్హం. పెరిగిన బంగారు రుణాలు వ్యవసాయ రుణాలకు సంబంధించి రెన్యూవల్స్ చేయకపోవడంతో అమాంతం వడ్డీ భారం పెరిగింది. దీంతో చేసేదీమి లేక పంటల సాగు కోసం ఉన్న అరకొర బంగారు నగలను సైతం అన్నదాతలు బ్యాంకులో కుదవ పెట్టారు. 2014-15లో 2.05,012 మంది రైతులు రూ.1553.15 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది ఏకంగా బంగారు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య మరింత పెరిగింది. 2015-16లో 3,41,283 మంది రైతులు రూ 2504.32 కోట్ల రుణాన్ని తీసుకోవడం గమనార్హం. నోటీసు ఇవ్వకుండా వేలం వేశారు వాల్మీకిపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 47 గ్రాముల బంగారం తాకట్టు పెట్టి రూ.70 వేలు అగ్రికల్చరల్ గోల్డ్లోన్ తీసుకున్నాను. రూ.19,202.94 మాఫీ అయినట్లు రుణ విముక్తి పత్రం కూడా అందింది. బ్యాంక్కు వెళ్లి మిగతా సొమ్ము చెల్లించి బంగారాన్ని తీసుకుందామంటే వేలం వేసేశామని చెబుతున్నారు. నోటీసులు కూడా పంపకుండా వేలం ఎలా వేస్తారని అడిగితే పేపర్ ద్వార సమాచారం ఇచ్చామని బుకాయిస్తున్నారు. -సి.రమణ, సరిమడుగు, గుర్రంకొండ (మం) చెప్పకుండానే వేలం వేసేశారు రెండేళ్ల క్రితం అంగళ్లు ఎస్బీఐలో 125 గ్రాముల బంగారం తాకట్టుపెట్టి రూ.1.25 లక్షలు పంట రుణం తీసుకున్నా. అసలు వడ్డీ కలిపి రూ.1.85 లక్షలు అయ్యింది. రుణమాఫీ అవుతుందని ఆశపడ్డాను. కానీ మాఫీ కాలేదు. పెరిగిన వడ్డీతో కట్టలేకపోయా. రూ.3 లక్షలకు పైగా విలువచేసే నగలను నాకు తెలియకుండానే వేలం వేసేశారు. -ఎం.నాగిరెడ్డి, అంగళ్లు, కురబలకోట (మం)