breaking news
meerut hospital
-
మత వివక్ష; ఆసుపత్రి యాజమాన్యం క్షమాపణ
లక్నో: మత వివక్షకు పాల్పడ్డ ఆసుపత్రి యాజమాన్యం తన తప్పు తెలుసుకుని క్షమాపణలు తెలిపిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో వాలంటీన్ క్యాన్సర్ ఆసుపత్రి శుక్రవారం నాడు వివాదాస్పద ప్రకటన చేసింది. తమ ఆసుపత్రికి వచ్చే ముస్లిం రోగులు, వారి సంరక్షకులు కరోనా వైరస్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలంది. ఎంత ఎమర్జెన్సీ అయినప్పటికీ ముందుగా పరీక్షలు చేయించుకున్న తర్వాతే చికిత్స అందిస్తామంది. ఈ పరీక్షలకు ప్రతి ఒక్కరు రూ.4500 చెల్లించాలని కోరింది. అయితే ఆస్పత్రికి చెందిన ముస్లిం వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నుంచి మాత్రం రుసుము వసూలు చేయబోమని తెలిపింది. (‘పాకిస్తాన్ వెళ్లిపోండి!’) ఈ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వస్తేనే తమ ఆసుపత్రిలో చేర్చుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పత్రికలో ప్రకటన ఇచ్చింది. ఇందులో తబ్లిగి జమాత్ సభ్యుల ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సైతం ప్రస్తావించింది. అయితే మత వివక్షను వెల్లగక్కుతూ పత్రికలో ఇచ్చిన యాడ్పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. దీంతో శనివారం నాడు సదరు ఆసుపత్రి యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమ ప్రకటన కొందరి మనోభావాలను కించపరిచినందున క్షమాపణలు కోరుతున్నట్లు పత్రికలో మరో యాడ్ ఇచ్చింది. ఈ సందర్భంగా అన్ని మతాలవారు కలిసికట్టుగా కరోనాపై పోరాడాలని పిలుపునిచ్చింది (ఒక్కరోజులో 1,324 పాజిటివ్ కేసులు ) -
కొడుకు శవంతో.. రాత్రంతా ఆస్పత్రి ముందు!
-
కొడుకు శవంతో.. రాత్రంతా ఆస్పత్రి ముందు!
'స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్'.. ఈ మాట ఎన్ని సంవత్సరాల నాటిదైనా ఇప్పటికీ దాని విలువ అలాగే ఉంది. పెళ్లికి ఎంత ఖర్చవుతుందో చావుకు కూడా దాదాపు అంతే ఖర్చవుతోంది. అది భరించలేని వాళ్లకు నరకం కళ్లెదుటే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో కొడుకు శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి తల్లి దగ్గర డబ్బులు లేకపోవడంతో... రాత్రంతా ఆ శవాన్ని కళ్లెదుటే పెట్టుకుని జాగారం చేయాల్సి వచ్చింది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న తన కొడుకుని ఆమె ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆ పిల్లాడు మరణించాడు. కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్సుకు ఫోన్ చేయగా.. శవాన్ని తీసుకెళ్లాలంటే రూ. 1500 ఖర్చవుతుందని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. ఆమె దగ్గర అతడికి ఇవ్వడానికి ఆమ మాత్రం డబ్బులు కూడా లేకపోవడంతో ఎలాగోలా తీసుకెళ్లాలని ప్రాధేయపడింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆ తల్లి.. రాత్రంతా కొడుకు శవాన్ని కళ్ల ముందు పెట్టుకుని అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఇటీవలే కాన్పూర్లోని జేఎస్వీఎం మెడికల్ కాలేజిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 12 ఏళ్ల పిల్లాడు తండ్రి భుజాల మీదే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక ఒడిషాలో అయితే ఓ వ్యక్తి తన భార్య శవాన్ని ఇంటికి తీసుకెళ్లే దారి లేక పది కిలోమీటర్ల దూరం శవాన్ని భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.