breaking news
mastanvali
-
చాగలమర్రి ఎంపీపీకి నోటీసులు
చాగలమర్రి: చాగలమర్రి మండల పరిషత్ అధ్యక్షుడు మస్తాన్వలికి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి నోటిసులు అందాయి. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మూడు సాధారణ సమావేశాలకు వరుసగా గైర్హాజరయ్యారు. ఇందుకు సంబంధించి ఎంపీడీఓ శ్రీలత గత సమావేశం తర్వాత జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. మస్తాన్వలి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఏడాది కాలంగా కడప కేంద్ర కరాగారంలో ఉన్నారు. అప్పటి నుంచి మండల ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఎంపీపీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నోటీసులకు సంబంధించి ఎంపీపీ 30 రోజుల్లో సంజాయిషీ(వివరణ) ఇవ్వాల్సి ఉందని ఎంపీడీఓ తెలిపారు. -
నమ్మి మోసపోయాను
రుద్రవరం : మస్తాన్వలి తనను నమ్మించి మోసం చేశాడని ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితురాలైన సినీనటి నీతూ అగర్వాల్ స్పష్టం చేశారు. అరెస్టయిన ఆమె ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ప్రతి ఆదివారం రుద్రవరం పోలీసుస్టేషన్లో సంతకం చేయాల్సి ఉంది. ఆమేరకు ఆదివారం ఇక్కడికి వచ్చారు. స్టేషన్లో సంతకం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సినీ పరిశ్రమకు ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎర్రచందనం స్మగ్లరు అయిన మస్తాన్ వలి తనను నమ్మించి మోసం చేశాడన్నారు. ప్రేమించినట్లు నటించి తన బ్యాంక్ అకౌంట్ నుంచి స్మగ్లర్ల అకౌంట్కు డబ్బులు డ్రా చేయించాడని తెలియజేశారు. ఇందులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా నీతూ అగర్వాల్ రుద్రవరం పోలీసు స్టేషన్కు వచ్చారని తెలుసుకున్న యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో జనం స్టేషన్కు చేరుకున్నారు. ఎర్రచందనం కేసులో 12 మంది నిందితులు.. పిబ్రవరి 3వ తేదీన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడుగా మస్తాన్ వలి, అతడి తమ్ముడు బాబావలితోపాటు డ్రైవర్ మహ్మద్వలి, బాల నాయక్, శంకర్ నాయక్, తిరుపాల్ నాయక్, నరసింహనాయక్, లక్ష్మణ్ నాయక్, నీతూ అగర్వాల్ను అదుపులోనికి తీసుకున్నామని ఎస్ఐ హరినాథరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన అటో ఓనర్ సుబ్బయ్య, మస్తాన్ వాహనం మాజీ డ్రైవర్ హరితోపాటు ఎర్రచందనం దుంగలను విక్రయించిన అహోబిలం గ్రామానికి చెందిన అంకన్నను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. సినీనటి నీతూ అగర్వాల్పై దాడి కలకలం శిరివెళ్ల: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు సినీనటి నీతూ అగర్వాల్పై ఆదివారం శిరివెళ్లలో దాడి జరిగిందన్న వార్త కలకలం రేపింది. కండిషన్ బెయిల్పై ఉన్న నీతూ ప్రతి ఆదివారం రుద్రవరం స్టేషన్లో సంతకం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం నీతూ తన లాయర్తో కల్సి ఉదయం రుద్రవరం స్టేషన్లో సంతకం చేసింది. తిరిగి శిరివెళ్ల మీదుగా నంద్యాల వైపు కారులో వెళ్తుండంగా శిరివెళ్ల మెట్ట వద్ద ఉన్న కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద నంద్యాలకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్ డ్రైవర్ నాగరాజు వచ్చి నీతూ కారు ఆపారు. అప్పు విషయంపై సినీనటి, డ్రైవర్ మద్య వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సినీనటి వెంటనే స్థానిక పోలీస్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేసింది. అయితే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అందుకు ఆమె అంగీకరించలేదు. ప్రతి ఆదివారం స్టేషన్లో సంతకం చేయాల్సి ఉందని సినీనటి అయినందున మార్గమధ్యంలో ఇబ్బంది ఉందని పోలీసులకు తెలియజేశారు. రక్షణ కల్పించాలని కోరి వెళ్లిపోయారు. కాగా నటి, డ్రైవర్ మధ్య ఉన్న అప్పు విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై సీఐ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతు ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు. డ్రైవర్కు నటి రూ. 5 వేల అప్పు ఉందని ఆ విషయంపై డ్రైవర్ కారు ఆపి అడిగారన్నారు. అయినా డ్రైవర్ను పిలిపించి విచారణ జరుపుతామని తెలిపారు. -
సాక్షి విలేకరిపై దాడి
గుంటూరు: గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పర్యటన వార్త కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరి మస్తాన్వలిపై కొం దరు దుండగులు దాడికి తెగబడ్డారు. సరస్వతి సిమెంట్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూ ముల్లో అక్రమంగా కొందరు రైతులు పంటలు పండించారు. వాటిని తొలగించాలని యాజమా న్య ప్రతినిధులు డిమాండ్ చేయగా వివాదం చెలరేగింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్యే యరపతినేని బుధవారం వచ్చా రు. ఆయన వార్త కవరేజీకోసం వెళ్లిన విలేకరిపై రైతులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. పోలీ సులు రంగప్రవేశంచేసి విలేకరిని రక్షించారు. వారు చెన్నాయపాలెం గ్రామ శివారు వరకు రక్షణగా వ చ్చారు. అక్కడినుంచి స్నేహితులు ద్విచక్రవాహనంపై ఇంటికి చేర్చారు. వివాదానికి కారణమైన భూములను ఎమ్మెల్యే యరపతినేని బుధవారం పరిశీలించారు. పాడైన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున, స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.5 వేలు అందిస్తానని హామీ ఇచ్చారు. అయితే పత్తి పంటలో ఐదు పెట్రోలు సీసాలు, బాంబులు, కత్తులు, కొడవళ్లు కనిపించాయి. ఎమ్మెల్యే చెన్నాయపాలెం గ్రామానికి సుమారు 35 వాహనాల్లో సుమారు 150 మంది జనంతో రావడం గమనార్హం.